YV Subbareddy : తిరుమల లడ్డూ వివాం జాతీయ స్థాయి చర్చకు దారి తీసింది. అందరు వైసీపీనే టార్గెట్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు. ఐతే జగన్ ఈ డ్యామేజ్ ని కాస్త తగ్గించాలని తిరుమల వెళ్దామని అనుకుంటే ఆ పర్యటన కాస్త రద్దు చేసుకోవల్సి వచ్చింది. ఏపీలో కూటమి ప్రభుత్వంపై సీమె చంద్రబాబు పై జగన్ మండిపడ్డారు. అంతకుముందు టీటీడీ చైర్మన్ గా వ్యవహరించిన కరుణాకర రెడ్డి కూడా మీడియా ముందుకు వచ్చి తను చెప్పాల్సింది చెప్పారు. ఇదంతా చంద్రబాబు చేస్తున్న కుట్ర అని ఆయన అన్నారు.
ఈ టైం లో జగన్ బాబాయ్ తొలి నాలుగేళ్లు టీటీడీ కు చైర్మన్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి ఎక్కడ కనిపించలేదు. లడ్డూ ఇష్యూపై ఇప్పటివరకు సుబ్బారెడ్డి వచ్చి మీడియా ముందుకు వచ్చి ఖండించలేదు. ఆయన హయాంలో నెయ్యి కల్తీ జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి టైం లో ఆయన జగన్ వెంట ఉండకుండా ఏం చేస్తున్నారని సొంత పార్టీ నేతలు అనుకుంటున్నారు. జగన్ తిరుమల పర్యటన రద్దయ్యాక కూడా సుబ్బారెడ్డి మీడియా ముందుకు రాకపోవాంపై పలు వాదనలు వినిపిస్తున్నాయి.
వైసీపీ హయాంలో నాలుగేళ్లు వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్నారు. ఆయన మీద అప్పట్లో విమర్శలు వచ్చాయి. రాజకీయ కారణాల వల్ల చివరి సంవత్సరం కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్ గా నియమించారు. ఐతే తాజా వివాదం వల్ల వైవీ సుబ్బారెడ్డిని కార్నర్ చేస్తున్నారు. ఆయన స్పందించక పోవడం వల్ల ఇంకా ఎక్కువ అనుమానాలు వస్తున్నాయి. అయితే మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి మాత్ర్మ్ తన హయాంలో తప్పు జరగలేదని ప్రతిజ్ఞ చేస్తున్నారు.
లడ్డూ వివాదం మొదలైనప్పటి నుంచి వైవీ సుబ్బారెడ్డి ఒక్కసారే మీడియా ముందుకు వచ్చారు. ఆ తర్వాత కనిపించలేదు. నెయ్యిలో కల్తీ జరగలేద్దని ఆయన కచ్చితంగా చెప్పలేకపోవడం వైసీపీకి మైనస్ గా మారుతుంది. వైవీ సుబ్బరెడ్డి ఫుల్ క్లారిటీ ఇస్తే కానీ ప్రజలు ఒక క్లారిటీకి వస్తారు. మరి ఈ విషయంపై సుబ్బారెడ్డి ఏం ఆలోచిస్తున్నారు వైసీపీకి ఇంత డ్యామేజ్ జరుగుతున్నా ఆయన ఎందుకు సైలెంట్ గా ఉన్నారన్నది తెలియాల్సి ఉంది.
Tirumala Laddu : తిరుమల లడ్డూ వివాదం పెను దుమారంగా మారింది. ఇది పూర్తిగా రాజకీయ అంశంగా మారింది. లడ్డులో…
Gottipati Ravikumar : ఏపీ మాజీ సీఎం జగన్ ను దేశ బహిష్కరణ చేయాలని దేశ సంప్రదాయాలను గౌరవించలేని జగన్…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి శుక్రవారం తన తిరుమల ఆలయ దర్శనాన్ని రద్దు చేసుకోవడంతో…
Komatireddy Brothers : తెలంగాణ కాంగ్రెస్ లో కోమటిరెడ్డి బ్రదర్స్ హవాకి రేవంత్ జమానా మొదలయ్యాక బ్రేక్ పడిందా ?…
Chandrababu : ప్రస్తుతం ఏపీలో రాజకీయం చాలా రంజుగా సాగుతుంది. ఒకవైపు జగన్పై చంద్రబాబు విమర్శలు చేస్తుంటే మరోవైపు చంద్రబాబుపై…
Revanth Reddy : కాంగ్రెస్లోకి కొత్త ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అధికారం అందిపుచ్చుకున్న విషయం తెలిసిందే. అప్పటి…
TTD : గత కొద్ది రోజులుగా టీటీడీ తెగ వార్తలలో నిలుస్తుంది. లడ్డూ విషయంలో తెగ రాజకీయం నడుస్తుండగా,మరోవైపు ఇప్పుడు…
Ys Jagan : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో జగన్ వ్యవహారం పెద్ద చర్చనీయాంశంగా మారింది.ప్రపంచ ప్రఖ్యాతి చెందిన తిరుమల లడ్డూలో…
This website uses cookies.