Categories: andhra pradeshNews

Vangalapudi Anitha : ఇలా చేస్తే జ‌గ‌న్ దేశ బ‌హిష్క‌ర‌ణ‌.. హోం మంత్రి సంచ‌ల‌న కామెంట్స్..!

Advertisement
Advertisement

Vangalapudi Anitha  : ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురుస్తుంది. కూటమి ప్ర‌భుత్వానికి చెందిన నాయ‌కులు జ‌గ‌న్‌ని విమ‌ర్శిస్తూ వ‌స్తున్నారు. తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చే ఉద్దేశం లేకనే జగన్ తిరుమల పర్యటన ఆపేసుకున్నారని ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆరోపించారు. నేడు మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వంగలపూడి అనిత మాట్లాడుతూ జగన్ పై దేశ బహిష్కరణ వ్యాఖ్యలు చేశారు. తిరుమల పర్యటనను రద్దు చేసుకున్న జగన్ చెబుతున్నవన్నీ కుంటిసాకులేనని ఆమె అన్నారు. డిక్లరేషన్ ఇచ్చి తిరుమలకు వెళ్తే తన తల్లికీ, చెల్లికి పట్టిన గతే తనకూ పడుతుందని భయపడి పర్యటన రద్దు చేసుకున్నాడని విమర్శించారు.

Advertisement

Vangalapudi Anitha  జ‌గ‌న్‌పై ఫైర్..

డిక్లరేషన్ ఇవ్వటం ఇష్టం లేక జగన్ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏనాడూ తిరుమల లడ్డూ తినని జగన్‌ నాణ్యత, రుచి గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. డిక్లరేషన్ ఇవ్వమంటే దళితుల అంశాన్ని ముడిపెట్టి మత విద్వేషాలు రెచ్చగొట్టే యత్నం జగన్ చేశాడని అనిత దుయ్యబట్టారు. జగన్ హయాంలో టీటీడీ బోర్డు మెంబర్​గా దళితులకు అవకాశం ఇచ్చారా? అని మంత్రి నిలదీశారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎస్సీ అయిన ప్రస్తుత మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామికి ఆనాడు టీటీడీ బోర్డులో అవకాశం కల్పించారని గుర్తుచేశారు. హిందూ, దళితురాలైన తనకు కూడా టీటీడీ బోర్డు అవకాశం వస్తే బ్లూ మీడియాలో రాద్దాంతం చేసి అది పోగొట్టేలా చేసింది జగనేనని విమర్శించారు.

Advertisement

Vangalapudi Anitha : ఇలా చేస్తే జ‌గ‌న్ దేశ బ‌హిష్క‌ర‌ణ‌.. హోం మంత్రి సంచ‌ల‌న కామెంట్స్..!

జగన్ చెప్పే మానవత్వం గురించి అతని తల్లీ, చెల్లిని చూస్తేనే అందరికి అర్ధమవుతుందని అన్నారు. దేశాన్ని కించపరుస్తున్న జగన్​ను దేశ బహీష్కరణ ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు. సెల్ఫ్ గోల్స్ తో తనని దేశ బహీష్కరణ చేయాలని పరిస్థితి జగనే తెచ్చుకున్నాడని అన్నారు. పూటకో మాట జగన్ కు బాగా అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె ఆఖరి నిమిషంలో తిరుమల పర్యటన ఆపేసుకున్నారని, అయితే నోటీసులు ఇవ్వడం వలన తాను తిరుమల పర్యటన రద్దు చేసుకున్నానని చెబుతున్నారని కానీ జగన్ చెబుతున్నవన్నీ పచ్చి అబద్దాలు అంటూ ఆరోపించారు. జగన్ తాను చెప్పే అబద్ధాలతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని వంగలపూడి అనిత పేర్కొన్నారు.

Recent Posts

Bhartha mahasayulaku vignapthi | బాక్స్ ఆఫీస్ వద్ద ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఓపెనింగ్స్ .. అంచనాలకు తగ్గలేదు

Bhartha mahasayulaku vignapthi | మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఇటీవల థియేటర్లలో విడుదలై…

1 hour ago

iPhone 15 : ఐఫోన్ కొనాలనే కోరిక ఉన్న ధర ఎక్కువని కొనలేకపోతున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్

iPhone 15 : ఐఫోన్ సొంతం చేసుకోవాలనేది సగటు స్మార్ట్‌ఫోన్ ప్రియులందరి కల. కానీ దాని భారీ ధర కారణంగా…

2 hours ago

Pawan Kalyan : రాజకీయ నాయకుల కోసం ప్రజలను ఇబ్బంది పెడతారా అంటూ పవన్ హీరోయిన్ ఆగ్రహం

Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్‌తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.…

3 hours ago

Nara Lokesh : యాక్షన్ కు సిద్దమైన నారా లోకేష్.. వణికిపోతున్న సొంత పార్టీ నేతలు

Nara Lokesh  : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…

4 hours ago

Eating : భోజనం చేయగానే ఆ పని అస్సలు చేయకూడదు..!

Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…

5 hours ago

Udyogini Scheme : మహిళల కోసం ‘ఉద్యోగిని పథకం 2026’ ను తీసుకొచ్చిన కర్ణాటక ప్రభుత్వం, దీనికి ఎలా అప్లయ్ చేయాలంటే !!

Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…

6 hours ago

NIT Warangal Recruitment 2026: నిరుద్యోగ యువతకు గొప్ప శుభవార్త..NIT లో పెద్ద ఎత్తున జాబ్స్ మీరు అప్లై చేసుకోవడమే ఆలస్యం !1

NIT Warangal Recruitment 2026 : వరంగల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…

7 hours ago

Today Gold Rate January 14 : నేటి గోల్డ్ & వెండి ధరలు ఎలా ఉన్నాయంటే !!

దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…

9 hours ago