Business idea : లాక్‌డౌన్‌ వల్ల ఉద్యోగం పోతుందనే భయంతో ఆర్గానిక్‌ స్ట్రాబెర్రీని పండించి లక్షలు సంపాదిస్తున్నాడు.. ఎక్కడో తెలుసా?

Advertisement
Advertisement

Business idea : ప్రపంచవ్యాప్తంగా కరోనా చూపిన ప్రభావం అంతా ఇంతా కాదు. కొవిడ్‌ వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు విధించిన లాక్ డౌన్‌ తెచ్చిన ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఈ వైరస్‌ ప్రభావం చాలా దేశాలపై తీవ్రంగా ఉంది. పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అయ్యాయి. పేద దేశాల నుండి అగ్ర రాజ్యాల వరకు కరోనాతో విలవిల్లాడాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి పూర్తిగా తగ్గినా.. అది చూపించిన ప్రభావం మాత్రం ఇంకా తొలగిపోలేదు.ఈ సంక్షోభంలో చాలా రంగాలను తీవ్ర నష్టాలకు గురి చేసింది. లాక్ డౌన్ సమయంలో పలు కంపెనీలు, సంస్థలు మూత పడ్డాయి. చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి… జీవితం గడవక ఎన్నో ఇబ్బందులు పడటం కళ్లారా చూశాం. అయితే.. కరోనా పలు రంగాలకు ఎంతో మేలు కూడా చేసింది. ఎన్నడూ లేనంత లాభాలు సాధించాయి. ఉన్నట్టుండి బిజినెస్‌ అమాంతం పెరిగి పోయింది. అయితే కరోనా సంక్షోభంలో పలువురు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడగా.

Advertisement

మరికొందరు మాత్రం చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించి… మంచి లాభాలు సంపాదించారు.అచ్చంగా ఇలాంటి పరిస్థితి వారణాసికి చెందిన రమేష్‌కు వచ్చింది. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఉద్యోగం పోతుందన్న భయమే.. ఇప్పుడు ఆయనను లాభాల బాట పట్టించే సాగు వైపు తీసుకెళ్లింది. ఇప్పుడు లక్షలకొద్దీ సంపాదిస్తున్నాడు.ఒక ప్రైవేటు పాఠశాలలో రిసోర్స్ మేనేజర్‌గా పని చేసే రమేష్‌.. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో తన ఉద్యోగాన్ని కోల్పోయి పరిస్తితుల్లోకి నెట్టి వేయబడ్డాడు. ఉన్న ఉపాధి మార్గం పోతే ఎలా భావించిన రమేష్‌… మరో ఆదాయ మార్గం గురించి వెతకడం ప్రారంభించాడు. అదే సమయంలో తన స్నేహితునితో కలిసి రెండెకరాల భూమిలో సేంద్రీయ పద్ధతిలో స్ట్రాబెర్రీలను సాగు చేయాలని భావించాడు. కానీ వారికి ఎలాంటి అనుభవం లేదు. అయినా ముందుకే అడుగు వేశారు. ఇంటర్‌నెట్‌లో శోధించారు. వర్క్‌షాపులకు అటెండ్‌ అయ్యారు. స్ట్రాబెర్రీలను పండిస్తున్న ఎందరో రైతులను కలిసి సాగు మెలకువలను నేర్చుకున్నారు.

Advertisement

Business idea varanasi organic strawberry farming lockdown unemployment lakhs

స్ట్రాబెర్రీలు పండటానికి చల్లని వాతావరణం కావాలని.. వారణాసిలో అక్టోబరు నుండి ఫిబ్రవరి వరకు అనుకూల వాతావరణం ఉంటుందని గుర్తించారు. కొత్త కొత్త పద్దతులను అవలంభిస్తూ సాగు చేపట్టారు. డిప్‌ ఇరిగేషన్‌తో పాటు నీటి సంరక్షణ పద్ధతులు పాటించారు. క్రమంగా వారి కష్టానికి ఫలితం రావడం మొదలైంది. అది వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇప్పుడు ఒక మొక్క నుంచి సగటున 500 గ్రాముల పండ్లు దిగుబడి వస్తోంది. రెండెకరాల పొలంలో 15 వేల మొక్కలు పెంచుతున్నారు. ఒక కిలో స్ట్రాబెర్రీ సగటున రూ. 200కి అమ్ముడవుతోంది. ప్రస్తుతం, రమేష్ అతని స్నేహితుడు మదన్ మొదటి పంట చివరి దశలో ఉన్నారు. పంట చేతికొచ్చి అమ్ముడు పోతే వారికి దాదాపు రూ. 5 లక్షల కంటే ఎక్కువే ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. అంటే వారి నెలవారీ ఆదాయం లక్షకు పైగానే ఉంటుంది.రమేష్‌, మదన్‌ ఇద్దరు కలిసి వారి పొదుపు నుంచి దాదాపు రూ. 9 లక్షలు రూపాయలు పెట్టుబడిగా పెట్టారు. వారు పెట్టిన పెట్టుబడి ఒక సంవత్సరంలో తిరిగి వస్తుందని ఆశిస్తున్నారు.

Advertisement

Recent Posts

Bigg Boss 8 Telugu : పెద్ద స్కెచ్చే వేశారుగా… ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆ గ్లామ‌ర‌స్ బ్యూటీని తెస్తున్నారా..!

Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది.…

27 mins ago

Tasty Energy Bars : ఎనర్జీ బార్స్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసుకోండి…!

Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…

1 hour ago

Horoscope : జాతకంలో మంగళ దోషం ఉంటే ఇలా చేయండి… గురు బలం పెరిగి అదృష్టం పడుతుంది…!

Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…

2 hours ago

Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!

Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…

3 hours ago

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

4 hours ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

5 hours ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

6 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

15 hours ago

This website uses cookies.