
Ys sharmila : జగన్ అంటే షర్మిళకి ఎందుకింత కక్ష.. ఒక్కట్వీట్తో ఇరుకున పెట్టేసిందిగా..!
Ys sharmila : తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో అన్నాచెల్లెలు అంటే మొదటగా గుర్తుకొచ్చేది కేటీఆర్, కవిత. ఆ తర్వాత వైఎస్ జగన్, షర్మిల గుర్తుకు వస్తారు. ఐదేళ్ల కిందటి వరకు జగన్, షర్మిల అన్యోన్యంగా ఉండేవారు. ఎంతో ప్రేమానురాగాలతో.. వివాహాలు జరిగి వేర్వేరు కుటుంబాలుగా మారినా తరచూ కలుస్తూ అందరికి ఆదర్శంగా ఉండేవారు. తాడేపల్లిలోని నివాసంలోనే జగన్, షర్మిల ఉండేవారు. షర్మిలను కన్న తండ్రి మాదిరి జగన్ చూసుకునేవారు. ఇదే విషయాన్ని షర్మిల చాలాసార్లు బహిరంగ వేదికల్లో చెప్పారు. ‘జగనన్న నన్ను పెద్దకూతురిలా చూసుకుంటారు. ఆయన నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటారు’ అని చాలా ఇంటర్వ్యూల్లో షర్మిల చెప్పారు. షర్మిల కూడా జగనన్నతో ప్రేమగా.. అంతేకాకుండా అన్న కష్టాల్లోనూ తోడుగా నిలిచారు.
కొన్ని కేసుల్లో అరెస్టయ్యి జైల్లో ఉంటే జగనన్నకు అండగా షర్మిల రాజకీయ బాధ్యతలను చేపట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యతను షర్మిల విజయవంతంగా చేపట్టారు. తన తండ్రి వైఎస్సార్, అన్న జగన్ మాదిరి షర్మిల సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ఇలా అన్న కష్టసుఖాల్లో పాలుపంచుకున్న షర్మిల ఐదేళ్ల కిందట అనూహ్యంగా అన్న నుంచి దూరమయ్యారు. అధికారంలోకి వచ్చాక జగన్తో షర్మిలకు భేదాభిప్రాయాలు వచ్చాయి. అనంతరం తెలంగాణలోకి ప్రవేశించి షర్మిల కొత్త పార్టీ పెట్టుకుని విఫలమయ్యారు. అయితే ఆమె తాజాగా జగన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది. విశాఖలోని అచ్యుతాపురం సెజ్లో 17 మంది కార్మికుల మరణాలకు, క్షతగాత్రులకు కారణమైన ఎసెన్షియా ఫార్మా కంపెనీని సీజ్ చేసి చర్యలు తీసుకోవాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు ట్వీట్ చేశారు. ఇటువంటి దారుణాలు, మరీ ముఖ్యంగా విశాఖ పరిసరాల్లో మరోసారి జరగకుండా ఆకస్మిక తనిఖీల ద్వారా నియంత్రణకు పూనుకోవాలని సూచించారు.
Ys sharmila : జగన్ అంటే షర్మిళకి ఎందుకింత కక్ష.. ఒక్కట్వీట్తో ఇరుకున పెట్టేసిందిగా..!
సెజ్లో భద్రతా పట్ల నిర్లక్ష్యం కనిపించినా వెంటనే ఆ ప్లాంట్లు మూసివేయాలని కోరారు. కంపెనీ నిర్వాహకాలు, ప్రమాదాలపై ఓ సంస్థ నాటి వైసీపీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని, అయితే ప్రభుత్వం నివేదికపై మౌనం వహించిందని ఆమె ఆరోపించారు. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన నుంచి ఏమి నేర్చుకోకుండా రిషి కొండను పిండిచేసి రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టుకునేందుకు డబ్బు, తీరిక ఉంటుంది. కాని కార్మికుల ప్రాణాల రక్షణకు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదని వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఆక్రోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం షర్మిళ ట్వీట్ వైరల్ అవుతుంది.
Couple Friendly Movie Review : ప్రముఖ నిర్మాణ సంస్థ UV Creations సమర్పణలో రూపొందిన తాజా యూత్ఫుల్ లవ్…
Seetha Payanam Movie Review : యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా Arjun కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్గా Arjun…
Kalyan - Thanuja : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ముగిసి రెండు నెలలు కావస్తున్నా, విన్నర్ కళ్యాణ్…
Sreeja : బిగ్బాస్ సీజన్-9 ద్వారా వెలుగులోకి వచ్చిన కామనర్ కంటెస్టెంట్ దమ్ము శ్రీజ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన…
Ysrcp : 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి తో కేవలం 11 సీట్లే సాధించుకున్న వైసీపీ పార్టీ మళ్ళీ ఇప్పుడు…
Ys Jagan : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెన్నైలో ఒక పెళ్లి వేడుకకు వెళ్తే అది కాస్తా ఇప్పుడు…
Ram Charan Upasana Twins Names : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులకు సంబంధించి…
Johnny Master : చిక్రీ సాంగ్లో హుక్ స్టెప్ ఐడియా నాది కాదు.. అసలు విషయం బయటపెట్టిన జానీ మాస్టర్…
This website uses cookies.