Karthika Masam : కార్తీకమాసం వెళ్లే లోపు ఒకే ఒక్కసారి ఈ ఆకు మీద ఈ నెంబర్ రాసి కాల్చి చూడండి…!

Authored By Jyothi Marikanti | The Telugu News | Updated on : 12 December 2023, 7:00 am
  •  Karthika Masam : కార్తీకమాసం వెళ్లే లోపు ఒకే ఒక్కసారి ఈ ఆకు మీద ఈ నెంబర్ రాసి కాల్చి చూడండి...!

Karthika Masam  : ప్రతి మనిషి యొక్క జీవితంలో ఎన్నో రకాల సమస్యలు ఉంటు ఉంటాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు అప్పుల బాధలతో చాలామంది సతమతమవుతుంటారు. ఉద్యోగ జీవితంలో సమస్యలు ఇలా ప్రతి మనిషి జీవితంలో ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. అయితే వాటికీ పరిష్కారం మార్గాలను అన్వేషించడానికి మనం చేసే వ్రతాలు, నోములు వీటన్నింటికీ కూడా ఫలితం దక్కాలని ఎంతగానో ఆరాటపడుతూ ఉంటాం.. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా తాము దైవారాధన చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే కనుక తమ జీవితంలో తమకు ఎటువంటి లోటు ఉండకూడదు అని వారిని బాధిస్తున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి భగవంతుడితో చెప్పుకొని ఆ సమస్యలకు పరిష్కారం కలిగించమని ఆ భగవంతుని వేడుకుంటూ ఉంటారు.అయితే అటువంటి కోరికలు తీరటానికి జరగని జరగవు అనుకున్న విషయాలు జరగడానికి కూడా ఈ యొక్క పరిహారాలు అనేవి ఎంతగానో ఉపయోగపడుతుంటాయి.

దీనికి సంబంధించి మీరు చేయవలసినటువంటి పరిహారం ఏమిటి అంటే.. కార్తీకమాసం వెళ్ళేలోపు వీలైతే గనక మంగళవారం లేదా ఆదివారం రోజు లేదా గురువారం రోజు మీరు ఈ పరిహారాన్ని చేసి చూడండి. చక్కటి ఫలితం అనేది మీకు దక్కుతుంది. మీ జీవితంలో మీరు ఏదైతే కోరికను కలిగి ఉన్నారో ఆ కోరిక కచ్చితంగా నెరవేరుతుంది. దానికి మీరు చేయవలసింది బిర్యానీ ఆకు తీసుకోవాలి. ఈ బిర్యానీ ఆకు మనకి అనేక రకాల ఔషధాలను అందిస్తుంది. ఈ దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాకుండా లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టమని చెప్పుకోవాలి. అంటే ఈ బిర్యానీ ఆకు మాత్రమే కదండీ లవంగాలు యాలకులు, అలాగే చెక్క ఇటువంటి సుఖంద ద్రవ్యాలు అన్నీ కూడా లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువులనే చెప్పుకోవాలి. వాటికి లక్ష్మీదేవితో చాలా అనుబంధం అనేది ఉంటుంది. ముఖ్యంగా బిర్యానీ ఆకులు అనేది కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన వస్తువు దీంతో మనం చేసే పరిహారం వల్ల ఆ భగవంతుని ఆశీస్సులతో పాటు లక్ష్మీదేవి కటాక్షం కూడా మీకు శుద్ధి చేస్తుంది.

దీనికోసం మీరు చేయవలసింది ఏమిటంటే ఒకవేళ రెండు మూడు కోరికల గురించి మీరు ఈ పరిహారం చేయాలి అనుకుంటే కూడా రెండు మూడు ఆకులను కూడా తీసుకువచ్చండి. ఆ రెండు మూడు ఆకులు అయినా పర్వాలేదు. ఈ ఆకుల మీద మూడు తొమ్మిదులు రాసి మీ కోరికను బలంగా మనసులో తలుసుకొని మీ కోరిక ఏదైతే ఉంటుందో దానిని వెనకవైపు రాసి దీనిని కుడి చేతిలో పట్టుకుని లక్ష్మీదేవిని వేడుకొని ఒక క్యాండిల్ ని లేదా ఏదైనా దీపం కి సంబంధించింది తీసుకొని ఈ ఆకును కాల్చివేయాలి. ఈ విధంగా రాసి కాల్చినట్లయితే మీ యొక్క కోరిక ఏదైతే ఉందో అది వారం రోజులలో తప్పకుండా తీరుతుంది.. ఆ లక్ష్మి దేవి కటాక్షం మీకు కలుగుతుంది.

Jyothi Marikanti

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp