Today Gold Price : గుడ్న్యూస్.. మళ్లీ దిగొచ్చిన బంగారం.. తులం ఎంత తగ్గిందంటే..?
Today Gold Price : దేశీయ మార్కెట్లలో ఈరోజు మే 5, 2025 న బంగారం ధర Gold rate కాస్త పెరిగింది. ఆదివారం 10 గ్రాముల పసిడి ధర రూ.96,500గా ఉండగా, సోమవారం నాటికి రూ.60 పెరిగి రూ.96,560కు చేరుకుంది. ఇది వడ్డీల పెరుగుదల, అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం వల్ల వచ్చిన మార్పుగా భావించవచ్చు. అదే సమయంలో వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. ఆదివారం కిలో వెండి ధర రూ.95,996గా ఉండగా, సోమవారం నాటికి రూ.96 తగ్గి రూ.95,900కు పడిపోయింది.
Today Gold Price : గుడ్న్యూస్.. మళ్లీ దిగొచ్చిన బంగారం.. తులం ఎంత తగ్గిందంటే..?
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్య నగరాల్లో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరులో 10 గ్రాముల బంగారం ధర రూ.96,560గా ఉంది. అలాగే ఈ నగరాల్లో కిలో వెండి ధర రూ.95,900గా నమోదైంది. ఇవి ఉదయం మార్కెట్ ప్రారంభ సమయంలో ఉన్న ధరలు మాత్రమే కావడంతో, రోజు కొనసాగుతున్న సమయంలో రేట్లు మారే అవకాశం ఉంది. కాబట్టి వినియోగదారులు కొనుగోలు చేసే ముందు తాజా రేటును తెలుసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
అంతర్జాతీయంగా కూడా గోల్డ్ ధరల పెరుగుదల కనిపిస్తోంది. స్పాట్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర ఆదివారం నాటికి 3,228 డాలర్లుగా ఉండగా, సోమవారం నాటికి ఇది 13 డాలర్లు పెరిగి 3,241 డాలర్లకు చేరుకుంది. మరోవైపు, స్పాట్ సిల్వర్ ధర 32.15 డాలర్లుగా ఉంది. గ్లోబల్ మార్కెట్లో ధనవ్యవస్థ, డాలర్ విలువ మార్పులు, అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం ఈ ధరలపై కనిపిస్తోంది. దీని ప్రభావం భారతదేశ మార్కెట్లపై కూడా స్పష్టంగా పడుతోంది.
