Religions : ఆదిమానవులు మనిషిగా రూపాంతరం చెందని సమయంలో అందరూ కూడా ఒకే విధంగా జీవించేవారు. ఒకే రకమైన ఆహారం తీసుకునేవారు. ఒకే భాష మాట్లాడుతూ ఒకే వాతావరణం లో నివసించేవారు. అయితే మనిషిగా మారే క్రమంలో ఎంతగానో పరిణామం చెందారు. అంతే విధంగా పరిస్థితులను విభజించడం కూడా నేర్చుకున్నారు. అయితే ప్రపంచంలోని ప్రజలను వేరు చేయడంతో పాటు ఒకే రకమైన భావాజాలం ఉన్న ప్రజలను కలిపేందుకు ముఖ్యపాత్ర పోషించిన మతం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఆనాటి నుంచి ఈనాటి వరకు మానవుని జీవితంలో మతం అనేది ముఖ్యమైన పాత్ర పోషిస్తూ వస్తుంది. భూమి మీద ప్రజల అభివృద్ధి ప్రారంభించినప్పుడు రకరకాల ఆలోచనలు చేయడం మొదలుపెట్టాడు. తమ ఆలోచనల పరిధిని పెంచుకుంటూ వెళ్ళారు. జీవన విధానాన్ని మార్చుకున్నారు. మాట్లాడడం నేర్చుకున్నారు.అయితే మతం అన్న అంశం ఎలా ప్రారంభమైంది అన్న విషయం ఆలోచిస్తే చాలా విషయాలు బయటపడతాయి. మానవుడు తన మనుగడను విస్తరించుకుంటూ వెళ్తున్న సమయంలో వాళ్లకి ఎదురైన సంఘటనలు తన చుట్టూ ఉన్న పరిస్థితులు వాతావరణంలో వస్తున్న మార్పులను గమనించుకుంటూ ఒక రకమైన నమ్మకాన్ని డెవలప్మెంట్ చేసుకోవడం మొదలుపెట్టారు.
ప్రకృతికి సైన్స్ కు చాలా శక్తులు ఉంటాయి కాబట్టి హోమోసెఫియా వలన ఈ శక్తికి దేవుడు అనే పేరు పెట్టుకున్నారు. అప్పుడే ఒక శక్తి తమ సమస్యలను పరిష్కరించగలదు అని వారు నమ్మడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఆ శక్తి ని ఏదో విధంగా ప్రసన్నం చేసుకుంటే సమస్యలన్నీ తీరుతాయనే నమ్మకాన్ని బలపరచుకోవడం మొదలుపెట్టారు.ఈ విధంగా బహుదేవత మతం వచ్చింది. బహుదేవత మతం ఏమిటి అంటే బహుదేవత అంటే అన్ని రకాల దేవుళ్ళను నమ్మటం. ఉదాహరణకు హిందూ మతం వారు పంటలు బాగా పండాలి అంటే ఏదో ఒక శక్తి ఉండాలి అని నమ్మేవారు. అలా జంతువులను బలి ఇవ్వడం. మంచిగా వర్షాలు రావాలి అని గాలి దేవుడికి పూజలు చేయడం. వారికి ఇష్టమైనవి సమర్పించడం వంటి పనులు చేశారు.అలా కాలం మారే కొద్ది ప్రకృతిని దేవతలగా భావించి నమ్మడం మొదలుపెట్టారు. అలా ప్రతి తెగ ఒక్కో మతాన్ని నమ్మడం మొదలుపెట్టారు. అలా వింత వింత ఆచారాలు పుట్టుకొచ్చాయి. ఎవరికి వారు నచ్చిన దేవతలను కొలుచుకునే వారు.ఈ నేపథ్యంలోనే మతం మరో అడుగు ముందుకు వేసిందని చెప్పవచ్చు. అలా ప్రజలు బహుదేవత మతం నుంచి దూరం జరిగి క్రిస్టియన్ మతానికి ఆకర్షితులు అవుతూ వచ్చారు.
క్రిస్టియన్ మతం ఏమిటంటే ప్రజలందరూ తన మతాన్ని ఎలా ఆకర్షించాలి అనేది చెబుతుంది.అలా ఎక్కువ మంది ఈ మతం వైపు ఆకర్షతులయ్యారు.అప్పటివరకు పెంచుకున్న నమ్మకాలను విడిచిపెట్టారు. అలా మతం అనే పేరుకి నిర్వచనం మారిపోయింది. ఈ విధంగా మతాలు పుట్టుకొచ్చి ఇప్పుడు మతాల పేరుతో కల్లోలాలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఈ మతాలన్నీ కూడా మనుషులు వారి యొక్క స్వార్థాలకు అనుగుణంగా పెట్టుకున్నవే తప్ప ఏ దేవుడు కూడా మత పరమైన అంశాలను తెలిపినట్లుగా చరిత్రలో లేదు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.