
YS Jagan Mohan Reddy : ఎట్టకేలకి ఢిల్లీలో ధర్నాకి కూర్చున్న జగన్.. కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు
YS Jagan Mohan Reddy : గత కొద్ది రోజులుగా ఏపీ ప్రభుత్వంపై జగన్ పోరాడుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఢిల్లీలో ధర్నా చేస్తానంటూ జగన్ సంచలన ప్రకటన కూడా చేశారు. దేశ రాజధానిలో జరిగే ఈ పోరాటంలో అందరూ భాగస్వామ్యం కావాలంటూ విపక్ష పార్టీలకు జగన్ ఆహ్వానిస్తూ .. అందరిని ఏకం చేసి తమ పోరాట కార్యక్రమానికి మద్దతు ఉండేలా జగన్ ప్లాన్ చేసుకున్నారు. దీనిలో భాగంగానే నేడు(జులై 24) ఢిల్లీలో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. వైసీపీ కీలక నాయకులంతా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. జంతర్ మంతర్లో పాల్గొన్న జగన్ మాట్లాడుతూ.. ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపించారు.
ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్మంతర్లో దీక్ష చేపట్టిన జగన్ మరి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 45 రోజుల్లోనే 30కిపైగా హత్యలు జరిగాయని ఆరోపించారు. దాడుల భయంతో దాదాపు 300 మంది వలస వెళ్లిపోయారని తెలిపారు. ప్రైవేటు ఆస్తులను యథేచ్ఛగా ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే 560 మంది ప్రైవేటు వ్యక్తుల ఆస్తులు ధ్వంసమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? లేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు కుమారుడు లోకేశ్ రెడ్బుక్ పట్టుకున్న ఫొటోలతో కూడిన హోర్డింగ్లు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేశారని తెలిపారు. ఇది ఎలాంటి సందేశాన్ని పంపుతోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోందని విమర్శించారు. దాడులు చేస్తున్న, చంపుతున్న, ఆస్తులు ధ్వంసం చేస్తున్న వారిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.
YS Jagan Mohan Reddy : ఎట్టకేలకి ఢిల్లీలో ధర్నాకి కూర్చున్న జగన్.. కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు
ఈ రోజు వారు అధికారంలో ఉన్నారని, రేపు తాము అధికారంలోకి వస్తామని జగన్ పేర్కొన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి వాటికి పాల్పడలేదన్నారు. తామెప్పుడూ ఇలాంటి వాటిని ప్రోత్సహించలేదని, కాకపోతే ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎలా ఉందో చూడాలని కోరారు. ఏపీలో ఈ మధ్య జరిగిన ఘటనలపై ఫొటో, వీడియో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఏపీలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై దర్యాప్తు సంస్థలతో విచారణ జరపాలని వైసీపీ అధినేత జగన్ డిమాండ్ చేశారు. ఇవాళ్టి ధర్నాతో ఏపీలో జరుగుతున్న దాడులు, హింసాత్మక ఘటనలను దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించామన్నారు జగన్. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ కూడా డిమాండ్ చేశారు.
Central Govt : కేంద్ర ప్రభుత్వం సామాజిక భద్రతను బలోపేతం చేసే దిశగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది.…
New Rules : భారతదేశంలో ఉపాధి రంగం మరియు ఆదాయపు పన్ను వ్యవస్థలో ఏప్రిల్ 1, 2026 నుండి కీలక…
PM Kisan Yojana : భారతదేశ ఆర్థిక వ్యవస్థకు పునాది అయిన రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రారంభించిన…
Gold Silver Rates 26 March 2026 Today : గత వారం రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు…
Karthika Deepam 2 March 26th 2026 Latest Episode : స్టార్ మా ఛానెల్లో ప్రసారమవుతున్న 'కార్తీక దీపం…
Chicken : ఇప్పటి వరకు మార్కెట్లో మటన్ అధిక ధరకు అమ్ముడవుతుండటం మనం చూసే ఉంటాం. కానీ ఇప్పుడు కోళ్లలో…
Tea-biscuit : చాలా మంది బిస్కెట్లు హానికరం కావని భావిస్తూ వాటిని రోజువారీ ‘హెల్తీ స్నాక్’గా తీసుకుంటుంటారు. కానీ తాజా…
Diabetes Medicine : బరువు తగ్గాలని ఆశపడుతున్నవారికి, షుగర్ సమస్యతో బాధపడుతున్నవారికి ఊరటనిచ్చే శుభవార్త అందింది. ఇప్పటి వరకు అధిక…
Iran vs America : ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. ముఖ్యంగా ఇరాన్…
Chanakyaniti : చాణక్యుడు స్త్రీల స్వభావం మరియు పురుషులు అనుసరించాల్సిన జాగ్రత్తల గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను వివరించారు. లోకంలో…
India vs Pak : ప్రపంచ రాజకీయాల్లో అమెరికా USA అనుసరిస్తున్న విధానాలు ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటాయి. ముఖ్యంగా ఆ…
Chicken Shops : తెలంగాణ రాష్ట్రంలో చికెన్ వ్యాపారం సంక్షోభంలో పడే సూచనలు కనిపిస్తున్నాయి. పౌల్ట్రీ కంపెనీల విధానాలపై ఆగ్రహం…
This website uses cookies.