Andhra Pradesh : వాలంటీర్లు లేకుండానే పెన్షన్ ఇచ్చే ప్రయత్నం…. ఈ పని జగన్ ప్రభుత్వం వెంటనే చేయాలి…!

Andhra Pradesh : ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏదో ఒక అంశం వెలుగులోకి వస్తూనే ఉంది. అయితే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జగన్ వర్సెస్ చంద్రబాబు కూటమిగా సాగుతూండడంతో ఏపీ వాలంటీర్ల ఇష్యూ గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అయితే ఏపీలో వాలంటీర్లను రద్దు చేయాలని చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కమిషన్ కేజ్ ఫిర్యాదు చేశాడని వైసీపీ వర్గాలు మండిపడుతుంటే….అలాంటిది ఏమీ లేదని ఎన్నికల్లో వాలంటీర్ల ఇన్వాల్వ్మెంట్ ఉండడం అనేది ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోలేదని దానికి మాకు ఎలాంటి సంబంధం లేదని టీడీపీ వర్గాలు తెలియజేస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ఏపీలో పెన్షన్లు ఆగిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మళ్లీ ఎలక్షన్స్ ముగిసిన తర్వాత జగన్ లేదా చంద్రబాబు అధికారంలోకి వస్తేనే పెన్షన్లు అనేవి వస్తాయి అనే వార్తలు ప్రస్తుతం చాలా బాగా వినిపిస్తున్నాయి. మరి దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

అయితే ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ వాలంటీర్లను ఆపడం అనేది ఎలక్షన్ కమిషన్ తీసుకున్న ఒక సంచలనాత్మక నిర్ణయం అని చెప్పాలి. అయితే ఈ నిర్ణయాన్ని ఎలక్షన్ కమిషన్ తీసుకోవడానికి గల కారణం ఏంటంటే గత నాలుగున్నర సంవత్సరాలుగా వారు వైసీపీ ప్రభుత్వం కింద పనిచేస్తున్నారు. అలాగే జగన్ పెట్టిన ప్రతి పథకాన్ని వీరు గడప గడపకి వెళ్లి పంపిణీ చేస్తున్నారు. కాబట్టి ఆ సమయంలో ఓటర్లను వాలంటీర్లు ప్రభావితం చేసే అవకాశం ఉంటుందనే ఆలోచనతో ఎలక్షన్ కమిషన్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తి ఈ విషయాలను తెలుపుతూ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.

ఈయన ఆంధ్రప్రదేశ్ కు ఫార్మర్ ఎలక్షన్ కమిషన్ కింద పనిచేయడం జరిగింది. అయితే ఈయన చంద్రబాబుకు కూడా చాలా సన్నిహితంగా ఉండారనే వార్తలు కూడా ఉన్నాయి. అయితే ఈయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాలంటీర్లను రద్దు చేస్తూ ప్రకటన ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ కేవలం వాలంటీర్లను ఆపడం జరిగింది తప్ప ఏపీలో పెన్షన్లు మాత్రం ఆగడం లేదని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు పెన్షన్ అనేది ఎక్కడ తీసుకోవాలి అనే ప్రశ్నలు మన ముందు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే ప్రభుత్వం వాలంటీర్లకు బదులుగా ఆల్టర్నేట్ గా ఎవరినైనా చూసుకోవాలి , లేదా పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వ ఉద్యోగులను పంపించాలి , లేకపోతే పెన్షన్ నగదును లబ్ధిదారుల ఖాతాల్లో వేసేలా చేయాలంటూ చెప్పడం జరిగింది.

అయితే కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ముఖ్య సలహాదారి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఏం చెప్పారంటే…పెన్షన్ పొందే లబ్ధిదారులు అందరూ కూడా మీ ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి గ్రామా లేదా వార్డు సచివాలయాలకు వెళ్లి మీ పెన్షన్ తీసుకోండి. అక్కడ మీకు పెన్షన్ ఇస్తారు అని చెప్పడం జరిగింది. ఈనెల 3వ తారీఖున పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు వెళ్లి తీసుకోగలరు అనే విషయాన్ని ఆయన చెప్పుకొచ్చారు. కావున ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం పెన్షన్స్ అనేవి అసలు ఆగటం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి గ్రామ లేదా వార్డు సచివాలయ కు వెళ్లి లబ్ధిదారులందరూ పెన్షన్ తీసుకోవచ్చు.

Recent Posts

New Pension Rules: కొత్త పెన్షన్ రూల్స్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర సర్కార్

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…

2 hours ago

BC Youth Employment : బీసీలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్..

BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…

3 hours ago

Wife Killed : ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య..అది కూడా పెళ్లైన 30ఏళ్లకు..ఏంటి ఈ దారుణం !!

wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…

4 hours ago

Hair-Pulling Fight : మెట్రో ట్రైన్ లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు

డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…

6 hours ago

Lord Vinayaka | సబ్బులు, షాంపూలతో గణనాథుడు..అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న వినాయ‌కుడి ప్ర‌తిమ‌

Lord Vinayaka |  తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…

7 hours ago

Vodafone | రూ.1కే రూ.4,999 విలువైన Vi ప్లాన్.. వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్!

Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…

8 hours ago

Manchu Manoj | ఆమె త‌మిళ‌నాట పెద్ద రౌడీ… ఆ హీరోయిన్ గురించి మ‌నోజ్ అలా అన్నాడేంటి?

Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…

9 hours ago

Lord Ganesh | పూజ‌లు అందుకోకుండానే గ‌ణేషుని నిమ‌జ్జ‌నం.. అలా ఎందుకు చేశారంటే..!

Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్‌ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…

10 hours ago