
SravanaMasam : శ్రావణమాసంలో నాన్ వెజ్ ని ఎందుకు తినకూడదో తెలుసా... అసలు సైంటిఫిక్ రీసన్ ఇదేనట...?
SravanaMasam : రమణ మాసం అంటేనే ఆధ్యాత్మిక తో నిండి ఉంటుంది.అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఒక రకమైన వాతావరణం నెలకొంటుంది. అత్యంత పవిత్రంగా భావించే ఈ శ్రావణ మాసంలో శివునికి అంకితం చేయబడింది. ఈ సమయంలో భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో దేవుని ఆరాధిస్తారు.అయితే శివ భక్తులను కొన్ని నియమాలు పాటిస్తుంటారు. వాటిని భక్తిశ్రద్ధలతో పాటిస్తే శివుని అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు. శ్రావణమాసంలో చాలామంది మాంసాహారానికి దూరంగా ఉంటారు. ఈ నెల రోజులు పాటు నాన్ వెజ్ ని అస్సలు తినకూడదని చెబుతుంటారు. ఈ సాంప్రదాయం వెనుక మతపరమైన కారణాలు మాత్రమే కాదు, శాస్త్రీయ కారణాలు అంటే సైంటిఫికల్ రీజన్ కూడా ఉంది.
SravanaMasam : శ్రావణమాసంలో నాన్ వెజ్ ని ఎందుకు తినకూడదో తెలుసా… అసలు సైంటిఫిక్ రీసన్ ఇదేనట…?
వనమాసంలో మాంసాహారాన్ని స్వీకరించకపోవడానికి గల కారణం సైంటిఫిక్ రీసన్ కూడా ఉంది. శ్రావణమాసం వచ్చేసరికి వర్షాకాలం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో సూర్య రష్మి,వెలుతురు ఎక్కువగా ఉండదు. కాబట్టి మన శరీరంలో జీర్ణక్రియ వేగంగా జరగదు ఆయుర్వేదం ప్రకారం వర్షాకాలంలో జీర్ణశక్తి బలహీన పడుతుంది. దీనివల్ల భారీ ఆహారాన్ని జీర్ణం చేసుకోవడం చాలా కష్టంగా అవుతుంది. వేద గ్రంధాలలో వర్షాకాలంలో ఆహారం జీవనశైలికి నియమాల రూపొందించబడ్డాయి. ఆకుకూరలు,కూరగాయలపై కూడా ఆహారంలో ఆంక్షలు విధించబడ్డాయి. ఎందుకంటే వాటిలో పురుగులు ఉండవచ్చు. జీర్ణశక్తి బలహీనపరచడం వల్ల ఏం తిన్నా కూడా అరగడానికి చాలా సమయం పడుతుంది. అందుకే మాంసం వంటి కఠినమైన ఆహారాన్ని తీసుకుంటే ఈ కాలంలో జీర్ణం చేసుకోవడం చాలా కష్టంగా అవుతుంది. శ్రావణమాసంలో శాఖాహారం తింటే మంచిదని చెబుతుంటారు నిపుణులు.
వర్షా కాలంలో నీరు కూడా చాలా కలుషితంగా అవుతుంది. ఈ వాతావరణం లో నీటిలో నివసించే చేపలు లేదా కలుషిత నీటిపై ఆధారపడిన అనేక జంతువులు తెలియకుండానే,వివిధ నీటి ద్వారా సంక్రమించే వ్యాధులకు గురవుతుంటాయి.అలాంటి చేపలు రొయ్యలు వంటి నాన్ వెజ్ ఆహార పదార్థాలు అస్సలు తీసుకోకూడదు. ఈ వాతావరణం లో మాంసం చేపలు త్వరగా కుళ్ళిపోతాయి వీటిలో బ్యాక్టీరియా ఫంగస్ బాగా వృద్ధి చెందుతుంది. కాబట్టి దీనిని ఆహారంగా భుజిస్తే ఫుడ్ పాయిజనింగ్ కడుపు సంబంధిత వ్యాధులు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువే.
మాంసాహారం, చేపలు కఠినమైన ఆహారంగా పరిగణించబడినవి.దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీసన్ ఏమిటంటే ఈ ఆహారాన్ని భుజించడం వల్ల సోమరితనం, బద్ధకం, అహంకారం,కోపం పెరుగుతాయి. ఈ కారణాలన్నీటి వల్ల ప్రజలు ఆధ్యాత్మికతనుండి దూరం అవుతుంటారు. ఇంద్రియాలను నియంత్రించుకోవడానికి ఆహారంపై నియంత్రణ అవసరమని చెప్పబడింది.ఇటువంటి ఆహారాలు సాత్వికతను దూరం చేస్తాయి. పూజ సమయంలో ఏకాగ్రతను దెబ్బతీస్తుంది.ఈ కారణాలన్నీటి వల్ల నాన్వెజ్ నీ నిషేధించడం జరిగింది.
Puranapanda Book : హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య…
Actor Sivaji : నిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కానీ తాజాగా నటుడు శివాజీ Sivaji చేసిన…
YouTuber Naa Anvesh : తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ…
Uppal : Z.P.H.S గవర్నమెంట్ స్కూల్ ఉప్పల్ లో పదవ తరగతి విద్యార్థుల కోసం ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం…
High Fees : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రీ-ప్రైమరీ నుంచి ఉన్నత…
Vijay-Rashmika : టాలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ – నటి రష్మిక దంపతులు ఇవాళ దేశ ప్రధాన మంత్రి…
Rinku Singh Father Death: భారత క్రికెట్ జట్టు యువ సంచలనం, స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ Rinku Singh…
Delhi liquor case : దేశ రాజకీయాల్లో కలకలం రేపిన లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఆమ్…
Medchal : శతమానం భవతి అని కుటుంబ సభ్యులు ఆశీర్వదిస్తూ నిండునూరేళ్లు పూర్తి చేసుకున్న వృద్ధుడికి ఘనంగా శతాబ్ది వేడుకలు…
MODI Geo politics : ప్రస్తుతం అరబ్ దేశాల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ముఖ్యంగా సౌదీ అరేబియా, యునైటెడ్…
Revanth Reddy : రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల హామీలను యుద్ధ ప్రాతిపదికన అమలు చేసేందుకు సిద్ధమైంది. రాబోయే 2026-27…
Gold Silver Rate Today 27 Feb 2026 : పసిడి ప్రేమికులకు ఇది నిజంగా అదిరే శుభవార్త అని…
This website uses cookies.