Home » Andhra Pradesh » Ys Jagan Plans Prabhas Mother Shyamala Devi Compete With Raghuramakrishnam Raju
andhra pradesh

Shyamala Devi : వైయస్ జగన్ భారీ స్కెచ్.. రఘురామకృష్ణం రాజుకు పోటీగా ప్రభాస్ తల్లి..!

Authored By
aruna
The Telugu News | Published on: February 5, 2024, 8:00 pm
Advertisement

Shyamala Devi : ఆంధ్రప్రదేశ్లో శాసనసభ ఎన్నికలకు రెండు నెలల సమయం మాత్రమే ఉంది.తెలుగు ప్రజలంతా ఈ ఎన్నికల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది. ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవిని ఒక ప్లేస్ నుంచి పోటీ చేయించాలని వైఎస్ఆర్ సీపీ నాయకులు చూస్తున్నారని తెలుస్తోంది. కృష్ణంరాజు గతంలో బీజేపీ లో ఉన్నారు. అలాగే ప్రజారాజ్యంలో కూడా ఉండి చిరంజీవికి సపోర్ట్ చేశారు. అయితే ఆయన మరణించిన తర్వాత ఎంపీ టికెట్ ను కృష్ణంరాజు భార్య శ్యామలాదేవికి ఆఫర్ చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

అయితే ప్రభాస్ ఈ నిర్ణయం తీసుకొని శ్యామలాదేవి రాజకీయాల్లోకి వస్తున్నారా లేదా అనేది బయటికి రాలేదు. ఆమెకు ఎప్పటినుంచో రాజకియాలలోకి వెళ్లాలని కోరిక ఉందట. అయితే దీంతో ఆమె శ్యామలాదేవి ఏ ప్లేస్ నుంచి పోటీ చేయబోతున్నారు అనేదానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఆమె కచ్చితంగా పశ్చిమగోదావరి జిల్లా నుంచి పోటీ చేస్తారని అనుకుంటున్నారు. అయితే సోషల్ మీడియాలో కృష్ణంరాజు సొంత జిల్లా అయిన నరసాపురం నుంచి శ్యామలాదేవి పోటీ చేయవచ్చని తెలుస్తుంది. అయితే ఆమె రఘురామ కృష్ణంరాజుకు వ్యతిరేకంగా పోటీ చేయబోతున్నారు. గతంలో నర్సాపురం లో వైసీపీ నుంచి రఘురామకృష్ణంరాజు పోటీ చేశారు. అయితే ఇప్పుడు రఘురామకృష్ణం రాజుకి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మధ్య కొన్ని విభేదాలు తలెత్తాయి.

రఘురామకృష్ణం రాజును జైలుకు పంపించడం ఆయనను చిత్రహింసలు పెట్టడం చూసాం. అటువంటి క్యాండిడేట్ కి వ్యతిరేకంగా వైయస్ జగన్ ఎవరిని దింపుతారా అని టెన్షన్ పడుతుండగా తెరపైకి శ్యామలాదేవి వచ్చారు. ఆమె నర్సాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని తెలుస్తుంది. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉండే పెద్దలు ప్రభాస్ తో చాలా క్లోజ్ గా ఉంటారు. యాత్ర 2 సినిమాని యూవీ క్రియేషన్స్ వారే తీస్తున్నారు. వంశీ , ప్రమోద్ ఇద్దరూ ప్రభాస్ కి సన్నిహితులు. ఈ క్రమంలోనే ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి నరసాపురంలో పోటీ చేయనున్నారని ప్రచారం సాగుతోంది. రఘురామకృష్ణం రాజును దెబ్బ కొట్టాలని వైయస్ జగన్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి