
Ys Jagan : వైఎస్ జగన్ ప్రభుత్వానికి అరుదైన గౌరవం.. జాతీయస్థాయిలో గుర్తింపు...!
Ys Jagan : ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ వైఎస్ జగన్ పాలనకు అరుదైన గుర్తింపు లభించింది. పరిపాలనలో అత్యుత్తమ విధానాలను అవలంబిస్తున్న రాష్ట్రంగా ” స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ రిపోర్టు 2023లో ఆంధ్ర రాష్ట్రం మన దేశంలోనే 3వ స్థానంలో నిలిచింది. అయితే దానికి ముందు అంటే గత ఏడాది 4వ స్థానంలో ఉన్న ఏపీ ఇప్పుడు 3వ స్థానానికి ఎదిగింది.దీంతో ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల సమీపిస్తున్న వేళ జాతీయ స్థాయిలో జగన్ ప్రభుత్వానికి అరుదైన గౌరవం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ పాలనకు జాతీయస్థాయి గుర్తింపు లభించడం జరిగింది. దేశం మొత్తంలో సుపరిపాలనలో వైఎస్ జగన్ ప్రభుత్వం మూడో స్థానంలో నిలిచింది. అయితే ఇంతకుముందేన్నడు ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా జగన్ ప్రభుత్వం పాలన సంస్కరణలను అమలు చేస్తోంది.అంతేకాక ప్రజల వద్దకే ప్రభుత్వం వెళ్లేలా జగన్ చేశారు.గ్రామ సచివాలయాలు , వాలంటీర్లు ఇంటి వద్దకే రేషన్ మరియు పెన్షన్ వంటి పథకాల అమలుతో దేశం మొత్తంలో 29 రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానం దక్కించుకుంది. అయితే ప్రభుత్వ సుపరిపాలన మరియు గ్రామ సచివాలయ వ్యవస్థలతో ఆంధ్ర రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని దీనిలో భాగంగానే ఆంధ్ర రాష్ట్రానికి గ్రామీణ అభివృద్ధి , గృహ నిర్మాణం, రెవెన్యూ శాఖలకు అరుదైన గౌరవం దక్కిందని తెలుస్తోంది.అయితే దేశం మొత్తంలో పరిపాలనలో అత్యుత్తమ విధానాలను అవలంబిస్తున్న రాష్ట్రంగా ” స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ రిపోర్ట్ 2023లో ఆంధ్ర రాష్ట్రానికి మూడవ స్థానం లభించింది. అయితే దానికి ముందు ఏడాది నాలుగో స్థానంలో ఉన్న ఏపీ ఇప్పుడు మూడో స్థానానికి రావడంతో జాతీయస్థాయిలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ అభివృద్ధి శాఖకు అరుదైన గౌరవం దక్కింది.మరి ముఖ్యంగా గ్రామీణ పాలనలో సీఎం జగన్ ముందు ఆలోచనతో తీసుకొచ్చినటువంటి మార్పులు దేశంలోని పలు రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచాయి అని చెప్పాలి.
పారదర్శక పాలన ప్రజల చెంతకే ప్రభుత్వ సేవలు వంటి అంశాలతో ఆంధ్ర రాష్ట్ర గ్రామీణాభివృద్ధి విజయవంతమైన ఫలితాలను సాధించింది. దీంతో ఈ అరుధైన గౌరవం జగన్ ప్రభుత్వం ఖాతాలో పడింది.అంతే కాక స్కోచ్ సంస్థ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం సుపరిపాలనలో ఆంధ్ర రాష్ట్రం మినహా దక్షిణాది రాష్ట్రాలలో మరే రాష్ట్రం కూడా ఈ గుర్తింపు సాధించలేకపోయాయి. ఇక ఈ అరుదైన గుర్తింపు సాధించిన స్థానాలలో మొదటి స్థానం ఒడిస్సా, 2వ స్థానం ఉత్తర ప్రదేశ్ , 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ , 4వ స్థానంలో మహారాష్ట్ర , 5వ స్థానంలో గుజరాత్ నిలిచాయి. అయితే ప్రస్తుతం ఎన్నికలకు సిద్ధమవుతున్న ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్షాలు జగన్ ప్రభుత్వం పై ఆయన పాలనపై చేస్తున్న విమర్శలకు ఈ అవార్డు సమాధానంగా నిలిచింది అని చెప్పాలి. ఇక ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జాతీయ స్థాయిలో ఇంతటి గుర్తింపు సాధించడం వైసిపి ప్రభుత్వానికి కలిసివచ్చే అంశంగా మారబోతుందని పలువురు అంటున్నారు.
రాజస్థాన్లోని ఝాలావర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది. కేవలం ప్రేమించాడనే నెపంతో ఒక యువకుడిని…
Annadata Sukhibhava: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని అమలు చేస్తున్న కీలక పథకాలలో అన్నదాత సుఖీభవ…
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత జగన్…
Rythu Bharosa Funds: రైతులకు అత్యంత కీలకమైన రైతు భరోసా పథకంRythu Bharosa Scheme పై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది.…
Private School Fees : తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల Private and corporate school fees…
ప్రస్తుత కాలంలో రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలనే ఆరాటంతో చాలా మంది యువత ప్రాణాలకు తెగించి విన్యాసాలు చేయడమే కాకుండా,…
viral video: సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియో కేరళలో Kerala తీవ్ర విషాదానికి దారి తీసింది. బస్సులో…
RBI Jobs : 10వ తరగతి పూర్తిచేసిన యువతకు ఇది నిజంగా శుభవార్త. గవర్నమెంట్ ఉద్యోగం Government job కోసం…
This website uses cookies.