
Sailajanath : ముస్లిమ్స్ చంద్రబాబు చేసిన మోసాన్ని ఎప్పటికి మరచిపోరు : శైలజానాథ్
Sailajanath : దేశ రాజకీయాల్లో పెను చర్చకు కారణమైన వక్ఫ్ సవరణ బిల్లు తాజాగా లోక్సభలో ఆమోదం పొందింది. బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లును ప్రవేశపెట్టగా, అర్ధరాత్రి వరకూ చర్చ కొనసాగింది. అనంతరం జరిగిన ఓటింగ్లో 282 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటు వేయగా, 232 మంది వ్యతిరేకంగా ఓటేశారు. అయితే ఈ బిల్లుకు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వడంపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ఈ విషయంలో ఘాటు స్పందన తెలిపింది.
Sailajanath : ముస్లిమ్స్ చంద్రబాబు చేసిన మోసాన్ని ఎప్పటికి మరచిపోరు : శైలజానాథ్
వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత శైలజానాథ్ మాట్లాడుతూ.. ముస్లింల హక్కులను కాలరాస్తూ, మైనారిటీలతో ఘోరమైన అన్యాయం జరిగిందని ఆరోపించారు. చంద్రబాబు గతంలో ముస్లిం వర్గానికి ఇచ్చిన హామీలను మరిచిపోయారని, ఇప్పుడు వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇవ్వడం ఆయన నిజ స్వరూపాన్ని మరోసారి బయటపెట్టిందని విమర్శించారు. షర్మిలను తెరపైకి తీసుకురావడం, కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పగించడం వెనుక వక్ఫ్ బిల్లును పక్కదారి పట్టించే ఉద్దేశమే ఉందని ఆయన ఆరోపించారు. ప్రజలను మోసం చేయడమే చంద్రబాబు ధోరణి అని, ఆయనకు డైవర్షన్ పాలిటిక్స్ నిత్యకృత్యమని అన్నారు.
అంతేకాక వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ ప్రయోజనాల కోసమేనని, అవినాష్ రెడ్డిని టార్గెట్ చేయడమే లక్ష్యంగా జరుగుతున్న కుట్రలో ఆమె భాగమైందని శైలజానాథ్ పేర్కొన్నారు. ఈ కుట్రల వెనుక చంద్రబాబు మాస్టర్మైండ్గా ఉన్నారని, షర్మిల కూడా అదే దిశగా కదులుతున్నారని విమర్శించారు. డబ్బు కోసం పార్టీలు పెట్టి, మూసి వేసే వాళ్లు ప్రజల పక్షాన నిలబడలేరని, ఆమె చేస్తున్న ఆరోపణలు, విమర్శలు ప్రజలను మోసం చేయలేవని తేల్చి చెప్పారు. మొత్తంగా వక్ఫ్ బిల్లుతో మొదలైన వివాదం రాష్ట్రంలో రాజకీయ వేడి రగిలించడంతో పాటు, పలు కీలక నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.