
Sri Rama Navami : శ్రీరామ నవమి రోజు కళ్యాణం తర్వాత పానకం ఎందుకు ఇస్తారో తెలుసా మీకు..?
Sri Rama Navami : హిందూమతంలో ప్రతి పండగ కి ఓ ప్రత్యేకమైన విశిష్టత ఉంటుంది. అలాగే ఈరోజు జరిగే శ్రీరాముని కళ్యాణం లో కూడా ఓ ప్రత్యేకత ఉంది. శ్రీరాముని కళ్యాణం తర్వాత పులిహోర, పానకం ఎందుకు ఇస్తారో తెలుసా మీకు.. ఆ విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. హిందువులకు శ్రీరామనవమి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఉండదు. శ్రీరామనవమి హిందువులకి ఎంతో ప్రత్యేకమైన పండగ. తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అలాగే భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం ఎంతో ఘనంగా జరుగుతుంది. అయితే మనం ప్రతి పండగకు ఒక విశిష్టమైన ప్రత్యేకమైన ప్రసాదాన్ని దేవుడికి నైవేద్యంగా ఇస్తూ ఉంటాం.
Sri Rama Navami : శ్రీరామ నవమి రోజు కళ్యాణం తర్వాత పానకం ఎందుకు ఇస్తారో తెలుసా మీకు..?
ఉగాదికి షడ్రుచులు తో ఉగాది పచ్చడి. వినాయక చవితికి ఉండ్రాళ్ళు అలాగే రాములోరికి పానకాన్ని నైవేద్యంగా పెడుతూ ఉంటారు. అయితే ఎందుకు పానకమే నైవేద్యంగా పెడతారు అని ఎప్పుడైనా అనుకున్నారా..? దేశవ్యాప్తంగా ఉన్న రామాలయాలలో సీతారాముల కళ్యాణం కన్నుల పండగ జరుపుతారు. ఆ స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకుని భక్తులు పరవశించిపోతారు. అందరూ ఇళ్లల్లో కూడా శ్రీరామనవమిని ఘనంగా జరుపుకుంటారు. ఆ సీతారాములను ఎంతో భక్తి శ్రద్ధలతో తులసి దళాలతో ఆరాధిస్తారు. అయితే ఇంట్లో అయినా గుడిలో అయినా శ్రీరామనవమికి నైవేద్యంగా పులిహార, వడపప్పు, పానకాన్ని సమర్పిస్తారు. అయితే పానకాన్ని ఇవ్వడం వెనక శాస్త్రంలో చాలానే కారణాలు ఉన్నాయని చెప్తున్నారు. వాటిలో ఆరోగ్యానికి సంబంధించిన మర్మము కూడా దాగి ఉంది. అందుకే పానకాన్ని ప్రసాదంగా పంచి పెడుతూ ఉంటారు. ఉగాది అయిపోయిన తర్వాత చలి పూర్తిగా తగ్గిపోతుంది. ఆ తర్వాత నుండి ఎండలు మొదలవుతాయి.
Sri Rama Navami : శ్రీరామ నవమి రోజు కళ్యాణం తర్వాత పానకం ఎందుకు ఇస్తారో తెలుసా మీకు..?
సూర్యుడి తన ప్రతాపాన్ని చూపించడం మొదలుపెడతాడు. అలా ఎండలు మొదలైన తర్వాత శ్రీరామనవమి వస్తుంటుంది. అందుకే దేవాలయ వాళ్ళ దగ్గర తాటాకు పందిరి వేస్తారు. ఎందుకంటే వచ్చిన భక్తులు ఎటువంటి అసౌకర్యం కలగకూడదని అలాగే ప్రసాదంగా ఇచ్చే పానకం కూడా భక్తులకి శక్తిని శరీరంలో ఉన్న వేడిని తొలగించడానికి పానకాన్ని ఇస్తారు. పానకం తయారు చేయడానికి వాడే వస్తువులు చూస్తే తెలుస్తోంది. పానకం కోసం బెల్లం, మంచినీళ్లు, మిరియాలు, యాలకులు, తులసి ఆకులు వాడుతుంటారు. ఈ పానకం మనిషి ఒంట్లో ఉన్న ఉష్ణాన్ని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది. బెల్లం వేడిని తగ్గించడమే కాకుండా దాంట్లో ఉన్న ఐరన్ శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. మిరియాలు గొంతు నొప్పిని కపం ని తగ్గిస్తాయి. దగ్గు రాకుండా ఉండడానికి రక్షిస్తాయి. అలాగే తులసి ఆకులు వేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అవి వైరస్ ద్వారా వచ్చే వ్యాధులను తగ్గిస్తుంది. వేసవి మొదట్లో వచ్చే పండుగ కావున ఆరోగ్యంగా ఉండేందుకు కూడా ఇలా పానకం తాగుతారని పురాణాలు చెబుతున్నాయి. పానకాన్ని ప్రసాదంగా తీసుకోవడం వలన భక్తికి భక్తి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎవరైనా పిల్లల పానకం తాగని మారం చేస్తే దాని వలన వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు అర్థం అయ్యేలా చెప్పి వారిని కూడా తాగేలా చేయండి..
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.