
Anchor Shyamala
Anchor Shyamala : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఎనిమిది రోజుల గడువు మాత్రమే ఉండడంతో రాజకీయ నాయకులు ప్రచారాలను జోరుగా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సినీ ఇండస్ట్రీకి చెందిన స్టార్ సెలబ్రిటీస్ సైతం ఎన్నికల ప్రచారాలలో పాల్గొంటూ తమ అభిమాన రాజకీయ నేతలకు మద్దతుగా నిలుస్తున్నారు. మరి ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సినీ ఇండస్ట్రీ నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల మెగా హీరో వరుణ్ తేజ్ కూడా ప్రచారాలలో పాల్గొని తన బాబాయ్ కోసం మద్దతుగా నిలిచారు. అదేవిధంగా జబర్దస్త్ కమెడియన్స్ సుడిగాలి సుదీర్ హైపర్ ఆది , గెటప్ శీను జనసేన పార్టీ తరఫున ప్రచారాలు చేస్తూ వస్తున్నారు.
ఇక వైసీపీ విషయానికొస్తే ప్రముఖ యాంకర్ శ్యామల వైసీపీ పార్టీ తరపున ప్రచారాలు చేస్తున్నారు. ఈ నేపద్యంలో తాజాగా ఓ ప్రచారాలలో భాగంగా శ్యామల పాల్గొనడం జరిగింది. గట్టి లీడర్ ను ఎదుర్కోవాలంటే ఆమాత్రం ఉండాలి… ప్రచారం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన శ్యామల ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే న్యూస్ రిపోర్టర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం లో సినీ సెలబ్రెటీలు చాలామంది ప్రచారాలు చేస్తున్నారు. అయితే పిఠాపురం నియోజకవర్గంలో కేవలం వంగా గీత అనే మహిళను ఓడించడానికి ఇంతమంది అవసరమా అని అడగగా…దానికి శ్యామల సమాధానం ఇస్తూ..
వంగ గీత గారి రాజకీయ ప్రస్తావం చూసుకున్నట్లయితే ఆమె ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు పనిచేసారో అందరికీ తెలుసు. అలాగే ఆమె పనిచేసిన ప్రతి పదవిలోనూ ఆమె చేయగలిగినంత చేసి చూపించారు. అంతేకాక పిఠాపురం నియోజకవర్గం లో ఆమె గురించి ప్రజలందరికీ తెలుసు. మరి ఇలాంటి ఒక స్ట్రాంగ్ క్యాండేట్ ని ఎదుర్కోవాలి అంటే ఆ మాత్రం సపోర్ట్ కోరుకోవడంలో తప్పు లేదంటూ శ్యామల తెలియజేశారు. ఇక జబర్దస్త్ కు చెందినవారు ఇక్కడ ప్రచారాలు చేస్తున్నారంటే దానికి రకరకాల కారణాలు ఉండవచ్చు. వారిపై ప్రెషర్ కూడా ఉండవచ్చు. కానీ పిఠాపురం నియోజకవర్గంలో వంగ గీత గారి గెలుపు మాత్రం ఖాయం అయిపోయిందని , ఆమెని కొట్టడం ఇక ఎవరి తరం కాదంటూ శ్యామల తేలియజేశారు. దీంతో ప్రస్తుతం శ్యామల చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాలలో సంచలనంగా మారాయి.
Virat Kohli - Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తో స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్…
Bhartha mahasayulaku vignapthi | మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఇటీవల థియేటర్లలో విడుదలై…
iPhone 15 : ఐఫోన్ సొంతం చేసుకోవాలనేది సగటు స్మార్ట్ఫోన్ ప్రియులందరి కల. కానీ దాని భారీ ధర కారణంగా…
Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్లకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది.…
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
This website uses cookies.