Ashada Masam Pooja : ఆషాడ మాసంలో ఏ అమ్మవారిని పూజించాలి.. ఎలాంటి దానాలు చేయాలో తెలుసా..?
Ashada Masam Pooja : ఆషాడ మాసంలో శుభకార్యాలను నివారించడం జరిగింది. కానీ గ్రామదేవతలైన అమ్మవార్లకి ఇంకా శక్తి స్వరూపుణిలైన లేదా ఉగ్రదేవతలైన, దుర్గాదేవి,కాళికామ్మ, కాలభైరవులను పూజిస్తే, జాతక దోషాల నుండి విముక్తిని పొందవచ్చు .పండితులు తెలియజేస్తున్నారు. ఆషాడ మాసంలో ఈ అమ్మవారిలకి పూజ చేస్తే,ఆరోగ్య ప్రాప్తి పొందవచ్చు. ఇంకా, దేని చేతనైనా పీడితులైతే దాని నుంచి విముక్తి కలుగుతుందని నమ్మకం. ఈ మాసంలో ఎలా పూజ చేస్తే అదృష్టం కలిసి వస్తుంది.దీని గురించి పండితులు ఏం చెబుతున్నారు తెలుసుకుదాం…
Ashada Masam Pooja : ఆషాడ మాసంలో ఏ అమ్మవారిని పూజించాలి.. ఎలాంటి దానాలు చేయాలో తెలుసా..?
ఆషాడ మాసం అనేది హిందూ క్యాలెండర్లలో ఒక ముఖ్యమైన మాంసం. ఈ మాసం సాధారణంగా శుభకార్యాలకు అనుకూలం కాదని నమ్ముతారు. అయితే,ఈ కాలంలో కొన్ని ప్రత్యేకమైన పూజలు, దానాలు చేస్తే చాలా అదృష్టం తో పాటు ఆరోగ్యం,శుభాలు కూడా కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఇంకా భక్తుల నమ్మకం కూడా.
ఉగ్రదేవతలైన దుర్గాదేవి, కాళికమ్మ, మహిషాసుర మర్దిని, కాలభైరవులను ఆషాడ మాసంలో పూజిస్తే,చాలా శుభప్రదం పండితులు పేర్కొంటున్నారు. ఈ దేవతల పూజ జాతకంలోని పాప గ్రహ దోషాలను తొలగించి, గ్రహాల అనుగ్రహాన్ని పొందెందుకు సహకరిస్తుంది.
ఆషాడ మాసంలో దుర్గాదేవి ఆలయంలో, మంగళవారాలు, శుక్రవారాలలో,రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించడం వల్ల,కుటుంబ సభ్యులు ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.దుర్గాదేవికి కుంకుమార్చన చేయడం కోసం కాళికా అమ్మకు నిమ్మకాయల దండ సమర్పించాలి. శత్రు బాధలు, నరదిష్టి నుండి రక్షణ లభిస్తుంది. కాలభైరవుని దర్శించుకోవడం, అభిషేకం చేయించుకోవడం, దీపం వెలిగించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని వివరించారు.
ఆషాడ మాసంలో ఇలాంటి దానాలు చేస్తే అమ్మవార్ల అనుగ్రహం కలుగుతుంది. గొడుగు, పాదరక్షలు, ఉసిరికాయ దానం చేస్తే జాతక దోషాల తీవ్రత తగ్గుతుంది.ఏ దానం చేయకపోయినా, ఉప్పు దానం కూడా శుభప్రదం అని తెలిపారు. విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాలలో సమర్జన చేయడం, సేవ చేయడం, చెట్లను నాటడం, చెట్లకు నీరు పోయడం వంటివి విశేష ఫలితాలను ఇస్తాయి.
గ్రామదేవతలకు పసుపు కలిపిన నీటితో అభిషేకం చేయాలి.పసుపు బోట్లు అలంకరించాలి. నిమ్మకాయల దండలు సమర్పించాలి. పెరుగన్న నైవేద్యాన్ని సమర్పించాలి. ఆరోగ్యం కలిగే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. అంతే కాదు,వరాహి అమ్మవారికి పూజలు చేయడం, వరాహి కంద దీపం వెలిగించడం కూడా అద్భుతమైన ఫలితాలను అందజేస్తుంది.సంక్షిప్తంగా, ఆషాడమాసంలో ఈ పూజలు దానాలు చేస్తే సకల శుభాలు కలుగుతాయని చెబుతున్నారు పండితులు.
Parameshwar Reddy : నాచారం మహంకాళి దేవాలయం అభివృద్ధికి నూతనంగా ఎన్నికైన ఛైర్మెన్ ధర్మ కర్తలు బాధ్యతతో కృషి చేయాలని…
Parameshwar Reddy : ఈరోజు గురుపౌర్ణమి guru purnima సందర్భంగా సీనియర్ Congress కాంగ్రెస్ నాయకులు పడమటి మల్లారెడ్డి ఆధ్వర్యంలో శ్రీ…
Mohan Babu : టాలీవుడ్లో విలక్షణ నటుడిగా, విలన్గా, కమెడియన్గా, హీరోగా ఎన్నో మైలురాయిలను చేరుకున్న కలెక్షన్ కింగ్ మోహన్…
Husband Wife : దంపతులు అంటే సమాజానికి ఆదర్శంగా ఉండాలి. ప్రేమ, బాధ్యత కలగలిపిన బంధంగా ఉండాలి. కానీ విశాఖపట్నం…
Shubman Gill : india vs England లార్డ్స్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న Test Match మూడో…
Nirmala Sitharaman : సోషల్ మీడియాలో Social Media ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరుతో ఒక…
Vemireddy Prashanti Reddy : కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి Vemireddy Prashanti Reddy మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా…
Samantha : తొలుత మోడల్గా వచ్చిన శోభిత ధూళిపాళ్ల sobhita dhulipala ఆ తర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ‘రామన్…
This website uses cookies.