
Business idea varanasi organic strawberry farming lockdown unemployment lakhs
Business idea : ప్రపంచవ్యాప్తంగా కరోనా చూపిన ప్రభావం అంతా ఇంతా కాదు. కొవిడ్ వైరస్ను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు విధించిన లాక్ డౌన్ తెచ్చిన ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఈ వైరస్ ప్రభావం చాలా దేశాలపై తీవ్రంగా ఉంది. పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అయ్యాయి. పేద దేశాల నుండి అగ్ర రాజ్యాల వరకు కరోనాతో విలవిల్లాడాయి. కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా తగ్గినా.. అది చూపించిన ప్రభావం మాత్రం ఇంకా తొలగిపోలేదు.ఈ సంక్షోభంలో చాలా రంగాలను తీవ్ర నష్టాలకు గురి చేసింది. లాక్ డౌన్ సమయంలో పలు కంపెనీలు, సంస్థలు మూత పడ్డాయి. చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి… జీవితం గడవక ఎన్నో ఇబ్బందులు పడటం కళ్లారా చూశాం. అయితే.. కరోనా పలు రంగాలకు ఎంతో మేలు కూడా చేసింది. ఎన్నడూ లేనంత లాభాలు సాధించాయి. ఉన్నట్టుండి బిజినెస్ అమాంతం పెరిగి పోయింది. అయితే కరోనా సంక్షోభంలో పలువురు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడగా.
మరికొందరు మాత్రం చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించి… మంచి లాభాలు సంపాదించారు.అచ్చంగా ఇలాంటి పరిస్థితి వారణాసికి చెందిన రమేష్కు వచ్చింది. కరోనా లాక్డౌన్ సమయంలో ఉద్యోగం పోతుందన్న భయమే.. ఇప్పుడు ఆయనను లాభాల బాట పట్టించే సాగు వైపు తీసుకెళ్లింది. ఇప్పుడు లక్షలకొద్దీ సంపాదిస్తున్నాడు.ఒక ప్రైవేటు పాఠశాలలో రిసోర్స్ మేనేజర్గా పని చేసే రమేష్.. కరోనా లాక్డౌన్ సమయంలో తన ఉద్యోగాన్ని కోల్పోయి పరిస్తితుల్లోకి నెట్టి వేయబడ్డాడు. ఉన్న ఉపాధి మార్గం పోతే ఎలా భావించిన రమేష్… మరో ఆదాయ మార్గం గురించి వెతకడం ప్రారంభించాడు. అదే సమయంలో తన స్నేహితునితో కలిసి రెండెకరాల భూమిలో సేంద్రీయ పద్ధతిలో స్ట్రాబెర్రీలను సాగు చేయాలని భావించాడు. కానీ వారికి ఎలాంటి అనుభవం లేదు. అయినా ముందుకే అడుగు వేశారు. ఇంటర్నెట్లో శోధించారు. వర్క్షాపులకు అటెండ్ అయ్యారు. స్ట్రాబెర్రీలను పండిస్తున్న ఎందరో రైతులను కలిసి సాగు మెలకువలను నేర్చుకున్నారు.
Business idea varanasi organic strawberry farming lockdown unemployment lakhs
స్ట్రాబెర్రీలు పండటానికి చల్లని వాతావరణం కావాలని.. వారణాసిలో అక్టోబరు నుండి ఫిబ్రవరి వరకు అనుకూల వాతావరణం ఉంటుందని గుర్తించారు. కొత్త కొత్త పద్దతులను అవలంభిస్తూ సాగు చేపట్టారు. డిప్ ఇరిగేషన్తో పాటు నీటి సంరక్షణ పద్ధతులు పాటించారు. క్రమంగా వారి కష్టానికి ఫలితం రావడం మొదలైంది. అది వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇప్పుడు ఒక మొక్క నుంచి సగటున 500 గ్రాముల పండ్లు దిగుబడి వస్తోంది. రెండెకరాల పొలంలో 15 వేల మొక్కలు పెంచుతున్నారు. ఒక కిలో స్ట్రాబెర్రీ సగటున రూ. 200కి అమ్ముడవుతోంది. ప్రస్తుతం, రమేష్ అతని స్నేహితుడు మదన్ మొదటి పంట చివరి దశలో ఉన్నారు. పంట చేతికొచ్చి అమ్ముడు పోతే వారికి దాదాపు రూ. 5 లక్షల కంటే ఎక్కువే ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. అంటే వారి నెలవారీ ఆదాయం లక్షకు పైగానే ఉంటుంది.రమేష్, మదన్ ఇద్దరు కలిసి వారి పొదుపు నుంచి దాదాపు రూ. 9 లక్షలు రూపాయలు పెట్టుబడిగా పెట్టారు. వారు పెట్టిన పెట్టుబడి ఒక సంవత్సరంలో తిరిగి వస్తుందని ఆశిస్తున్నారు.
Vijaysai Reddy : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ బిల్లు లోక్సభలో వీగిపోయిన సంగతి తెలిసిందే.…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలని లేదా భవన నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్న వారికి, ముఖ్యంగా బిల్డర్లకు…
Amit Shah : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…
Ration Card : అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ప్రతి నెల ధాన్యం…
Pithapuram Varma : పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం…
Abhishek Sharma : సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్తో అభిమానులను అలరించాడు. ఈ…
Power Bill : ప్రస్తుతం ప్రతి ఇంటిలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఫ్రిడ్జ్, టీవీ,…
Watermelon : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండగా ప్రజలు చల్లదనం కోసం పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. భానుడి భగభగలతో…
Sharbat : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో శరీరంలోని నీటి శాతం తగ్గిపోవడం సాధారణ సమస్య. దీని వల్ల అలసట,…
YS jagan : శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ సీనియర్…
IPAC : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా నిలిచిన ఎన్నికల వ్యూహకర్త సంస్థ 'ఐప్యాక్' ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురిలో…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక విలక్షణమైన శైలిని అనుసరిస్తారు. రాజకీయాల్లో ఎవరి…
This website uses cookies.