Ayyappa Swamy : శ‌బ‌రిలో అయ్య‌ప్ప స్వామి ఎలా పుట్టాడు.. 150 ఏళ్ల కింద‌ట ఆల‌యం ఎలా వెళిసింది..?

Advertisement
Advertisement

Ayyappa Swamy : మన భారతదేశంలో తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అత్యంత రద్దీగా ఉండే దేవస్థానం అయ్యప్ప స్వామి శబరిమల క్షేత్రం. ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి అయ్యప్పలు రాకపోకలు సాగిస్తున్నారు. అయితే ఈ ఆలయం కొన్ని వేల సంవత్సరాల క్రితమే నిర్మించారట. దట్టమైన అడవిలో కొండలు లోయలు ఉండే ప్రాంతంలోఆలయం ఉండడం వలన ఈ ఆలయాన్ని ఎవరు కట్టారు అనేది, ఎందుకు కట్టారు అనేది నేటికీ ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నాయి. అయితే అప్పట్లో పందల రాజు శబరిమలను పాలించేవారు. కేరళ రాష్ట్రం మొదటి నుంచి అడవి ప్రాంతం గానే ఉంది. అయ్యప్ప స్వామి ఆలయాన్ని కట్టడానికి శబరిమలకు మించిన ప్రాంతం దొరకలేదు. పంబానది ఒడ్డున ఎంతో ఎత్తయిన ప్రదేశంలో ఉన్న శబరిమల అనువైన ప్రాంతంగా గుర్తించిన కొందరు భక్తులు మొదటిగా వెదురుపాకను వేసి అయ్యప్ప స్వామి ని పూజించేవారట. అయితే అయ్యప్ప ఓ రాజకుమారుడు.

Advertisement

అయ్యప్ప స్వామి తండ్రి రాజశేఖరుడు గొప్ప శివ భక్తుడు.ఈయన రాజ్య పాలనలో రాజ్యం సుఖశాంతులతో చల్లగా ఉండేది కానీ ఆ రాజు కుమారులు లేకపోవడం వారికి ఒక బాధ. రాజశేఖరుడు పిల్లల కోసం శివున్ని ప్రార్థించిగా శివుని అనుగ్రహంతో ఓ బిడ్డ నది ఒడ్డున ఆ రాజుకు కనిపిస్తాడు. ఆ బిడ్డను శివుని అంశగా భావించి ఆ బిడ్డను అంతపురంకు తీసుకెళ్తాడు రాజశేఖరుడు .ఇక ఆ బిడ్డకు మణికంఠుడు అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. ఇక ఆ బిడ్డ వచ్చిన వేల విశేషం ఆ రాజశేఖరుడి యొక్క భార్య మగ బిడ్డ కు జన్మనిస్తుంది. బాల్యంలో ఇద్దరు కూడా పోటాపోటీగా ఎదుగుతారు. అయితే రాజశేఖరుడు మణికంఠుడిని అవతార పురుషుడని ముందే గుర్తిస్తాడు . మణికంఠుని కోరిక మేరకు గురుకులాలో చదువుకోడానికి పంపిస్తాడు రాజశేఖరుడు. తిరిగి వచ్చిన తర్వాత మణికంఠునికి పట్టాభిషేకం చేయాలని అనుకుంటాడు రాజశేఖరుడు కాని ఆయన భార్యకు మాత్రం తన కడుపున పుట్టిన బిడ్డ సింహాసనం అధిష్టించాలని కోరిక.

Advertisement

Interesting Facts About Ayyappa Swamy Sabarimala Temple

దీంతో ఆమె తల నొప్పి గా ఉందని పులిపాలు తెమ్మని మణికంఠుడిని కోరుతుంది. దీంతో మణికంఠుడిని పులి మింగేస్తుందని తన కన్న బిడ్డ రాజవుతాడని ఆమె అభిప్రాయం. కానీ మణికంఠుడు పులిపాలు తేవడం కాదు ఏకంగా ఆ పులిపైన సవారీ చేస్తూ అంతపురంకు వస్తాడు. అయితే మణికంఠుడు రాజ్యాన్ని మాత్రం స్వీకరించలేదు. తిరిగి అడవికి వెళ్ళిపోయి శబరిమలలో అయ్యప్పగా వెలిసాడు. అయితే అడవి వెళ్లి శబరిమల లోనే సరిగ్గా ఆగిపోవడానికి ఒక బలమైన కారణం ఉంది. తనకు రాజ్యం వద్దని తిరిగి అడవులకు వెళ్ళిపోతానని కోరుతాడు మణికంఠుడు. తాను ఒక బాణంను వదులుతానని ఆ బాణం ఎక్కడైతే వెళ్లి పడుతుందో అక్కడ తనకి గుడి కట్టించమని కోరుతాడు మణికంఠుడు. ఆ విధంగా శబరిమలలో అయ్యప్ప ఆలయం వెలసింది.

కాలక్రమంలో అడవిలో సంభవించే మంటల వలన ఆలయం ధ్వంసం అయ్యేది. స్వామి వారి మూలలకు ఏం కాకపోయేది కానీ పైన కప్పిన గడ్డి మంటల లో కాలి బూడిద అయ్యేది. అలాగే మొదట్లో ఈ ఆలయానికి పరశురాముడు తయారుచేసిన రాతిమెట్లు ఉండేవి. అయితే అన్నీ ఉన్నప్పటికీ అగ్నిప్రమాదం ఎలా సంభవిస్తుందో పూజారులకు అర్థం కాకపోయేది. చివరికి పందల రాజుల చేతిలో ఓ అపురూపమైన కార్యక్రమం చేయాల్సి ఉందని జ్యోతిష్యులు చెప్పారు. అదే అయ్యప్ప స్వామి వారి దేవాలయం. దీంతో అప్పటివరకు ఉన్న శిలా విగ్రహాలను బదులుగా పంచలోహ విగ్రహాలను తయారుచేసి ప్రతిష్టించారు . అలాగే పరుశురాముడు నిర్మించిన రాతిమెట్లకు బదులుగా పంచలోహ మెట్లను తయారు చేశారు. అప్పటినుంచి స్వామి వారి దేవస్థానం కోట్లాది భక్తులతో కలకలాడుతూ వస్తుంది.

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

6 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

7 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

8 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

9 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

10 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

11 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

12 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

13 hours ago

This website uses cookies.