
Bhishma Ekadasi Visistatha Dharma Sandehalu Special
Bhishma Ekadasi : విష్ణుసహస్రనామాలు.. తెలియని భక్తులు ఉండరు. దాదాపు అందరూ రోజు వింటూ ఉండే నామాలు. పవిత్రమైన ఈ నామాలను చాలా విశేషంగా భక్తులు పారాయణం చేస్తుంటారు. ఈ పవిత్రమైన నామాలను సేకరించి ఒక్కచోట పద్ధతి ప్రకారం చెప్పిన వారు భీష్మపితామహుడు. ఆయన అందించిన ఈనామాలను వ్యాసుడు మహాభారతంలో మనకు అందించాడు. ఈ నామాలు ఉద్భవించిన రోజే మాఘశుద్ధ ఏకాదశి. ఈరోజునే భీష్మ ఏకాదశిగా పిలుస్తారు. ఆ విశేషాలు తెలుసుకుందాం.. ఆజన్మ బ్రహ్మచారిగా విశేషమైన, విశిష్టమైన లక్షణాలతో నాటి, నేటి తరానికి ఒక ప్రతీకగా నిలచిన మహాధీశాలి, ప్రజ్ఞావంతుడు, అష్టవసువుల్లో ఒకరు అయిన భీష్ముడు. ఆయన మహాభారతానికి పునాదిగా కూడా చెప్పుకోవచ్చు. ఆయన పేరుమీద ఏర్పడిన భీష్మ ఏకాదశి. ఆ విశేషాలు తెలుసుకుందాం… మాఘ శుక్ల ఏకాదశినే భీష్మ ఏకాదశి అంటాం. ఈ ఏకాదశికి విశేష ప్రాధాన్యం రావడానికి ప్రధాన కారణం
ఈ రోజునే విష్ణు సహస్ర నామం ఉద్భవించింది. విచిత్ర మైన ఘట్టం. ఒళ్ళంతా బాణాలు దిగి అంప శయ్య మీద ఉన్న అతి పుణ్యాత్ముడు అయిన భీష్మ పితామహుడు. యుద్ధం ముగిసిన తర్వాత శ్రీకృష్ణుడి సూచన మేరకు పాండవులు అందరూ అపంశయ్య మీద ఉన్న భీష్మడు దగ్గరకు వస్తారు. ఆ సమయంలో ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా విష్ణు సహస్రనామాలను భీష్ముడు చెప్పాడు. భీష్ముడు ఇచ్చా మరణ వరం కలవాడు. అంటే అనుకున్నపుడే మరణించ గలడు. ఉత్తరాయణ పుణ్య కాలం కోసం ఎదురు చూస్తూ 50 రోజులు వంటిలో దిగిన బాణాలతో అంప శయ్య మీద వేచి వున్నాడు.
Bhishma Ekadasi Visistatha Dharma Sandehalu Special
చివరికి మాఘశుద్ధ ఏకాదశి నాడు పవిత్ర మైన విష్ణు సహస్ర నామములను ఉపదేశించాడు ధర్మరాజుకు. భగవంతుడైన శ్రీ కృష్ణుడు చిరు నవ్వు తో విని ఆమోదించాడు. ఇట్టి మహత్తర ఘట్టం ఎక్కడా లేదు. భగవంతుని దివ్య నామములను స్వయానా భగవంతుడే విని దీవించిన అపూర్వ ఘట్టం. కిమేకం దైవతం లోకే? కిం వాప్యేకం పారాయణం? స్తువంత కం కమర్చంత ప్రాప్నుయుర్మానవా శుభం? కో ధర్మ సర్వ ధర్మానాం భవత పరమో మతః. కిం జపన్ ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్.?
అర్థం: లోకంలో ఎవరు దైవము? ఎవరిని పూజించి, స్తుతించి అర్చించాలి. దేనివల్ల మానవులకు శుభం కలుగుతుంది. అన్ని ధర్మములలోకి ఉత్తమ ధర్మమేది. దేనిని జపించుట వలన మనిషి సంసార బంధముల నుండి విముక్తి పొందుతాడు? అని. అడుగగా దానికి భీష్మ పితామహుడు , జగత్ ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం అని చెబుతూ, ‘‘ అనాది నిధనం విష్ణుం సర్వ లోక మహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వ దుఖాతిగో భవేత్.
ఆది అంతము లేని, సర్వ వ్యాపి అయిన, దేవ దేవుడైన , భగవంతుడైన విష్ణు స్తుతి వల్ల సర్వ దుఃఖములు తోలగుతవి- అని ఇంకా చెబుతూ ఎషమే సర్వ ధర్మానాం ధర్మోధిక తమో మతః- ఇదియే అన్ని ధర్మములలోకి ఉత్తమ ధర్మమని నా మాట అంటాడు. ముఖ్యం గా విష్ణు సహస్ర నామ జపం, ధ్యానం వల్ల భయం తొలగుతుంది, శుభం కలుగుతుంది.
Sugarcane Juice : వేసవి కాలం ప్రారంభం కావడంతో ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. మండే ఎండలతో ప్రజలు తీవ్ర అసౌకర్యాన్ని…
Gas Shortage : పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో దేశంలో వంటగ్యాస్ కొరత ఏర్పడుతుందనే వార్తలు ప్రజల్లో ఆందోళన…
SBI Fellowship : డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మంచి అవకాశాల కోసం చూస్తున్న యువతకు దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ…
LPG Gas : ఇరాన్ ప్రాంతంలో జరుగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.…
Blower Electric Chulha : ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వీడియో తెగ వైరల్ అవుతోంది. మొదట చూసినవారికి…
Railway Jobs : దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు మరో మంచి అవకాశం వచ్చింది. దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం…
Ration Cards : దేశవ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రేషన్ సేవలను మరింత…
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కేటీఆర్ చుట్టూ జరుగుతున్న పరిణామాలు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా ఫిరాయింపు ఎమ్మెల్యేల…
Gold and Silver Price 14 March 2026 : బంగారం కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి, పసిడి ప్రియులకు…
Karthika Deepam 2 March 14th 2026 Today Episode : స్టార్ మా ఛానెల్లో ప్రసారమవుతున్న 'కార్తీక దీపం…
Healthy Drinks : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రతరం అవుతున్నాయి. ఈ సమయంలో శరీరానికి చల్లదనం ఇచ్చే పానీయాల కోసం…
Black Coffee Benefits : ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది తమ రోజును ఒక కప్పు కాఫీతో ప్రారంభిస్తారు. ముఖ్యంగా పాలు,…
This website uses cookies.