Organic Farming : కరోనా సమయంలో చాలామంది ఉపాధి కోల్పోయారు. కొందరు తమ సొంత ఊళ్లకు వెళ్లి వ్యవసాయం చేస్తూ జీవనాన్ని గడుపుతున్నారు. ఇలాగే పూణేకి చెందిన ఇద్దరు అన్నదమ్ములు కరోనా సమయంలో ఉపాధి కోల్పోయారు. ఇప్పుడు వ్యవసాయం చేస్తూ నెలకు కోట్లు ఆర్జిస్తున్నారు. సత్యజిత్ హోంగే, అజిక్యా హోంగే అనే ఇద్దరు అన్నదమ్ములు టు బ్రదర్స్ ఆర్గానిక్ పేరుతో ఓ సంస్థను స్థాపించారు. ఆ సంస్థ ఇప్పుడు సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది. తమ్ముడు అజిక్యా హోంగే కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ పొందాడు. పూణేలో ని ఇందిరా కాలేజీలో ఎంబీఏ చేశాడు. బ్యాంకింగ్ రంగంలో సుమారు నాలుగు సంవత్సరాలు పనిచేశాడు. అన్నయ్య సత్యజిత్ ఎంబీఏ పూర్తి చేసి కొన్నేళ్లు బ్యాంకింగ్ లోనే పనిచేశారు.
ప్రస్తుతం ఈ ఇద్దరు అన్నదమ్ములు తమ పొలంలో ఆర్గానిక్ వ్యవసాయం చేస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నారు. టు బ్రదర్స్ ఆర్గానిక్ సంస్థ సహజ పద్ధతుల ద్వారా సాంప్రదాయ భారతీయ ఆహార పంటలను పండిస్తుంది ప్రస్తుతం లడ్డూలు నెయ్యి పీనట్ బట్టర్ గ్రౌండ్ ఆయిల్ వంటి సహా అనేక రకాల సేంద్రియ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. వ్యవసాయంలో భిన్నమైన ఆలోచనలు అలవాటు చేసుకుని విజయం సాధించవచ్చు అనడానికి ఈ సోదరులు ఇద్దరు చక్కటి ఉదాహరణ. కరోనా సమయంలో ఉపాధి కోల్పోయి ఇప్పుడు అక్షరాలు నెలకు కోటి రూపాయలు సంపాదిస్తున్నారు. పూణేలోని హోదాని గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు బ్యాంకులో ఉద్యోగాలను వదిలి తమ సొంత ఊరిలో ఉన్న పొలంలో వ్యవసాయం చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు.
సంప్రదాయ పద్ధతిలో కేవలం సహజ వనరులను ఉపయోగించి వ్యవసాయం చేయడానికి సేంద్రియ వ్యవసాయం అంటారు. ఈ సేంద్రియ వ్యవసాయంలో ఎలాంటి రసాయనిక ఎరువులు , పురుగుల మందులు, కలుపు మందులు వాడకూడదు. రసాయన ఎరువులు వాడటం వలన అధిక రాబడి వచ్చిన భవిష్యత్తులో ఎన్నో సమస్యలు వస్తాయి. ఇప్పటికే గాలి, నీరు, తినే తిండి కలుషితం అయి అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నాం. భూసారాన్ని పెంచే వానపాములు అంతరించిపోయే స్టేజిలో ఉన్నాయి. తేనెటీగలు కూడా పెద్ద మొత్తంలో చనిపోతున్నాయని గణాంకాలు ఉన్నాయి. అయితే ఇటువంటి పరిస్థితుల్లో కొందరు రైతులు ప్రజలకు మేలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. పూర్తిగా సేంద్రియ వ్యవసాయం చేస్తూ తక్కువ ధరలకే అమ్ముతున్నారు. ఆర్గానిక్ వ్యవసాయంలో దిగుబడులు తక్కువ వచ్చిన ఆరోగ్యకరమైన ఆహారం లభిస్తుంది.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.