Business Ideas : ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. ఈ స్లోగన్ ఒక సెల్యూలార్ కంపెనీది. కానీ, ఇది 110 శాతం నిజం. ఆ నిజ జీవిత కథలు మనకు అప్పుడప్పుడూ కనిపిస్తూనే ఉంటాయి. అప్పటి వరకు సామాన్యులుగా ఉన్న వారిని ఆ ఒక్క ఐడియా సంపన్నులను చేస్తుంది. సాధారణ జీవితం గడిపే వారిని సెలబ్రిటీని చేస్తుంది. ఇది కూడా అలాంటి స్టోరీయే. ఈ కోటీశ్వరురాలి పేరు శిల్పి సిన్హా. ఎనిమిదేళ్ల క్రితం వరకు ఝార్ఖండ్ లోని డాల్టన్ గంజ్ లో ఉండేది. రోజూ ఉదయం లేవగానే ఓ కప్పు పాలను తాగడం శిల్పి సిన్హా అలవాటు. ఉన్నత చదువుల కోసం బెంగళూరుకు వచ్చిన శిల్పి… తన అలవాటు ప్రకారమే ఓ రోజు ఉదయం పాలను తాగింది. కానీ అవి ఎందుకో టేస్టీగా అనిపించలేదు.
ఎందుకంటే అవి కల్తీ పాలు. స్వచ్ఛమైన పాల కోసం బెంగళూరులో చాలా ప్రయత్నాలే చేసింది. కానీ తన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. కల్తీ పాల వ్యాపారం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకున్న శిల్పి తానే ఆవు పాల వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంది. పాడి రైతులను కలవడం ప్రారంభించింది. ఆవుల దాణా, వాటి సంరక్షణ గురించి పూర్తి వివరాలు సేకరించింది. స్వచ్ఛమైన పాలను తనకు అమ్మాలని ఇతరుల కంటే ఎక్కువ ధరే ఇస్తానని చెప్పడంతో… రైతులు శిల్పికి స్వచ్ఛమైన పాలను అమ్మేందుకు అంగీకరించారు. కానీ.. ఆ పాలను సేకరించే వాళ్లు మొదట శిల్పి దొరకలేదు. దాంతో తనే తెల్లవారుజామున 3 గంటలకు రైతుల వద్దకు వెళ్లేది. పాలను సేకరించి బెంగళూరులో అమ్మడం మొదలు పెట్టింది.
ఆమె నిజాయితీ, పాలలోని స్వచ్ఛత ఆ నోటా ఈ నోటా తెలిసి క్రమంగా తన వినియోగదారుల సంఖ్యను పెంచుకుంది. కస్టమర్ల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతూండటంతో రెండేళ్ల క్రితం తన సంస్థకు ది మిల్క్ ఇండియా అనే పేరు పెట్టింది శిల్పి. నాణ్యమైన పశుగ్రాసాన్ని ఇస్తే ఆరోగ్యకరమైన పాలు వస్తాయని, ఆ పాలకు మంచి ధర ఇస్తానని రైతులకు చెప్పింది శిల్పి. కానీ మొదట రైతులెవరూ తన మాట నమ్మలేదు. క్రమంగా శిల్పి అధిక ధర చెల్లించడంతో వారు శిల్పిని నమ్మడం మొదలు పెట్టారు. కర్ణాటక, తమిళనాడులోని 21 గ్రామాల్లోని రైతులు ఇప్పుడి ది మిల్క్ ఇండియాకు పాలు విక్రయిస్తున్నారు. 11 వేల రూపాయలతో మొదలైన ది మిల్స్ ఇండియా రెండేళ్లలోనే కోటి రూపాయల టర్నోవర్ సాధించింది.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.