Ys Jagan : పేదలకు గుడ్ న్యూస్.. ఒక్కో ఇంటికి రూ.2.70 లక్షలు అందించనున్న ప్రభుత్వం..!

Ys Jagan  : పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం.ప్రతి పేదవాడి సొంత ఇంటి కలను నిజం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ పెట్టుకున్నారు. దీని ద్వారా పేదలకు ఒక్కొక్కరికి 2.70 లక్షలు ఇస్తున్నారు. పేదవాడి సొంత ఇంటి కల సాకారం చేయడం కోసం ఆయన ‘ నవరత్నాలు ప్రజలందరికీ ఇల్లు పథకం ‘ తీసుకొచ్చారు. దీని ద్వారా దేశంలో ఎక్కడా లేనివిధంగా లక్షల మంది పేదలకు ఇంటి స్థలాలు పంపిణీ చేశారు. అంతేకాక వారు ఆ జాగాలో ఇంటి నిర్మాణం చేపట్టడం కోసం ఏపీ ప్రభుత్వం వారికి లక్షల్లో ఆర్థిక సాయం అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా వైఎస్ జగన్ ప్రభుత్వం పేదలకు శుభవార్త చెప్పింది. ఇప్పటికే లక్షల మంది పేదలకు ఇల్లు నిర్మించి ఇచ్చిన ప్రభుత్వం త్వరలోనే మరి కొంతమందికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి గృహ నిర్మాణ శాఖకు ప్రతిపాదనలు వెళ్లాయి. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద జగనన్న కాలనీలోనే మరో 2,32,686 ఇల్లు నిర్మించడానికి తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు ఏపీ గృహ నిర్మాణ సంస్థ ఎండీ కె.వెంకటరమణారెడ్డి తెలిపారు. కేంద్రం నుంచి అనుమతులు వచ్చేలోపు లే అవుట్ లలో నీరు, విద్యుత్ సరఫ,రా ఇతర వసతులు కల్పిస్తున్నామన్నారు. అనుమతులు వచ్చిన వెంటనే నిర్మాణం చేపడతామని తెలిపారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఇళ్లకు విద్యుత్, నీటి సరఫరా, ఇతర వసతులు కల్పిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇప్పటికే 22 లక్షలకు పైగా ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి శరవేగంగా పనులను పూర్తిచేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.

వీటిలో 1913 లక్షలు సాధారణ ఇల్లు కాగా మిగిలినవి టిడ్కో ఇల్లు. సాధారణ ఇళ్ళలో ఇప్పటికే 7.25 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. మరో 4.15 లక్షల ఇళ్ల నిర్మాణం పునాది నుంచి రూఫ్ లెవెల్ వరకు వివిధ దశలు ఉన్నాయి. వైయస్ జగన్ ప్రభుత్వం పేదల ఇంటి నిర్మాణానికి యూనిట్ కు 1.80 లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. అక్కడితో ఆగకుండా ఉచితంగా ఇసుక సరఫరా ద్వారా 15,000 సిమెంట్, స్టీల్ , మెటల్ ఫ్రేమ్స్ ఇతర నిర్మాణ సామాగ్రిని తక్కువ ధరకే అందించడం ద్వారా మరో 40,000 మేర పేదలకు లబ్ధి చేకూరాలని చేస్తుంది. అంతేకాదు పావలా వడ్డీకి 35,000 చొప్పున అందిస్తున్నారు. ఇలా మొత్తంగా ఒక్కో లబ్ధిదారుకు ప్రభుత్వం నుంచి 2.70 లక్షలు చొప్పున లాభం కలుగుతుంది. దీనికి కారణంగా మౌలిక వసతుల కోసం ప్రతి ఇంటిపై మరో లక్షకు పైగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఖర్చు చేస్తుంది.

Recent Posts

Ayurvedic Medicine : పిచ్చి మొక్క అని తీసి పడేయకండి… సర్వరోగ నివారిణి…?

Ayurvedic Medicine : ఈ మొక్క మనకు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. పిచ్చి మొక్క అని మనం తీసిపడేసే…

57 minutes ago

SSC Stenographer : 12వ త‌ర‌గ‌తి అర్హ‌త‌తో 261 ప్ర‌భుత్వ ఉద్యోగాలు..!

SSC Stenographer : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) జూన్ 6, 2025న SSC స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ 2025ను విడుదల…

2 hours ago

Health Benefits : ఖర్జూర, పాలు కలిపి తీసుకునే వారికి… ఇది మీకోసమే.. తప్పక తెలుసుకోవలసిన విషయం…?

Health Benefits : ఆరోగ్యకరమైన పానీయాలలో పాలు శ్రేష్టం.ఈ పాలను పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ కూడా…

3 hours ago

Venus Transit : ఈ రాశుల వారికి శుక్రుడు కనక వర్షం కురిపిస్తున్నాడు…?

Venus Transit : నవగ్రహాలలో కెల్లా కీలకమైన గ్రహం శుక్రు గ్రహం. శుక్ర గ్రహం రాక్షసులకు గురువు. శుక్రుడు సంపదకు,…

4 hours ago

UPI New Service : గుడ్‌న్యూస్‌.. చిన్న ఫోన్లు వాడేవారు కూడా మ‌నీ పంపొచ్చు.. ఎలా అంటే..?

UPI New Service  : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిజిట‌ల్ పేమెంట్స్‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టింది. భారతదేశంలో…

13 hours ago

Sravanthi Chokarapu : చేతిలో మందు బాటిల్‌.. బెడ్‌పై అత‌ను.. స్ర‌వంతి ర‌చ్చ మాములుగా లేదుగా..!

Sravanthi Chokarapu : యాంక‌ర్ స్ర‌వంతి చొక్కార‌పు గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ మ‌ధ్య కాలంలో ఈ అమ్మ‌డు…

14 hours ago

Public Talk : మైక్ పట్టుకొని డైరెక్ట్‌గా ఆడియ‌న్స్ ద‌గ్గ‌రకి వెళ్లి మూవీ టాక్ తెలుసుకున్న స్టార్ హీరో..!

Public Talk : బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూ ఉంటారు. అక్షయ్ కుమార్…

15 hours ago

Farmers : రేషన్ కార్డు ఉన్న రైతులకు భారీ శుభవార్త.. ప్రభుత్వం అదిరే కానుక!

Farmers : ఏపీ ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో పశువులకు…

16 hours ago