
Ashada Masam Pooja : ఆషాడ మాసంలో ఏ అమ్మవారిని పూజించాలి.. ఎలాంటి దానాలు చేయాలో తెలుసా..?
Ashada Masam Pooja : ఆషాడ మాసంలో శుభకార్యాలను నివారించడం జరిగింది. కానీ గ్రామదేవతలైన అమ్మవార్లకి ఇంకా శక్తి స్వరూపుణిలైన లేదా ఉగ్రదేవతలైన, దుర్గాదేవి,కాళికామ్మ, కాలభైరవులను పూజిస్తే, జాతక దోషాల నుండి విముక్తిని పొందవచ్చు .పండితులు తెలియజేస్తున్నారు. ఆషాడ మాసంలో ఈ అమ్మవారిలకి పూజ చేస్తే,ఆరోగ్య ప్రాప్తి పొందవచ్చు. ఇంకా, దేని చేతనైనా పీడితులైతే దాని నుంచి విముక్తి కలుగుతుందని నమ్మకం. ఈ మాసంలో ఎలా పూజ చేస్తే అదృష్టం కలిసి వస్తుంది.దీని గురించి పండితులు ఏం చెబుతున్నారు తెలుసుకుదాం…
Ashada Masam Pooja : ఆషాడ మాసంలో ఏ అమ్మవారిని పూజించాలి.. ఎలాంటి దానాలు చేయాలో తెలుసా..?
ఆషాడ మాసం అనేది హిందూ క్యాలెండర్లలో ఒక ముఖ్యమైన మాంసం. ఈ మాసం సాధారణంగా శుభకార్యాలకు అనుకూలం కాదని నమ్ముతారు. అయితే,ఈ కాలంలో కొన్ని ప్రత్యేకమైన పూజలు, దానాలు చేస్తే చాలా అదృష్టం తో పాటు ఆరోగ్యం,శుభాలు కూడా కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఇంకా భక్తుల నమ్మకం కూడా.
ఉగ్రదేవతలైన దుర్గాదేవి, కాళికమ్మ, మహిషాసుర మర్దిని, కాలభైరవులను ఆషాడ మాసంలో పూజిస్తే,చాలా శుభప్రదం పండితులు పేర్కొంటున్నారు. ఈ దేవతల పూజ జాతకంలోని పాప గ్రహ దోషాలను తొలగించి, గ్రహాల అనుగ్రహాన్ని పొందెందుకు సహకరిస్తుంది.
ఆషాడ మాసంలో దుర్గాదేవి ఆలయంలో, మంగళవారాలు, శుక్రవారాలలో,రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించడం వల్ల,కుటుంబ సభ్యులు ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.దుర్గాదేవికి కుంకుమార్చన చేయడం కోసం కాళికా అమ్మకు నిమ్మకాయల దండ సమర్పించాలి. శత్రు బాధలు, నరదిష్టి నుండి రక్షణ లభిస్తుంది. కాలభైరవుని దర్శించుకోవడం, అభిషేకం చేయించుకోవడం, దీపం వెలిగించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని వివరించారు.
ఆషాడ మాసంలో ఇలాంటి దానాలు చేస్తే అమ్మవార్ల అనుగ్రహం కలుగుతుంది. గొడుగు, పాదరక్షలు, ఉసిరికాయ దానం చేస్తే జాతక దోషాల తీవ్రత తగ్గుతుంది.ఏ దానం చేయకపోయినా, ఉప్పు దానం కూడా శుభప్రదం అని తెలిపారు. విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాలలో సమర్జన చేయడం, సేవ చేయడం, చెట్లను నాటడం, చెట్లకు నీరు పోయడం వంటివి విశేష ఫలితాలను ఇస్తాయి.
గ్రామదేవతలకు పసుపు కలిపిన నీటితో అభిషేకం చేయాలి.పసుపు బోట్లు అలంకరించాలి. నిమ్మకాయల దండలు సమర్పించాలి. పెరుగన్న నైవేద్యాన్ని సమర్పించాలి. ఆరోగ్యం కలిగే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. అంతే కాదు,వరాహి అమ్మవారికి పూజలు చేయడం, వరాహి కంద దీపం వెలిగించడం కూడా అద్భుతమైన ఫలితాలను అందజేస్తుంది.సంక్షిప్తంగా, ఆషాడమాసంలో ఈ పూజలు దానాలు చేస్తే సకల శుభాలు కలుగుతాయని చెబుతున్నారు పండితులు.
Arava Sridhar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన Janasena MLA ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై…
Credit Card : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు అనేది ఒక ఆర్థిక అవసరంగా మారింది. సరైన పద్ధతిలో…
RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…
Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…
WhatsApp : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…
Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…
Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…
Samantha : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…
This website uses cookies.