VSR : చెప్పుడు మాటలు విన్నంత వరకు జగన్ అక్కడే - విజయసాయి

Vijayasai Reddy : చెప్పుడు మాటలు విన్నంత వరకు జగన్ అక్కడే – విజయసాయి

 Authored By sudheer | The Telugu News | Updated on :23 January 2026,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Vijayasai Reddy : చెప్పుడు మాటలు విన్నంత వరకు జగన్ అక్కడే - విజయసాయి

Vijayasai Reddy : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు నంబర్ 2గా చక్రం తిప్పిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై ఎట్టకేలకూ మౌనం వీడారు. తాను రాజకీయాల నుంచి తప్పుకోలేదని, త్వరలోనే రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నానని ఆయన స్పష్టం చేయడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. అయితే, ప్రస్తుత రాజకీయ ముఖచిత్రంపై విశ్లేషణ చేస్తూ జగన్ తిరిగి అధికారం చేపట్టడం అంత సులువు కాదని ఆయన కుండబద్దలు కొట్టారు. రాష్ట్రంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి బలంగా ఉన్నంత కాలం మరియు జగన్ తన చుట్టూ ఉన్న ‘కోటరీ’ని నమ్ముకున్నంత కాలం వైసీపీకి అధికారం దక్కదని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 2020 నుంచి తనను ఉద్దేశపూర్వకంగా సైడ్‌లైన్ చేశారని, జగన్ కోటరీ మాటలను నమ్మి తనలాంటి విశ్వాసపాత్రుడిని దూరం చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

VSR చెప్పుడు మాటలు విన్నంత వరకు జగన్ అక్కడే విజయసాయి

Vijayasai Reddy : చెప్పుడు మాటలు విన్నంత వరకు జగన్ అక్కడే – విజయసాయి

విజయసాయిరెడ్డి తన వ్యక్తిగత నిజాయితీని నిరూపించుకునే ప్రయత్నం చేస్తూనే, జగన్‌పై సునిశిత విమర్శలు గుప్పించారు. తాను జగన్ కోసం ఒక ‘పాలేరు’లా కష్టపడి పనిచేశానని, కానీ తనపై జగన్ చేసిన ప్రలోభాల ఆరోపణలు బాధించాయని ఆయన పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలను జగన్ వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూనే, విశాఖపట్నంలో తనకు ఒక్క అపార్ట్‌మెంట్ తప్ప మరే ఆస్తులు లేవని స్పష్టం చేశారు. మద్యం స్కామ్ వంటి ఆరోపణలను తాను నమ్మబోనని చెబుతూనే, తనపై దుష్ప్రచారం చేసిన వారికి తగిన బుద్ధి చెబుతానని హెచ్చరించారు. పార్టీని వీడిన తర్వాత తన ప్రయాణం ఎటువైపు అనే విషయంలో ఇప్పటి వరకు గోప్యత పాటించిన సాయిరెడ్డి, ఇప్పుడు తన వ్యూహాలను మార్చుకున్నట్లు కనిపిస్తోంది.

Vijayasai Reddy : జగన్ కోసం ‘పాలేరు’లా కష్టపడ్డానంటూ విజయసాయి ఆవేదన

సాయిరెడ్డి తదుపరి అడుగు ఎటువైపు అనే ఉత్కంఠకు ఆయన మాటలే సమాధానం చెబుతున్నాయి. ఏ రాజకీయ పార్టీలో చేరనని పైకి చెబుతున్నప్పటికీ, బీజేపీ నుంచి ఆహ్వానం అందితే పరిశీలిస్తానని చెప్పడం ద్వారా తన మనసులోని మాటను బయటపెట్టారు. ఏపీలో కూటమిలో ఆయనకు చోటు దక్కడం కష్టమనే ప్రచారం ఉన్నప్పటికీ, ఢిల్లీ స్థాయిలో బీజేపీ అగ్రనాయకత్వంతో ఆయనకున్న పాత పరిచయాలు ఆయనకు మార్గం సుగమం చేసే అవకాశం ఉంది. జగన్ వైఖరిపై అసంతృప్తితో ఉన్న ఆయన, ఒకవేళ కమలం గూటికి చేరితే ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలవ్వడం ఖాయం. మొత్తానికి, విజయసాయిరెడ్డి రీ-ఎంట్రీ ప్రకటన వైసీపీకి పెద్ద షాక్ అనే చెప్పాలి.

sudheer

Ramanujam Sudheer Sr Journalist is experienced in Digital Media field. He worked in various Telugu media for about 10 years. lam worked as a Vaartha Daily Newspaper , 123telugu , Cineoutlook, Telugu Mirchi, TeluguMovies. com, Hashtagu, Mahaa News tv channel telugu As a News content writer, he wrote various articles on Human angle, Andhra pradesh And Telangana Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Conterwriter of thetelugunews.com website. Contact Details : Sudheer7606@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి