Vijayasai Reddy : నన్ను గెలికితే నీకే నష్టం అంటూ జగన్ కు విజయసాయి వార్నింగ్
Vijayasai Reddy : వైసీపీ పార్టీలో నాయకత్వంలో వివాదాలు రోజు రోజుకు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. కొద్దీ రోజులుగా సైలెంట్ గా ఉన్న మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఒక సుదీర్ఘ ట్వీట్ ద్వారా తన మనసులో మాట బయటపెట్టారు. పార్టీకి తన సేవలు చేసిన తనలాంటి నాయకుడిని అనవసరంగా లక్ష్యంగా చేసుకోవడం సరికాదని, ఇది చివరికి జగన్ కే నష్టంగా మారుతుందని హెచ్చరించారు. తాను రాజకీయంగా స్వేచ్ఛావంతుడిని అని పేర్కొంటూ, వ్యక్తిగత పరిచయంతోనే టీడీపీ నేత ఆదిశేషగిరిరావును కలిశానని స్పష్టం చేశారు. అయితే ఈ సమావేశాన్ని టీడీపీలో చేరేందుకు మొదటి అడుగు అనే అర్థం చేసుకోవడం పొరపాటని, తాను ఈ జన్మలో టీడీపీలో చేరే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
Vijayasai Reddy : నన్ను గెలికితే నీకే నష్టం అంటూ జగన్ కు విజయసాయి వార్నింగ్
వైసీపీ లోని కొందరు నేతలు లిక్కర్ స్కాం వంటి విషయాల్లో తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని విజయసాయి మండిపడ్డారు. జగన్ ఒకవైపు అలాంటి స్కాంలు లేవని చెబుతుండగా, ఆయన కోటరీ మాత్రం ఇదే అంశంపై తనను విమర్శించడం విడ్డూరంగా ఉందని తెలిపారు. గతంలో తనపై నమోదైన కేసుల్లోనూ తాను నిష్కల్మషుడిగా ఎదుర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. ఈరోజు కూడా జగన్ కోసం ఏమైనా భరించడానికి సిద్ధమని చెప్పారు కానీ కోటరీ అజ్ఞానంతో కేసులు మోపితే ఎందుకు భరించాలో ఆయన ప్రశ్నించారు.
మొత్తానికి విజయసాయిరెడ్డి ఈ వివాదంలో జగన్ పై సాఫ్ట్ కార్నర్ ఉంచినా, ఆయన చుట్టూ ఉన్న కోటరీని తీవ్రంగా విమర్శించారు. జగన్ నమ్మే వ్యక్తుల అనుభవలేమి వల్లే పార్టీకి నష్టం జరుగుతోందని పేర్కొన్నారు. తనను కెలకడం ద్వారా రాజకీయ లాభం ఏమి రాదని, తానొక పొలిటికల్ ఫ్రీ బర్డ్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. పార్టీ నుంచి దూరంగా ఉన్న ఆయనను మరింతగా అణగదొక్కాలని ప్రయత్నిస్తే, దాని ప్రభావం ప్రత్యక్షంగా జగన్ పై పడుతుందన్న హెచ్చరికను ఆయన ఇచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో జగన్ స్వయంగా జోక్యం చేసుకుని పార్టీ లోని ఈ అంతర్గత కలహాలను ఆపుతారా? లేక పరిస్థితులు మరింత వేడెక్కుతాయా? అన్నదే ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.