Zodiac Signs : ఉగాది నుంచి ఈ రాశుల వారికి ఏలినాటి శని, అర్ధాష్టమ శని…. ఇక దినదిన గండమే…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Zodiac Signs : ఉగాది నుంచి ఈ రాశుల వారికి ఏలినాటి శని, అర్ధాష్టమ శని…. ఇక దినదిన గండమే…?

 Authored By ramu | The Telugu News | Updated on :29 March 2025,6:00 am

ప్రధానాంశాలు:

  •  Zodiac Signs : ఉగాది నుంచి ఈ రాశుల వారికి ఏలినాటి శని, అర్ధాష్టమ శని.... ఇక దినదిన గండమే...?

Zodiac Signs : 2025 మార్చి 30వ తేదీన ఉగాది పండుగ జరుపుకోబోతున్నాం.ఈ ఉగాది పండుగ నుండి ముఖ్య గ్రహాలలో మార్పుల వల్ల ద్వాదశరాసుల వారికి జీవితాల్లో ప్రభావం రూపనుంది. ఉగాది తర్వాత కొన్ని రాశుల వారికి ఆదాయం తక్కువగా, ఖర్చు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి కచ్చితంగా జాగ్రత్తలను పాటించాల్సిందే…

Zodiac Signs ఉగాది నుంచి ఈ రాశుల వారికి ఏలినాటి శని అర్ధాష్టమ శని ఇక దినదిన గండమే

Zodiac Signs : ఉగాది నుంచి ఈ రాశుల వారికి ఏలినాటి శని, అర్ధాష్టమ శని…. ఇక దినదిన గండమే…?

Zodiac Signs ఉగాది నుండి ఈ రాశుల వారికి ఏడినాటి శని అర్ధాష్టమ శని ప్రారంభం

విశ్వావసునామ ఉగాది సంవత్సరములో ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి. ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ నా వారు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి. ఈ రాశుల వారు ఏలినాటి శని, వృద్ధాశ్రమ శని బారిన పడబోతున్నారు. మరి ఈ ఉగాది తరువాత ఏ రాశుల వారిపై దీని ప్రభావం ఉండబోతుందో తెలుసుకుందాం…

Zodiac Signs మేష రాశి

మేష రాశి వారికి ఉగాది నుండి ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు రాబోతున్నాయి. సంవత్సరం మేష రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14 ఉంటుంది. ఆదాయానికి మించిన డబ్బులను ఖర్చు చేయడంతో వీరికి ఆర్థికంగా నష్టం వాటిలనుంది. ఇక వీరికి ఉగాది నుంచి ఎన్ని నాటి శని ప్రారంభం కానుంది. తద్వారా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. విలైనంతవరకు పొదుపు చేయడం నేర్చుకోండి.

సింహరాశి : సింహ రాశికి ఈ సంవత్సరం ఉగాది నుంచి ఆదాయం 11, వ్యయం 11గా ఉంటుంది. ఈ సంవత్సరం వీరు అధికంగా ఖర్చు చేస్తారు. ఫలితంగా ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. వీరికి అర్ధాష్టమి శని కూడా ప్రారంభం అవడం చేత ఎంత డబ్బు చేతిలో ఉన్నా సరే ఖర్చయిపోతుంది. ఆర్థిక వ్యవహారాలు నిర్వహణలోపం కనిపిస్తుంది. అకస్మాత్తుగా వివాదాలు జరుగుతాయి. నోటిని అదుపులో ఉంచుకొని మౌనం పాటించండి. అంతా శుభమే జరుగుతుంది.

వృశ్చిక రాశి :  సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14 గా ఉంటుంది. మీరు కూడా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. 25వ తేదీన గురువు అష్టమ స్థానంలోకి మారుతున్న కారణంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కష్టార్జితం కూడా వృధా అయిపోతుంది. నువ్వు తప్పనిసరిగా పొదుపు చేయడం అలవాటు చేసుకుంటే ఉత్తమం.

ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి విశ్వ వసునామ సంవత్సరం ఉగాది తరువాత ఆదాయం 5 వ్యయం 5 ఉండడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి. మీరు ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు పెడతారు. వీరికి అర్ధాష్టమి శని ఉండటం వలన ఆర్థిక సమస్యలు వస్తాయి. ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో కొన్ని పొరపాట్లు జరిగే అవకాశాలు ఉన్నాయి. నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మకర రాశి : మకర రాశి వారికి ఉగాది నుంచి ఆదాయం 8, వ్యయం 14. ఈ సంవత్సరం మకర రాశి వారికి ఖర్చులు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది ఆదాయం ఆశించిన స్థాయిలో ఉండదు. వీలైనంతవరకు వృధా ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. మే 25వ తేదీన గురువు ఆరవ స్థానంలోకి మారుతున్నందువల్ల ఆదాయ విషయంలో పెద్దగా పురోగతిని చూపించదు. కాబట్టి,జాగ్రత్తను వహించాలి.

కుంభరాశి : 2025 వ సంవత్సరం మార్చి 30 ఉగాది తరువాత వీరి ఆదాయం 8, వ్యయం 14. వీరికి కూడా కొత్త సంవత్సరంలో ఖర్చులు బాగా పెరుగుతాయి. ఈ కొత్త సంవత్సరం తర్వాత ధన స్థానంలో శని ప్రవేశించుట చేత ఆదాయ మార్గాలు బాగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ. ఎంత కష్టపడ్డా ఫలితం ఉండదు. ఆశించిన తగ్గ ఫలితాలు ఉండవు. ఇక నిర్వహణ బాధ్యతల్ని జీవిత భాగస్వామికి అప్పగించడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు.

మీన రాశి : మీన రాశి వారికి కూడా ఉగాది నుంచి ఆదాయం 5, వ్యయం 5. వీరు కూడా సంపాదించినంత ఖర్చు అవుతుంది. రాశి వారికి ఏలినాటి శని ఈ కారణంగా ఉగాది తర్వాత నుంచి ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. వీరికి కష్టాలన్నీ చుట్టుముటుతాయి. బట్టి మీన రాశి వారు ఏ పని చేయాలన్నా చాలా జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది