Home » Devotional » Divontional Remidi Of Appulaa Badalu
Devotional

పసుపు బియ్యంతో ఇలా చేస్తే ఎంత అప్పు ఉన్నా సరే కొన్ని రోజులో మీ అప్పు తీరిపోతుంది…!

Authored By
aruna
The Telugu News | Updated on: November 3, 2023 10:41 pm
Advertisement

జీవితంలో ప్రతి ఒక్కరికి ఆర్థిక సమస్యలు ఉంటాయి.. అందుకోసం చాలామంది చేతిలో డబ్బులు లేక అప్పులు చేస్తుంటారు.. అవసరానికి అప్పులు చేసి వాటిని కట్టలేక నానా తంటాలు పడుతూ ఉంటారు.. ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. ఆ అప్పుల బాధ నుంచి తప్పించుకునేందుకు ఎంతో ప్రయత్నిస్తుంటారు. కొందరు తీర్చి బయటపడితే మరికొందరు పారిపోయి బయటపడుతుంటారు. మనిషిని ఎంతో మానసిక సంఘర్షణలకు గురిచేసి అప్పుల బాధలు తప్పించుకునేందుకు కొన్ని చిన్న చిన్న పనులు చేస్తే సరిపోతుంది. ఆ పని చేస్తే చాలు జీవితంలో అప్పుల బాధ ఉండదు. వాటిలో ఒకటి మంగళవారం సెంటిమెంట్ చాలా మంది మంగళవారాన్ని చాలా సెంటిమెంటల్ గా ఫీల్ అవుతుంటారు. ఆ రోజున ఎవరికి డబ్బులు ఇవ్వరు. ఏదైనా ఊరికి వెళ్లాలనుకున్నా వెళ్ళనివ్వరు.

Advertisement

ఏ పని మొదలుపెట్టరు.. మంగళవారం అయితే జుట్టు కటింగ్ కూడా చేసుకోరు.. మంగళవారం ఏ మొదలు పెడతాంలే అన్నట్లుగా లైట్ తీసుకుంటారు.. మంగళవారానికి అధిపతి కుజుడు కి రక్తం ఆధిపత్యం ఉంటుంది అంటే రక్తంతో చేసే పనులు ఏమైనా ఉంటే వాటికి మంగళవారం మంగళవారం అంటే మనకు ఇంట్లో ఆరోగ్య సమస్యల వల్ల కొందరికి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. అలాంటి ఆపరేషన్ జరిపించేందుకు మంగళవారం చాలా మంచిది. కొన్ని ప్రాంతాల వారు అప్పులు తీర్చడానికి మంగళవారంతో మొదలు పెడుతుంటారు. అలా చేస్తే అప్పు త్వరగా తీరిపోతుందని వారు నమ్మకం.అప్పులు తీరాలంటే మన ఇంట్లో తప్పనిసరిగా ఒక రాగి పాత్రను ఉంచుకోవాలి. ఆ రాగి పాత్రలో కొంచెం బియ్యం, పసుపుతో ఇలా పరిష్కారం చేయాల్సి ఉంటుంది.

ఇంట్లోనే ఆడవారు మంగళవారం కానీ లేదంటే శుక్రవారం కానీ తప్పనిసరిగా మీ ఇంట్లోని పూజ గదిలో ఇలా పాటించి చూడండి.. పరిహారంలో భాగంగా మొదట రాగి ప్లేటు లేదంటే తీసుకొని అందులో బియ్యా న్ని పోయాలి. ఆ బియ్యం మీద రెండు తమలపాకులు పెట్టి దానిపై లక్ష్మీదేవి ప్రతిమ నుంచి పసుపు కుంకుమతో పూజించాలి. ఈ విధంగా మనం పసుపు కుంకులతో పూజిస్తున్నప్పుడు లక్ష్మీ అష్టోత్తరం లేదంటే సహస్రనామాలు గానీ జపిస్తూ అమ్మ వారిని పూజించాలి. ఆ తర్వాత రోజు బుధవారం కానీ శనివారం గాని అంటే మనం ఆ పూజ చేస్తామో ఆ పూజ తర్వాత రోజు ఈ బియ్యాన్ని తీసుకొని వెళ్ళాలి. వాటితో ఏదైనా తీపి పదార్థం చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. ఆ తర్వాత ప్రసాదంగా స్వీకరించాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ చిన్న పరిహారాన్ని చేస్తారో వారికి ఉన్న ఆర్థిక సమస్యలను తీరిపోతాయి.

Advertisement

పూజ అనంతరం అమ్మవారి అర్చిన కోసం ఉపయోగించిన పసుపు కుంకుమ చాలా పవిత్రంగా భావించాలి. పసుపు నేము ఆడవారు వారి మంగళ సూత్రానికి ప్రతి బుధవారం గాని శుక్రవారం గాని రాసుకోవాలి. ఇక కుంకుమ వారి నుదుట పెట్టుకోవాలి. ఈ విధంగా ఎవరితో చేస్తారో వారి ఇంట్లో ఉన్న బాధలు, అప్పులన్నీ తీరిపోతాయి.. వారికి లక్ష్మీదేవి సిద్ధిస్తుంది. అంతేకాదు సరికొత్త జీవనాన్ని పొందుతారు. కాబట్టి ఒక్కసారి పరిహారం చేసి చూస్తే మీకే అర్థమవుతుంది..

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి