Anchor Shyamala : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఎనిమిది రోజుల గడువు మాత్రమే ఉండడంతో రాజకీయ నాయకులు ప్రచారాలను జోరుగా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సినీ ఇండస్ట్రీకి చెందిన స్టార్ సెలబ్రిటీస్ సైతం ఎన్నికల ప్రచారాలలో పాల్గొంటూ తమ అభిమాన రాజకీయ నేతలకు మద్దతుగా నిలుస్తున్నారు. మరి ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సినీ ఇండస్ట్రీ నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల మెగా హీరో వరుణ్ తేజ్ కూడా ప్రచారాలలో పాల్గొని తన బాబాయ్ కోసం మద్దతుగా నిలిచారు. అదేవిధంగా జబర్దస్త్ కమెడియన్స్ సుడిగాలి సుదీర్ హైపర్ ఆది , గెటప్ శీను జనసేన పార్టీ తరఫున ప్రచారాలు చేస్తూ వస్తున్నారు.
ఇక వైసీపీ విషయానికొస్తే ప్రముఖ యాంకర్ శ్యామల వైసీపీ పార్టీ తరపున ప్రచారాలు చేస్తున్నారు. ఈ నేపద్యంలో తాజాగా ఓ ప్రచారాలలో భాగంగా శ్యామల పాల్గొనడం జరిగింది. గట్టి లీడర్ ను ఎదుర్కోవాలంటే ఆమాత్రం ఉండాలి… ప్రచారం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన శ్యామల ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే న్యూస్ రిపోర్టర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం లో సినీ సెలబ్రెటీలు చాలామంది ప్రచారాలు చేస్తున్నారు. అయితే పిఠాపురం నియోజకవర్గంలో కేవలం వంగా గీత అనే మహిళను ఓడించడానికి ఇంతమంది అవసరమా అని అడగగా…దానికి శ్యామల సమాధానం ఇస్తూ..
వంగ గీత గారి రాజకీయ ప్రస్తావం చూసుకున్నట్లయితే ఆమె ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు పనిచేసారో అందరికీ తెలుసు. అలాగే ఆమె పనిచేసిన ప్రతి పదవిలోనూ ఆమె చేయగలిగినంత చేసి చూపించారు. అంతేకాక పిఠాపురం నియోజకవర్గం లో ఆమె గురించి ప్రజలందరికీ తెలుసు. మరి ఇలాంటి ఒక స్ట్రాంగ్ క్యాండేట్ ని ఎదుర్కోవాలి అంటే ఆ మాత్రం సపోర్ట్ కోరుకోవడంలో తప్పు లేదంటూ శ్యామల తెలియజేశారు. ఇక జబర్దస్త్ కు చెందినవారు ఇక్కడ ప్రచారాలు చేస్తున్నారంటే దానికి రకరకాల కారణాలు ఉండవచ్చు. వారిపై ప్రెషర్ కూడా ఉండవచ్చు. కానీ పిఠాపురం నియోజకవర్గంలో వంగ గీత గారి గెలుపు మాత్రం ఖాయం అయిపోయిందని , ఆమెని కొట్టడం ఇక ఎవరి తరం కాదంటూ శ్యామల తేలియజేశారు. దీంతో ప్రస్తుతం శ్యామల చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాలలో సంచలనంగా మారాయి.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.