Vijayasai Reddy : ప్రస్తుతం వైసీపీలో ఏం జరుగుతోంది. వైసీపీలో నెంబర్ వన్ ఎవరు అంటే సీఎం జగన్ అనే చెప్పుకోవాలి. ఇక నెంబర్ 2 మాత్రం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. కొన్నేళ్ల పాటు నెంబర్ 2 స్థానంలో రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఉన్నారు. కానీ.. ఇప్పుడు ఆ స్థానంలో విజయసాయిరెడ్డి లేరు. ముందు ఆ స్థానంలో చాలామంది ఉండేవారు. ఒక కొణతల రామకృష్ణ, గోనె ప్రకాశ రావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. ఇలా చాలామంది నెంబర్ 2 పొజిషన్ లో ఉన్నవాళ్లే. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, విజయసాయిరెడ్డి తర్వాత ఇప్పుడు నెంబర్ 2 స్థానంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు.
అంటే ఏమాత్రం తోక జాడిచ్చినా నెంబర్ 2 స్థానం అనేది మారిపోతుంది అన్నమాట. అయితే.. ప్రస్తుతం తన పొజిషన్ ఏంటి అనేది విజయసాయిరెడ్డికే అంతుపట్టడం లేదు. ప్రస్తుతం తన చేతిలో ఒక రాజ్యసభ పదవి మాత్రమే ఉంది. ఆ పదవి ఉంది కాబట్టే అంతో ఇంతో ఇప్పుడు గౌరవం. నిజానికి వైసీపీ ఎదుగుదలలో విజయసాయిరెడ్డి కీలక వ్యక్తిగా ఉన్నారు. వైసీపీని తన సొంత పార్టీలా చూసుకున్నారు. జగన్ ఏది చెబితే అది చేసేవారు. పార్టీలో చాలా ముఖ్య నేతగా ఉన్న విజయసాయిరెడ్డి పరిస్థితి ఇప్పుడు ఇలా ఎందుకు అయింది అనేది అంతుపట్టడం లేదు.
విజయసాయిరెడ్డి కీలక నేత నుంచి సామాన్య కార్యకర్తగా మారారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర సమన్వయకర్త బాధ్యతల నుంచి కూడా విజయసాయిరెడ్డిని తప్పించారు. ఇప్పుడు వైవీ సుబ్బారెడ్డి ఆ బాధ్యతలను చూసుకుంటున్నారు. సోషల్ మీడియా విభాగాన్ని కూడా సజ్జల కొడుకు చూసుకుంటున్నారు. ఇక.. అనుబంధ విభాగాల సమన్వయ బాధ్యతను చెవిరెడ్డికి ఇచ్చారు ముఖ్యమంత్రి. వీటన్నింటి విషయంలో విజయసాయిరెడ్డిని పక్కన పెట్టడంతో విజయసాయి కొంచెం హర్ట్ అయినట్టే అనిపిస్తోంది. ఏది ఏమైనా.. వైసీపీ పార్టీపై, జగన్ పై ఉన్న అభిమానంతో విజయసాయి ఏం మాట్లాడటం లేదు కానీ.. ఆయన్ను జగన్ ఎందుకు లైట్ తీసుకుంటున్నారు అనేది మాత్రం అంతుపట్టడం లేదు.
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
This website uses cookies.