Anchor Shyamala
Anchor Shyamala : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఎనిమిది రోజుల గడువు మాత్రమే ఉండడంతో రాజకీయ నాయకులు ప్రచారాలను జోరుగా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సినీ ఇండస్ట్రీకి చెందిన స్టార్ సెలబ్రిటీస్ సైతం ఎన్నికల ప్రచారాలలో పాల్గొంటూ తమ అభిమాన రాజకీయ నేతలకు మద్దతుగా నిలుస్తున్నారు. మరి ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సినీ ఇండస్ట్రీ నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల మెగా హీరో వరుణ్ తేజ్ కూడా ప్రచారాలలో పాల్గొని తన బాబాయ్ కోసం మద్దతుగా నిలిచారు. అదేవిధంగా జబర్దస్త్ కమెడియన్స్ సుడిగాలి సుదీర్ హైపర్ ఆది , గెటప్ శీను జనసేన పార్టీ తరఫున ప్రచారాలు చేస్తూ వస్తున్నారు.
ఇక వైసీపీ విషయానికొస్తే ప్రముఖ యాంకర్ శ్యామల వైసీపీ పార్టీ తరపున ప్రచారాలు చేస్తున్నారు. ఈ నేపద్యంలో తాజాగా ఓ ప్రచారాలలో భాగంగా శ్యామల పాల్గొనడం జరిగింది. గట్టి లీడర్ ను ఎదుర్కోవాలంటే ఆమాత్రం ఉండాలి… ప్రచారం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన శ్యామల ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే న్యూస్ రిపోర్టర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం లో సినీ సెలబ్రెటీలు చాలామంది ప్రచారాలు చేస్తున్నారు. అయితే పిఠాపురం నియోజకవర్గంలో కేవలం వంగా గీత అనే మహిళను ఓడించడానికి ఇంతమంది అవసరమా అని అడగగా…దానికి శ్యామల సమాధానం ఇస్తూ..
వంగ గీత గారి రాజకీయ ప్రస్తావం చూసుకున్నట్లయితే ఆమె ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు పనిచేసారో అందరికీ తెలుసు. అలాగే ఆమె పనిచేసిన ప్రతి పదవిలోనూ ఆమె చేయగలిగినంత చేసి చూపించారు. అంతేకాక పిఠాపురం నియోజకవర్గం లో ఆమె గురించి ప్రజలందరికీ తెలుసు. మరి ఇలాంటి ఒక స్ట్రాంగ్ క్యాండేట్ ని ఎదుర్కోవాలి అంటే ఆ మాత్రం సపోర్ట్ కోరుకోవడంలో తప్పు లేదంటూ శ్యామల తెలియజేశారు. ఇక జబర్దస్త్ కు చెందినవారు ఇక్కడ ప్రచారాలు చేస్తున్నారంటే దానికి రకరకాల కారణాలు ఉండవచ్చు. వారిపై ప్రెషర్ కూడా ఉండవచ్చు. కానీ పిఠాపురం నియోజకవర్గంలో వంగ గీత గారి గెలుపు మాత్రం ఖాయం అయిపోయిందని , ఆమెని కొట్టడం ఇక ఎవరి తరం కాదంటూ శ్యామల తేలియజేశారు. దీంతో ప్రస్తుతం శ్యామల చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాలలో సంచలనంగా మారాయి.
TGSRTC : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఎస్ఆర్టీసీ బస్సుల బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచింది. కొత్త ధరలు జూన్ 9…
Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి సారించారు. ప్రజల…
Ranapala Plant Benefits : ఈ రోజుల్లో అనారోగ్య సమస్యల పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అందుకని కొంతమంది ఔషధ…
Honey Moon : మధ్యప్రదేశ్ కి చెందిన రాజా రఘువంశీ, సోనమ్ జంట మే 11న వివాహం చేసుకుని మే…
Mudragada Padmanabham : సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం తన కుటుంబానికి సంబంధించిన అంశాలను బహిరంగంగా పంచుకున్నారు. తాజాగా విడుదల…
Kommineni Srinivasa Rao Arrest : అమరావతి Amaravathi మహిళలను కించపరిచిన విషయంలో కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా వ్యవహరిస్తుంది.…
Summer Eye Care : ఎండాకాలం అయిపోతున్న ఎండలు తగ్గడం లేదు. అధిక వేడితో,ఉబ్బరింపుతో,ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి…
Today Gold Rate : భారతీయులు India gold rate బంగారాన్ని Gold Price భద్రత, సంపదగా భావిస్తూ ఆభరణాల…
This website uses cookies.