Horoscope : జాతకంలో మంగళ దోషం ఉంటే ఇలా చేయండి… గురు బలం పెరిగి అదృష్టం పడుతుంది…!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 20 September 2024, 10:00 am
  •  Horoscope : జాతకంలో మంగళ దోషం ఉంటే ఇలా చేయండి... గురు బలం పెరిగి అదృష్టం పడుతుంది...!

Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి అయిన బృహస్పతికి మరియు విష్ణుకి అంకితం చేయబడింది. అయితే బృహస్పతి లేదా గురుడు సౌర వ్యవస్థలో ప్రధాన స్థానంలో ఉన్నాడు. అదేవిధంగా సూర్యుని తర్వాత స్థిరంగా ఉండే గురువుని విశ్వ గురువు అని కూడా పిలుస్తారు. అయితే గురువారం పూజ చేసే భక్తులకు మంచి ఆరోగ్యం ,విజయం,మరియు సంపద మంచి భాగస్వామి లభిస్తుందని నమ్మకం. హిందూ సాంప్రదాయాలలో చెట్లకు ప్రధాన స్థానం ఉంటుంది. అందులో అరటి చెట్టు ఒకటి. దీనిలో అరటి పండ్లను మరియు ఆకులను కూడా ఉపయోగిస్తారు. అయితే ఈ అరటి చెట్టును పూజిస్తే మంచి ప్రయోజనాలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. మరి అది ఎలానో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

చెట్టు లేనిది మనిషికి జీవితం అనేదే లేదు. కాబట్టి చెట్లను మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి. దేవుడికి పూలు పండ్లతో పూజిస్తే కుటుంబ క్షేమంగా ఉంటుందని భక్తుల నమ్మకం. పురాణాల ప్రకారం లోక రక్షకుడు అయిన విష్ణువుకి చిహ్నంగా అరటి చెట్టుని పరిగణిస్తారు. అలాగే అరటి చెట్టు అత్యంత పవిత్రమైనదిగా కూడా భావిస్తారు. కొంతమంది గురువులకి దక్షిణగా నగదు బదులుగా అరటి చెట్టుని లేదా అరటి పండ్లను దక్షిణగా ఇవ్వవచ్చు. గృహప్రవేశాలకు వివాహాలకు మరియు ఇతర శుభకార్యాలకు అరటి చెట్లను ఇంటి ప్రవేశానికి ముందు ఇరువైపులా కడతారు. అలాగే అరటి చెట్టు లోని భాగాన్ని ఏదో ఒక సందర్భంలో ఉపయోగిస్తారు. అరటి ఆకులను పవిత్రమైనదిగా భావించి అరటి ఆకులో ఆహారాన్ని అందిస్తారు. నేటి భారతదేశంలో కూడా ఈ సాంప్రదాయం కొనసాగుతుంది.

Horoscope : జాతకంలో మంగళ దోషం ఉంటే ఇలా చేయండి... గురు బలం పెరిగి అదృష్టం పడుతుంది...!

Horoscope : జాతకంలో మంగళ దోషం ఉంటే ఇలా చేయండి… గురు బలం పెరిగి అదృష్టం పడుతుంది…!

అయితే గురువారం నాడు అరటి చెట్టును పూజించడం వలన భగవంతుడి ఆశీర్వాదాలు లభిస్తాయి. అదేవిధంగా గృహంలో శుభశక్తి పెరగడంతో పాటు ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. ఇలా ప్రతివారం చేయడం వలన ఉద్యోగ జీవితంలో మరియు సామాజిక జీవితంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. విష్ణువుకి ప్రతీక అయిన అరటి చెట్టుని ఇంట్లో నాటుకుంటే ఆ ఇంటి గృహస్తుడిని విష్ణు ఎప్పటికీ విడిచిపెట్టడు అని నమ్మకం. దీనివల్ల ఇంట్లోని ప్రతి సభ్యుడు జీవితంలో విజయాన్ని సాధిస్తాడు. అలాగే వేద శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే మంగళ దోషం పోవడానికి అరటి చెట్టుని పూజించడం చాలా మంచిది. ఫలితంగా ప్రమాదాలు తగ్గుతాయి. మరియు వైరాహిక జీవితం మెరుగుపడుతుంది. అలాగే విష్ణువు ,వినాయకుడు ,లక్ష్మీదేవి పూజలలో అరటి ఆకులను సమర్పిస్తే వారు సంతోషించి తమ ఆశీర్వాదాలను అందిస్తారు.

Advertisement

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Tags :
Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి