చిత్తూరులో ఫ్యాన్ ప్రభంజనం..టీడీపీ చిత్తు చిత్తు

Authored By praveen T | The Telugu News | Updated on : 20 September 2021, 2:16 pm

ఉమ్మడి ఏపీలో ఒకనాడు అధికారంలో ఉన్న టీడీపీ ప్రజెంట్ విభజిత ఏపీలో ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. కాగా, రోజురోజుకూ పార్టీ ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైపోతున్నది. తాజాగా ఏపీలో జరిగిన పరిషత్ ఎన్నికల్లో వైసీపీ హవా చూపింది. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులోని కుప్పం నియోజకవర్గంలోనూ ఫ్యాన్ ప్రభంజనం సృష్టించింది. టీడీపీ పరాజయాన్ని మూటకట్టుకుంది. కుప్పం నియోజకవర్గంలోని 89 పంచాయతీలకు‌గాను 74 చోట్ల వైసీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు.

ఇకపోతే కేవలం 14 చోట్ల మాత్రమే తెలుగుదేశం పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలిచారు. ఇక ఒకే ఒక చోట కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారు విక్టరీ సాధించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ టీడీపీ తుడిచి పెట్టుకుపోయింది. గుడుపల్లె, శాంతిపురం, రామకుప్పం, కుప్పం జెడ్పీటీసీ స్థానాలను వైసీపీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుచుకున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో టీడీపీ పార్టీ కనిపించే పరిస్థితులు ఉండవని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

 

Advertisement

praveen T

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి