Sailajanath : ముస్లిమ్స్ చంద్రబాబు చేసిన మోసాన్ని ఎప్పటికి మరచిపోరు : శైలజానాథ్
Sailajanath : దేశ రాజకీయాల్లో పెను చర్చకు కారణమైన వక్ఫ్ సవరణ బిల్లు తాజాగా లోక్సభలో ఆమోదం పొందింది. బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లును ప్రవేశపెట్టగా, అర్ధరాత్రి వరకూ చర్చ కొనసాగింది. అనంతరం జరిగిన ఓటింగ్లో 282 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటు వేయగా, 232 మంది వ్యతిరేకంగా ఓటేశారు. అయితే ఈ బిల్లుకు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వడంపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ఈ విషయంలో ఘాటు స్పందన తెలిపింది.
Sailajanath : ముస్లిమ్స్ చంద్రబాబు చేసిన మోసాన్ని ఎప్పటికి మరచిపోరు : శైలజానాథ్
వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత శైలజానాథ్ మాట్లాడుతూ.. ముస్లింల హక్కులను కాలరాస్తూ, మైనారిటీలతో ఘోరమైన అన్యాయం జరిగిందని ఆరోపించారు. చంద్రబాబు గతంలో ముస్లిం వర్గానికి ఇచ్చిన హామీలను మరిచిపోయారని, ఇప్పుడు వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇవ్వడం ఆయన నిజ స్వరూపాన్ని మరోసారి బయటపెట్టిందని విమర్శించారు. షర్మిలను తెరపైకి తీసుకురావడం, కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పగించడం వెనుక వక్ఫ్ బిల్లును పక్కదారి పట్టించే ఉద్దేశమే ఉందని ఆయన ఆరోపించారు. ప్రజలను మోసం చేయడమే చంద్రబాబు ధోరణి అని, ఆయనకు డైవర్షన్ పాలిటిక్స్ నిత్యకృత్యమని అన్నారు.
అంతేకాక వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ ప్రయోజనాల కోసమేనని, అవినాష్ రెడ్డిని టార్గెట్ చేయడమే లక్ష్యంగా జరుగుతున్న కుట్రలో ఆమె భాగమైందని శైలజానాథ్ పేర్కొన్నారు. ఈ కుట్రల వెనుక చంద్రబాబు మాస్టర్మైండ్గా ఉన్నారని, షర్మిల కూడా అదే దిశగా కదులుతున్నారని విమర్శించారు. డబ్బు కోసం పార్టీలు పెట్టి, మూసి వేసే వాళ్లు ప్రజల పక్షాన నిలబడలేరని, ఆమె చేస్తున్న ఆరోపణలు, విమర్శలు ప్రజలను మోసం చేయలేవని తేల్చి చెప్పారు. మొత్తంగా వక్ఫ్ బిల్లుతో మొదలైన వివాదం రాష్ట్రంలో రాజకీయ వేడి రగిలించడంతో పాటు, పలు కీలక నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది.
Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…
Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్కు…
Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్గా మారారు.…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హైదరాబాద్లో జరిగిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య…
Nepal Crisis Deepens : నేపాల్లో జెన్-జెడ్ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…
Apple Event | ఐఫోన్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన…
Group 1 | గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…
Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…
This website uses cookies.