
Anil Ambani : అనిల్ అంబానీకి గట్టి ఎదురుదెబ్బ...వేల కోట్ల ఆస్తులు జప్తు
ED Tightens Noose on Anil Ambani : ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఏడీఏజీ (ADAG) గ్రూప్ అధినేత అనిల్ అంబానీకి కష్టాలు ముగిసేలా కనిపించడం లేదు. గతంలో తీసుకున్న భారీ రుణాలు, వాటి మళ్లింపు ఆరోపణలు ఇప్పుడు ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. తాజాగా అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ కంపెనీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి ఉక్కుపాదం మోపింది. తాజాగా రూ. 1,800 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. దీంతో ఈ కేసులకు సంబంధించి ఇప్పటివరకు అనిల్ అంబానీ సంస్థల నుండి జప్తు చేసిన మొత్తం ఆస్తుల విలువ అక్షరాలా రూ. 12,000 కోట్లకు చేరుకుంది. యెస్ బ్యాంక్ మోసం కేసుతో పాటు రిలయన్స్ కమ్యూనికేషన్స్, హోమ్ ఫైనాన్స్ సంస్థల్లో జరిగిన ఆర్థిక అవకతవకలపై మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈ చర్యలు తీసుకున్నారు.
Anil Ambani : అనిల్ అంబానీకి గట్టి ఎదురుదెబ్బ…వేల కోట్ల ఆస్తులు జప్తు
ఈడీ జప్తు చేసిన ఆస్తుల్లో కేవలం నగదు మాత్రమే కాకుండా, కీలక కంపెనీల్లోని వాటాలు కూడా ఉన్నాయి. బీఎస్ఈఎస్ రాజధాని పవర్, బీఎస్ఈఎస్ యమునా పవర్, మరియు ముంబై మెట్రో వన్ ప్రైవేట్ లిమిటెడ్లో రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఉన్న వాటాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు ముంబైలోని విలాసవంతమైన నివాస సముదాయాలు, వివిధ నగరాల్లో ఉన్న రియల్ ఎస్టేట్ స్థలాలు, భారీ మొత్తంలో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లను కూడా అటాచ్ చేశారు. కేవలం అనిల్ అంబానీ ఆస్తులే కాకుండా, సంస్థకు చెందిన ఇతర సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ వ్యక్తిగత ఆస్తులను కూడా దర్యాప్తు సంస్థ వదలకపోవడం గమనార్హం.
యెస్ బ్యాంక్ నుంచి సుమారు రూ. 12,000 కోట్లకు పైగా రుణాలు తీసుకున్న రిలయన్స్ గ్రూప్, ఆ నిధులను ఉద్దేశించిన అవసరాలకు కాకుండా షెల్ కంపెనీల ద్వారా ఇతర ప్రయోజనాలకు మళ్లించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ వ్యవహారంలో ఫెమా (FEMA) నిబంధనల ఉల్లంఘన కూడా జరిగినట్లు ఈడీ నిర్ధారించింది. గతేడాది అనిల్ అంబానీ కుమారుడు జై అన్మోల్ అంబానీపై కూడా సీబీఐ కేసు నమోదు చేయడంతో అంబానీ కుటుంబం చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మళ్లీ వ్యాపార రంగంలోకి రీ-ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నిస్తున్న తరుణంలో, ఈ భారీ ఆస్తుల జప్తు అనిల్ అంబానీ భవిష్యత్తు ప్రణాళికలను తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉంది.
YSRCP: గంగాధర నెల్లూరు రాజకీయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా వైసీపీలో కృపా లక్ష్మి YCP…
Ambati Rambabu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల సమీకరణాలు ఎప్పుడూ వేడి పుట్టిస్తూనే ఉంటాయి. తాజాగా ఒక టీవీ చర్చా…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా వంట గ్యాస్ సరఫరాలో తలెత్తిన ఇబ్బందులు సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.…
Jayashankar : ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గాల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ భారత్ తన వ్యూహచతురతతో తన నౌకలను సురక్షితంగా ఒడ్డుకు…
Chandrababu and Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ నడుస్తోంది అదేమిటంటే నారా లోకేష్…
YS Jagan : తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారనే వార్త ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను ఊపేస్తోంది.…
Gold and Silver Rate 15 March 2026 : బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న పసిడి ప్రియులకు,…
Curd for Health : పెరుగు అనేది అన్ని కాలాల్లో తినదగిన పోషకాహారం. ముఖ్యంగా వేసవి కాలంలో ఇది శరీరానికి…
Sugarcane Juice : వేసవి కాలం ప్రారంభం కావడంతో ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. మండే ఎండలతో ప్రజలు తీవ్ర అసౌకర్యాన్ని…
Gas Shortage : పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో దేశంలో వంటగ్యాస్ కొరత ఏర్పడుతుందనే వార్తలు ప్రజల్లో ఆందోళన…
SBI Fellowship : డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మంచి అవకాశాల కోసం చూస్తున్న యువతకు దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ…
LPG Gas : ఇరాన్ ప్రాంతంలో జరుగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.…
This website uses cookies.