
Vangalapudi Anitha : ఇలా చేస్తే జగన్ దేశ బహిష్కరణ.. హోం మంత్రి సంచలన కామెంట్స్..!
Vangalapudi Anitha : ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్పై విమర్శల వర్షం కురుస్తుంది. కూటమి ప్రభుత్వానికి చెందిన నాయకులు జగన్ని విమర్శిస్తూ వస్తున్నారు. తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చే ఉద్దేశం లేకనే జగన్ తిరుమల పర్యటన ఆపేసుకున్నారని ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆరోపించారు. నేడు మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వంగలపూడి అనిత మాట్లాడుతూ జగన్ పై దేశ బహిష్కరణ వ్యాఖ్యలు చేశారు. తిరుమల పర్యటనను రద్దు చేసుకున్న జగన్ చెబుతున్నవన్నీ కుంటిసాకులేనని ఆమె అన్నారు. డిక్లరేషన్ ఇచ్చి తిరుమలకు వెళ్తే తన తల్లికీ, చెల్లికి పట్టిన గతే తనకూ పడుతుందని భయపడి పర్యటన రద్దు చేసుకున్నాడని విమర్శించారు.
డిక్లరేషన్ ఇవ్వటం ఇష్టం లేక జగన్ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏనాడూ తిరుమల లడ్డూ తినని జగన్ నాణ్యత, రుచి గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. డిక్లరేషన్ ఇవ్వమంటే దళితుల అంశాన్ని ముడిపెట్టి మత విద్వేషాలు రెచ్చగొట్టే యత్నం జగన్ చేశాడని అనిత దుయ్యబట్టారు. జగన్ హయాంలో టీటీడీ బోర్డు మెంబర్గా దళితులకు అవకాశం ఇచ్చారా? అని మంత్రి నిలదీశారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎస్సీ అయిన ప్రస్తుత మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామికి ఆనాడు టీటీడీ బోర్డులో అవకాశం కల్పించారని గుర్తుచేశారు. హిందూ, దళితురాలైన తనకు కూడా టీటీడీ బోర్డు అవకాశం వస్తే బ్లూ మీడియాలో రాద్దాంతం చేసి అది పోగొట్టేలా చేసింది జగనేనని విమర్శించారు.
Vangalapudi Anitha : ఇలా చేస్తే జగన్ దేశ బహిష్కరణ.. హోం మంత్రి సంచలన కామెంట్స్..!
జగన్ చెప్పే మానవత్వం గురించి అతని తల్లీ, చెల్లిని చూస్తేనే అందరికి అర్ధమవుతుందని అన్నారు. దేశాన్ని కించపరుస్తున్న జగన్ను దేశ బహీష్కరణ ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు. సెల్ఫ్ గోల్స్ తో తనని దేశ బహీష్కరణ చేయాలని పరిస్థితి జగనే తెచ్చుకున్నాడని అన్నారు. పూటకో మాట జగన్ కు బాగా అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె ఆఖరి నిమిషంలో తిరుమల పర్యటన ఆపేసుకున్నారని, అయితే నోటీసులు ఇవ్వడం వలన తాను తిరుమల పర్యటన రద్దు చేసుకున్నానని చెబుతున్నారని కానీ జగన్ చెబుతున్నవన్నీ పచ్చి అబద్దాలు అంటూ ఆరోపించారు. జగన్ తాను చెప్పే అబద్ధాలతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని వంగలపూడి అనిత పేర్కొన్నారు.
Farmers : తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ఇక పై పంట పొలాల్లో పురుగుమందుల పిచికారీ…
Lunar Eclipse : మార్చి 3వ (ఈరోజు) తేదీన అరుదైన చంద్రగ్రహణం సంభవించనుందని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ గ్రహణం…
Ration cards : తెలంగాణలో రేషన్ సరఫరా విధానంలో పెద్ద మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. అర్హులైన ప్రతి…
Gold and Silver Price Drop Today 3 March 2026 : గత కొద్ది రోజులుగా అంతర్జాతీయ ఉద్రిక్తతల…
Brahmamudi March 3rd 2026 Episode : స్టార్ మాలో ప్రసారం అవుతున్న ‘బ్రహ్మముడి’ సీరియల్ ప్రేక్షకులను కట్టిపడేస్తూ రోజుకో…
Karthika Deepam 2 March 3rd 2026 Episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న 'కార్తీక దీపం 2'…
Egg Yolk : గుడ్డు సంపూర్ణ ఆహారంగా గుర్తింపు పొందింది. ప్రతిరోజూ గుడ్డు తినాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే గుడ్డులోని…
Ayurvedic Decoction : ఆధునిక జీవనశైలి, వేగవంతమైన పనితీరు, అసమయ భోజనం, అధిక ఒత్తిడి వంటి కారణాల వల్ల గ్యాస్,…
Astrology : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారాలు, సంయోగాలు ప్రత్యేక ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. అందులో ముఖ్యంగా గురుడు మరియు…
Pawan Kalyan : తిరుమల వంటి అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం చుట్టూ ఇప్పుడు అనైతిక వ్యవహారాల చర్చ నడవడం భక్తుల…
Revanth Reddy : తెలంగాణ లో భూముల వ్యవహారం ఎప్పుడూ ఒక హాట్ టాపిక్ గానే ఉంటుంది. ముఖ్యంగా గత…
Kodali Nani : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో ఇప్పుడు మళ్ళీ పాత ముఖాలు కనిపిస్తున్నాయి. దాదాపు రెండేళ్ల పాటు…
This website uses cookies.