YS Jagan : సీఎం ఆఫీస్ కి పిలిపించిన ఎమ్మెల్యేలకు జగన్ చెబుతున్న మొదటి మాట ఇదే ..!
YS Jagan : వైయస్సార్ సీపీ పార్టీలో రాజకీయం ఉత్కంఠ భరితంగా మారుతుంది. నేరుగా ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగి పరిస్థితులను చక్కదిద్ద పెట్టాల్సిన అవసరం వచ్చింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలతో మంతనాలు సాగిస్తున్నారు. గెలుపే ప్రామాణికమని చెబుతూ వస్తున్నారు. సీటు నిరాకరిస్తున్న వారి భవిష్యత్తు మీద ఆయన హామీ కూడా ఇస్తున్నారు. పార్టీ అధికారంలోకి రావడం కోసమే ఈ నిర్ణయాలు తప్పట్లేదని చెబుతున్నారు. ప్రస్తుతం సీఎం నుంచి పిలుపు వచ్చిన ఎమ్మెల్యేలలో టెన్షన్ పెరుగుతుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కసరత్తును వేగవంతం చేశారు. ఎక్కడైతే సెట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకతను సర్వేలు చేపించి వారిని మార్చేందుకు నిర్ణయించారు. ఇప్పటికే 11 నియోజకవర్గాలలో మార్పులు చేర్పులు చేశారు. మరో జాబితా సిద్ధంగా ఉంది.
అందులో భాగంగా గోదావరి గుంటూరు జిల్లాల నుంచి సీఎం పిలుపు రావడంతో గోదావరి జిల్లాలోని పిఠాపురం, పత్తిపాడు, జగ్గంపేట, చింతలపూడి, రామచంద్రాపురం ఎమ్మెల్యేలు క్యాంపు కార్యాలయం చేరుకున్నారు. ఎవరికి ఏ కారణంతో టికెట్ నిరాకరిస్తున్నది సీఎం జగన్ వివరించి మరి వాళ్ళకి చెబుతున్నారు. వారి స్థానంలో నియమించే వారికి సమాచారం అందిస్తున్నారు. సహకరించాలని కూడా కోరుతున్నారు. తిరిగి అధికారంలోకి వస్తే పార్టీతో పాటు ప్రభుత్వంలో కూడా వారికి ప్రాధాన్యత ఇస్తానని వాళ్లకు వై.యస్.జగన్మోహన్ రెడ్డి ప్రామిస్ చేస్తున్నారు. అభ్యర్థుల ఖరారు మీద మొదటి నుంచి వరుసగా మూడు రోజులు సమావేశాలు నిర్వహించారు. వచ్చేవారం ఎంపీలతో సమావేశం కానున్నారు.
ఏ క్షణంలోనైనా ఇన్ ఛార్జిల మార్పు మీద అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్న పెండెం దొరబాబు స్థానంలో కాకినాడ ఎంపీ వంగ గీతకు నియోజకవర్గం ఇన్ ఛార్జిగా బాధ్యతలు స్వీకరింపు ఖాయం అయింది. దీనికి సంబంధించి గీతకు క్యాంపు కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. కాకినాడ ఎంపీ స్థానం రూరల్ ఎమ్మెల్యే కన్నబాబుకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జగ్గంపేట ఎమ్మెల్యేలను మార్చడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రత్తిపాడు నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే పూర్ణచంద్రరావు స్థానంలో పర్వతనేని జానకిదేవిని ఖరారు చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం. అక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబును మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…
Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్కు…
Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్గా మారారు.…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హైదరాబాద్లో జరిగిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య…
Nepal Crisis Deepens : నేపాల్లో జెన్-జెడ్ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…
Apple Event | ఐఫోన్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన…
Group 1 | గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…
Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…
This website uses cookies.