
Business Idea : చదివింది 10వ తరగతి... సంపాదన లక్షల్లో... అది ఎలా సాధ్యం అంటే...!
Business Idea : ఒక వ్యక్తి పదో తరగతి పూర్తి చేసి నెలకు 50 వేల రూపాయలు పైగా సంపాదిస్తున్నారు అంటే నమ్ముతారా..? . ఎలా అని అనుకుంటున్నారా అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అదిలాబాద్ కు చెందిన మునీర్ హుస్సేన్ మునీర్ దంపతుల ఒకే ఒక్క సంతానం మహమ్మద్ సోయాబ్. పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్న సమయంలో తోటి విద్యార్థులతో కలిసి ఆడుకుంటుండగా ఉయ్యాల పైనుండి కింద పడడంతో సొయాబ్ వెన్నుముకకు బలమైన గాయమైనది. అయితే మొదట మామూలు దెబ్బనే కదా అని తల్లిదండ్రులు దానిని పట్టించుకోలేదు. యధావిధిగా తనదైన కార్యక్రమాలను కానీంచారు. అయితే మూడు సంవత్సరాల తర్వాత ఆ గాయం మళ్ళీ తీవ్రమైనది. నొప్పితో లేచి నడవలేని పరిస్థితి వచ్చింది. ఇక దీంతో కంగారు పడ్డ కుటుంబ సభ్యులు సోయాబ్ వైద్యం కోసం హైదరాబాద్ నాగపూర్ తీసుకువెళ్లి చూపించారు. హాస్పటల్ లో ని వైద్యులు చికిత్స చేసినప్పటికి ఫలితం లేకుండా పోయింది.
నడుము నుండి కింద భాగం మొత్తం చచ్చు పడిపోయింది. దీనితో సోయాబ్ నడవలేని పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో తాను మంచానికే పరిమితం అయిపోయాడు. అటువంటి పరిస్థితి వచ్చిన ఏమాత్రం కుంగి పోకుండా తాను ఏంటో నేర్పించుకోవాలని గట్టిగా సంకల్పించారు సొయాబ్ . తనలో లోపం ఉన్న కుమిలిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోయారు. ఇక ఇప్పుడు వ్యాపార రంగంలో పెద్ద ఏతున్న రాణిస్తున్న యువకుడు అతడు. కుటుంబ సభ్యులు మరియు మిత్రుల తోడ్పాటుతో మూడు చక్రాల బండి పై తన కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు మహమ్మద్ సోయాబ్. ఇది ఇలా ఉంటే తన పట్టుదలతో ప్రైవేట్ గా పదవ తరగతి పరీక్ష రాసి పాస్ అయ్యారు. దాని తర్వాత ఇంటర్నెట్ లో వ్యాపార లావాదేవిలపై అవగాహన పెంచుకున్నారు. తన మూడు చక్రాల బండి తో అదిలాబాద్ చుట్టుపక్కల గ్రామాలలో తిరుగుతూ దుస్తుల వ్యాపారం చేయసాగాడు.
అయితే మధ్యలో కరోన కారణంగా ఆ వ్యాపారం మూత పడిపోయింది. అయిన కూడా పట్టు విడువని ఛత్రపత్తిలా స్నేహితుల సలహాతో కాసి మండలం హస్నాపూర్ గ్రామం వద్ద ఉన్న కోళ్ల ఫారం ను లీజుకు తీసుకొని నాలుగు లక్షల పెట్టుబడితో కోళ్ల వ్యాపారం ప్రారంభించారు. అయితే వ్యాపారం మొదట కొంత ఇబ్బంది వచ్చిందట . అయినా సరే దానిని ఎదుర్కొని వ్యాపారం నడిచేలా చేశాడు. ఖర్చులు పోను నెలకు కనీసం 50 వేల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇక తన వ్యాపారంలో తన ఉపాధితో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నారు మహమ్మద్ సోయాబ్. అలాంటి సొయాబ్ పట్టుదల ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోతున్న చాలామంది ఆదర్శం అని చెప్పాలి.
H1B Visa : అమెరికాలో విదేశీ నిపుణుల నియామకాలకు సంబంధించిన H1B వీసా విధానం మరోసారి చర్చనీయాంశంగా మారింది. విదేశీ…
Boduppal : బోడుప్పల్ సర్కిల్ సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని మాజీ మేయర్ తోటకూర అజయ్…
Meenakshi Natarajan : తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.…
Gundlapochampally : మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలోని గుండ్లపోచంపల్లి, మైసమ్మగూడ పరిసర ప్రాంతాల్లో ఎస్సీ కార్పొరేషన్కు కేటాయించిన భూములు ఆక్రమణలకు గురయ్యాయన్న ఆరోపణల…
Weather Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. గత కొన్ని వారాలుగా తీవ్ర ఎండలతో…
FIFA 2026 : ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది అభిమానులు కలిగిన క్రీడల్లో ఫుట్బాల్ అగ్రస్థానంలో ఉంటుంది. భారత్లో క్రికెట్కు ఉన్న…
Father Pension Money : హైదరాబాద్లో సంచలనం సృష్టించిన పెన్షన్ హత్య కేసులో మల్కాజిగిరి కోర్టు కీలక తీర్పు వెలువరించింది.…
29 Movie Review : ఓటీటీ వేదికల్లో ఇటీవలి కాలంలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సినిమాల్లో ‘29’ ఒకటి. తమిళంలో విడుదలైన…
Telangana Womens : తెలంగాణలో మహిళల ఆర్థిక సాధికారతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న…
Pension : ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజంగా అర్హులైన వారికి చేరితే వారి జీవితాల్లో ఎంతో మార్పు తీసుకురాగలవు. ముఖ్యంగా…
Vizag Steel Plant Blast : విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.…
Indian Railways Jobs 2026 : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం మరో…
This website uses cookies.