Business Idea : దేనికీ పనికిరాని భూమిలో ఆర్గానిక్ పంటను పండిస్తూ నెలకు 18 లక్షలకు సంపాదిస్తున్న సాధారణ మహిళ

Advertisement
Published by
Advertisement

Business Idea : కేరళకు చెందిన ఓ మహిళా రైతు తనకు చెందిన మారుతీ గార్డెన్స్ లో వివిధ రకాల పండ్లు, కూరగాయలు మరియు చేపలను సాగు చేస్తోంది. అయితే ఆమె ఎలాంటి రసాయన ఎరువుల వాడకుండా సేంద్రీయ పద్ధతిలోని వీటిని పండిచడం అక్కడి ప్రజలను ఆకట్టుకుంటోంది. కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్‌ ఎల్పుల్లి గ్రామంలోనే ఈ మారుతీ గార్డెన్స్ ఉంది. దాదాపు 24 ఎకరాల భూమిలో బంగారం లాంటి వరి పొలాలు, పండ్ల తోటలు, కూరగాయలు, చేపలను పి. భువనేశ్వరి సాగు చేస్తున్నారు. ఈ మారుతీ గార్డెన్.. ఈడెన్ గార్డెన్ కంటే ఏమాత్రం తక్కువ కాదని అక్కడి ప్రజలు చెప్తుంటారు. అయితే 90వ దశకంలో… 4 ఎకరాల బంజరు భూమిలో సేంద్రియ పంటలు పండిచడం ప్రారంభించింది భవనేశ్వరి. రాళ్లు, రప్పలు ఉన్న భూమిని సస్య శ్యామలం చేసి, చివరికి 24 ఎకరాలకు విస్తరించింది.“ప్రారంభంలో… ఎండిన భూమి, రాళ్లు, రప్పలతో నిండి ఉంది. అయితే ఆ భూమిని చదును చేసేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎలాగోలా కష్టపడి అందులో పంటలు పండించడం మొదలు పెట్టాను.

Advertisement

అయితే వ్యవసాయానికి నేను ఎలాంటి ఎరువులు, పురుగుల మందులు వాడలేదు. సేంద్రియ పద్ధతిలోనే పంటలు పండించాను.”- పి. భూవనేశ్వరిసంప్రదాయ వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగిన భువనేశ్వరి..  పదో తరగతి వరకు మాత్రమే చదువుకుంది. తనకు చదువుకంటే కూడా వ్యవసాయం చేయడం పైనే ఎక్కువ ఆసక్తి ఉండేది. తన నాన్న కుంజికన్నన్ మన్నాడియర్  కు సాయంగా ఆమె కూడా పొలం పనులు చేసేది. అయితే ఈ క్రమంలోనే ఆమెకు పెళ్లపోయింది. 1995లో భువనేశ్వరి భర్త వెంకట చలపతి స్కూల్ టీచర్ ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యారు. ఆ తర్వాత ఖాళీగా ఉండటం ఇష్టం లేక వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ వారికి ఉన్న నాలుగెకరాల బంజరు భూమిలో పంటలు పండించడం చాలా కష్టం. కానీ ఈ భూమిని ఎలాగైనా చదును చేయాలని నిశ్చయించుకుంది భువనేశ్వరి. ముందుగా కలుపు మొక్కలు, పొదలను తొలగించి ఆపై నిపుణుల సాయంతో షీమా కొన్నా(గ్లిరిసిడియా) మొక్కలను నాటింది.

Advertisement

homaker bhuvaneshwari turns farmer earns lakhs with organic farming at kerala

వీటిని ఆ భూమిలో నాటడం వల్ల భూమి పంటలు పండించేందుకు అణువుగా మారుతుంది. ఇలా దాదాపు ఐదేళ్లు కష్టపడి భూమిని చదును చేసింది.ఈ సమయంలోనే ఎరువులు, రసాయన పదార్థాలు వాడకుండా కేవలం సేంద్రియ పద్ధతిలోనే పంటలు పండిచాలనకున్న ఆమె దాని గురించి తెలుసుకునేందుకు ఎంతో కష్టపడింది. సహజ సేంద్రియ వ్యవసాయానికి మార్గదర్శకుడైన సుభాష్ పాలేకర్ వర్క్‌షాప్‌కు కూడా హాజరైంది. అక్కడే రసాయన ఎరువులకు బదులుగా జీవామృతం, పంచగవ్యం ​​వంటి సహజసిద్ధమైన ఎరువులను తయారు చేయడం నేర్చుకుంది. ఈ క్రమంలోనే బ్యాంకులో రుణం తీసుకొని 20 ఆవులను కొనుగోలు చేసింది. వాటి నుంచి వచ్చే పాలను అమ్ముకుంటా డబ్బులు సంపాదించింది. అలాగే పేడ, మూత్రంతో ఎరువులు తయారు చేస్తూ.. సేంద్రియ పద్ధతిలో పంటలు పండించింది. ఇలా చేపల సాగును కూడా ప్రారంభించి లాభాలను సాధించింది.

సేంద్రియ వ్యవసాయం చేస్తూ.. లక్షలు సంపాదిస్తున్న భవనేశ్వరికి ఇటీవలే మలయాళ మనోరమ వారు కర్షక శ్రీ అవార్డునిచ్చారు. 62 ఏళ్ల వయసున్న భువనేశ్వరి ఇప్పటికీ తెల్లవారక ముందే నిద్రలేచి పొలం పనులు చేస్తుంది. స్వయంగా ఆమే ట్రాక్టర్ నడుపుతూ తన పొలం దున్నుతుంది. వ్యవసాయ పనులు చేయడం వల్లే ఆరు పదుల వయసులో కూడా తాను ఇంత ఎనర్జిటిక్ గా ఉన్నాని చెబుతుంటుంది. వ్యవసాయం చేయడం తనకు ఎంతో సంతోషాన్నిస్తుందని ఆమె అంటుంది.  భువనేశ్వరి వ్యవసాయం చేయడంతో పాటు, టిల్లర్లు మరియు ట్రాక్టర్లను నడపడంలో కూడా నిపుణురాలు.“పాలక్కాడ్‌లో టిల్లర్‌ను సొంతం చేసుకున్న వారిలో మొదటి వ్యక్తి అయిన మా నాన్న వద్ద నేను టిల్లర్ నడపడం నేర్చుకున్నాను. కొన్నేళ్ల క్రితం ట్రాక్టర్‌ నడపడం కూడా నేర్చుకున్నాను. నా పొలాన్ని ఎక్కువగా నేనే దున్నుతుంటాను.”- పి. భూవనేశ్వరి

Advertisement

Recent Posts

Bottle Gourd Juice : సొరకాయ జ్యూస్‌తో నిజంగానే పొట్ట కొవ్వు తగ్గుతుందా..? నిపుణులు చెప్పిన నిజాలు ఇవే!

Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…

2 days ago

Petrol : భారత్‌లో అత్యధికంగా పెట్రోల్ వాడేది ఏ రాష్ట్రం..? షాకింగ్ గణాంకాలు వైరల్!

Petrol  : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…

3 days ago

PM Modi : ఖర్చు ఆపమని కాదు.. తెలివిగా ఖర్చు చేయమన్న మోదీ.. కేంద్రం క్లారిటీ!

PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…

3 days ago

Farmers Good News : రైతులకు గుడ్ న్యూస్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. !

Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…

3 days ago

Donald Trump : చైనాలో ట్రంప్ కి అవ‌మానం.. ప్రపంచ రాజకీయాల్లో కొత్త చర్చ!

Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…

3 days ago

Heart Health : హార్ట్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఇవి చేయండి.. గుండె ఆరోగ్యానికి సింపుల్ ఫిట్‌నెస్ టిప్స్!

Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…

3 days ago

Working Hours : ఎక్కువసేపు కూర్చునే పని చేస్తున్నారా..? అయితే మీరు డేంజ‌ర్‌లో ప‌డ్డ‌ట్టే..?

Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…

3 days ago

AP Rajya Sabha : ఏపీ రాజ్యసభ రేసులో కొత్త ట్విస్ట్.. టీడీపీ-జనసేన అభ్యర్థులపై కీలక నిర్ణయం!

AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…

4 days ago

Anushka Shetty : ఫస్ట్ లవ్‌పై మనసు విప్పిన అనుష్క.. అత‌ని గురించి చెప్పిన మాటలు వైరల్

Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…

4 days ago

Vijay and Trisha Marriage : ఫ్యామిలీ గ్రీన్ సిగ్నల్.. విజయ్-త్రిష పెళ్లి గాసిప్స్‌కు ఫుల్ స్టాప్ పడిందా..?

Vijay and Trisha Marriage  : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…

4 days ago

Hair : జుట్టు పెరగడం లేదా..? రోజూ ఈ జ్యూసులు తాగితే అద్భుత ఫలితాలు!

Hair  : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…

4 days ago

Rice Water : హెయిర్ గ్రోత్‌కు బియ్యం నీటితో అద్భుత ప్రయోజనాలు.. మీరు ట్రై చేండి..!

Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…

4 days ago