ys jagan another scheme for every family,
YS Jagan : ఏపీలో ఎన్నికలకు ఇంకా సంవత్సరం సమయం ఉంది. కానీ.. ఇప్పటి నుంచే ఎన్నికల హడావుడి మొదలైంది. మామూలుగా కాదు. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సమాయాత్తం అవుతున్నాయి. ఇక.. అధికార వైసీపీ కూడా ఎన్నికల కోసం రెడీ అవుతోంది. రెండోసారి కూడా గెలవాలి కదా. అందుకే వైఎస్ జగన్ ప్రజల కోసం మరిన్ని సంక్షేమ పథకాలను తీసుకొస్తున్నారు. ఆ దిశగా అడుగులు కూడా పడుతున్నాయి. ఇప్పటికే ఏపీలో ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన సీఎం జగన్.. తాజాగా ప్రజలకు మరో వరం ప్రకటించారు.
నిజానికి.. ఏ ఇంట్లో అయినా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా, పెన్షనర్ ఉన్నా ఆ కుటుంబంలో వేరే పథకానికి అర్హత లేకుండా చేశారు. దీంతో కొన్ని వర్గాల ప్రజలు ఏపీ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. అందుకే అటువంటి వాళ్ల ఓటు బ్యాంకు కూడా పొందడం కోసం సరికొత్త నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్. అదే.. జగనన్న సురక్షలో భాగంగా ప్రతి కుటుంబానికి రెండో పెన్షన్ ఇచ్చేందుకు జగన్ సర్కార్ ఆలోచిస్తోంది.ఇప్పటికే సామాజిక పెన్షన్ పొందే వాళ్లు అంటే వృద్ధాప్య పింఛన్, వితంతువు పింఛన్, వికలాంగ పింఛన్ పొందే ఇంట్లో కూడా రెండో పెన్షన్ ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. అంటే ఒక పెన్షన్ ఉన్నా ఆ కుటుంబంలో మరో పెన్షన్ కూడా ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది.
ys jagan another scheme for every family,
నిజానికి సామాజిక పెన్షన్లకే ప్రభుత్వం చాలా డబ్బు ఖర్చు చేస్తోంది. ఈనేపథ్యంలో సెకండ్ పెన్షన్ కూడా ఇవ్వాలంటే మామూలు విషయం కాదు. భారీగా నిధులు సమకూర్చాల్సి ఉంటుంది. మరి.. అందరినీ అక్కున చేర్చుకోవాలంటే రెండో పెన్షన్ కూడా ఇవ్వాలంటే ఏపీ ఖజానా భారీగా ఖాళీ అవుతుంది. కానీ.. వైసీపీకి మాత్రం రాజకీయంగా మేలు జరుగుతుంది. చూద్దాం మరి.. సెకండ్ పెన్షన్ సీఎం జగన్ కు ఎలాంటి ప్రయోజనాలను తీసుకొస్తుందో?
Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…
Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్కు…
Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్గా మారారు.…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హైదరాబాద్లో జరిగిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య…
Nepal Crisis Deepens : నేపాల్లో జెన్-జెడ్ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…
Apple Event | ఐఫోన్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన…
Group 1 | గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…
Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…
This website uses cookies.