
YS Jagan : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు మరో ఎనిమిది రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఎన్నికల ప్రచారానికి 6 రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో ఈ గోల్డెన్ టైమ్ ని జాగ్రత్తగా వాడుకునేందుకు రాజకీయ నేతలు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తన ప్రసంగంలో పదును పెంచినట్లుగా తెలుస్తుంది. అయితే వాస్తవానికి జగన్ ప్రసంగాలు గతంలో చాలా రొటీన్ గా ఉండేవి కానీ ఇటీవల చూస్తే దూకుడు పెరిగినట్లుగా కనిపిస్తోంది. అంతేకాక ఇంట్రెస్టింగ్ మేటర్ ను సబ్జెక్ట్ గా చేసుకొని ప్రజలకు తెలియజేస్తున్నారు. అయితే ఇప్పటివరకు జగన్ ప్రారంభించిన సిద్ధం సభలనుండి బస్సు యాత్ర దాకా ఒకే ఒక్క అంశంపై మాట్లాడుతూ వచ్చారు. అవే సంక్షేమ పథకాలు. సంక్షేమ పథకాలు కావాలంటే మాకు ఓటు వేయండి అంటూ మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటు వేయండి అంటూ చెప్పుకొచ్చారు. అయితే వాస్తవానికి ఈ డైలాగ్ మొదటలో డేరింగ్ అండ్ డాషింగ్ గా అనిపించింది.
అయితే ప్రచారాలలో జగన్ ఈ విధంగా చెప్పుకొస్తున్నప్పటికీ పథకాలు అందని వారు మాత్రం మాకు మంచి జరగలేదంటూ చెప్పటం మొదలుపెట్టారు. అంతేకాక సంక్షేమ పథకాలు అందిన వారు కూడా జగన్ కు ఓటు వేస్తారా అంటే ,చంద్రబాబు కూటమి అందిస్తున్న రెట్టింపు హామీల వలలో పడే అవకాశం కనిపిస్తుంది.
ఇలాంటి క్రమంలోనే విపక్ష పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్ లో జగన్ బటన్ నొక్కుడు తప్ప చేసేదేం లేదంటూ విమర్శలు చేస్తూ వస్తున్నారు. అలాగే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పుకొస్తున్నారు. దీంతో ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో చేసిన సర్వేలలో ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారని వెళ్లడైంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కూడా ప్రచారాలలో సంక్షేపం పథకాలను పట్టుకుని వేలాడితే దెబ్బతినే అవకాశం ఉందని జగన్ భావించినట్లుగా తెలుస్తుంది.
దీంతో ఇప్పటివరకు పథకాలపై ఫోకస్ చేసిన జగన్ తాజాగా ఏపీ అభివృద్ధి గత ఐదేళ్లలో ఏం జరిగిందనేది కూడా పూసగుచ్చినట్లు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరులో జరిగిన ప్రచారాలలో దాదాపు జగన్ గంటసేపు ప్రసంగించారు. ఈ నేపథ్యంలోనే జగన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలలు ఆసుపత్రులు అభివృద్ధి చేశామని , నాణ్యమైన విద్య వైద్యాన్ని అందిస్తున్నామని జగన్ తెలియజేశారు. అలాగే శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో సూపర్ స్పెషల్ హాస్పిటల్ నిర్మించామని ,అలాగే ఉద్దానికి వంశధార ద్వారా ఎత్తిపోతల పథకంతో దాదాపు 1000 కోట్ల రూపాయిలు ఖర్చు చేసి తాగునీటి సదుపాయం అందించినట్లుగా తెలియజేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 15 మెడికల్ కాలేజీలు , 4 పోర్ట్స్ , భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ,ఫిషింగ్ హార్బర్లు ఇలా ఎన్నో నిర్మాణాలు చేపట్టినట్లుగా ఆయన తెలిపారు. అలాగే ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 30 వేల కోట్ల పెట్టుబడులు వస్తే తమ పాలనలో దాదాపు లక్ష కోట్లు వచ్చాయని ఈ సందర్భంగా జగన్ వివరించారు. ఈ విధంగా జగన్ ట్రాక్ మార్చి ప్రచారాలు చేస్తుండడంతో ప్రజలు కూడా ఈ కార్యక్రమాలపై ఆలోచించే ప్రయత్నం చేస్తున్నారు. మరి జగన్ చేపట్టిన ఈ అభివృద్ధికి జనాల సంతృప్తి చెందుతారా లేదా అనేది వేచి చూడాలి.
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
This website uses cookies.