
YS Sharmila : బాబాయ్ ని చంపినంతా ఈజీ కాదు నన్ను చంపడం.. వైయస్ జగన్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన వైఎస్ షర్మిల..!
YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా అంశంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైయస్ షర్మిల ఢిల్లీకి వెళ్లారు. అక్కడ దీక్ష కూడా చేపట్టారు.హోదా విషయంలో టీడీపీ, వైసీపీ పార్టీలు విఫలం అయ్యాయని విమర్శించారు. ఈ రెండు పార్టీలు బీజేపీకి బానిసలుగా మారాయని దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు, వైయస్ జగన్ మాట్లాడిన వీడియోలను కూడా ప్రదర్శించారు. ఏపీ ప్రజలను బీజేపీ పార్టీ హీనంగా చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి పార్టీకి టీడీపీ, వైసీపీ గులాం గిరి చేస్తున్నాయని విమర్శించారు. రెండు పార్టీలు కలిసి పదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పటికీ హోదాపై పోరాడటం లేదన్నారు. రాష్ట్రం నుంచి గెలిచిన 25 మంది ఎంపీలు కూడా బీజేపీకి తొత్తులుగా మారారని అన్నారు. వీరంతా మోడీకి బానిసలుగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ, టీడీపీలు హోదాపై ప్రజలకు ఇచ్చిన మాట తప్పుతున్నారు. హామీలను నెరవేర్చలేదు. ఇవాళ అధికారంలో ఉన్నవారు ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేశారు. వీరంతా ఇప్పుడే ఏమైపోయారు. ఏపీలో బీజేపీ కి ఒక్క సీటు లేదు. కానీ వీరంతా వారికి గులాం గిరి చేస్తున్నారు. అసలు మీ మధ్య ఒప్పందం ఏంటో చెప్పాలి. ఇలాగే పరిస్థితుల్లో ఉంటే పోలవరం, రాజధాని, కడప స్టీల్ ఎప్పుడు తీసుకోచ్చుకుంటాము. ఎంపీలు రాజీనామా చేస్తే హోదా వచ్చేది కాదా ఇదంతా మోడీని ప్రశ్నించారని వైఎస్ షర్మిల నిలదీశారు. గతంలో చంద్రబాబు నాయుడు, వైయస్ జగన్ ఇద్దరు కూడా హోదా కోసం పోరాడుతామని చెప్పి ఇప్పుడు మాట తప్పారని విమర్శించారు. ఇలా చేస్తే ప్రజలను మోసం చేసినట్లు కాదా అని ప్రశ్నించారు. ఉత్తరాఖండ్మ హిమాచల్ ప్రదేశ్ కు హోదా వస్తే వేల సంఖ్యలో పరిశ్రమలు వచ్చాయని గుర్తు చేశారు. అలాగే ఏపీకి హోదా ఇస్తే పరిశ్రమలు వస్తాయి కదా అని అన్నారు.
అన్ని విషయాలలో మోసం చేసిన బీజేపీకి ఎందుకు మద్దతిస్తున్నారో చెప్పాలని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. తిరుపతిలో జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోడీ ఏపీకి పదేళ్లపాటు ప్రత్యేక హోదా కొనసాగిస్తామని అన్నారు. విభజన చట్టంలోని హామీలను ఎందుకు ఇప్పటికి నెరవేర్చలేదు. దుగరాజపట్నం పోర్టు నిర్మిస్తామన్నారు. సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేస్తామని ప్రధాని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రజలకు మాటిచ్చారు. ఇచ్చిన హామీలు ఏమయ్యాయని కాంగ్రెస్ పార్టీ ఏపీ ప్రజల తరపున నేను అడుగుతున్నా. ఇవాళ రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయింది. కేవలం ఓటు బ్యాంకు కోసం ఏవేవో మాయమాటలు చెప్పి వాటిలో ఏ ఒక్కటి నెరవేర్చలేదు. చివరకు విశాఖ స్టీల్ ప్రైవేటీకరించాలని ప్రయత్నిస్తూ మరోసారి ఏపీ ప్రజలకు ద్రోహం చేయాలని చూస్తున్నారు అని వైఎస్ షర్మిల మండిపడ్డారు.
ENG vs WI T20 World Cup 2026 : ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 ICC T20…
Velidanda Village : వెలిదండ గ్రామంలో అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం…
Serilingampalli BRS Party : శేరిలింగంపల్లి నియోజకవర్గం బీ.ఆర్.ఎస్ పార్టీ ముఖ్య నాయకుల,కార్యకర్తల ఆధ్వర్యంలో అంబెడ్కర్ విగ్రహానికి పూల మాల…
Ram Charan Upasana Twins : మెగా పవర్స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు (ఒక బాబు,…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది. మొన్నటి వరకు తిరుమల లడ్డూ…
Telangana Municipal Elections : తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొన్న వేళ ‘పీపుల్స్ పల్స్’ సంస్థ…
BB Jodi Season 2 : ఈ వారం స్టార్ మాలో ప్రసారమయ్యే బిబి జోడి సీజన్ 2 ప్రోమో…
YSRCP : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రస్తుత పరిస్థితి మరియు పార్టీ…
This website uses cookies.