
#image_title
Khairathabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక హైదరాబాద్ లో కాదు.. తెలంగాణలో కాదు.. యావత్ దేశం మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వినాయకుడు మన ఖైరతాబాద్ గణేష్. ఎత్తులో కావచ్చు.. అక్కడ జరిగే పూజలు కావచ్చు.. అక్కడికి వచ్చే భక్తులు కావచ్చు.. ఎలా చూసుకున్నా ఖైరతాబాద్ గణేష్ స్పెషల్ అనే చెప్పుకోవాలి. అసలు.. ఖైరతాబాద్ గణేష్ ను దర్శించుకుంటే చాలు.. ఏడు జన్మల పుణ్యం అంటారు. ఇక.. ఖైరతాబాద్ గణేష్ ను నిమజ్జనానికి తీసుకెళ్తుంటే చూడటం కూడా భాగ్యం అనే చెప్పుకోవాలి. ఏది ఏమైనా ఖైరతాబాద్ గణేష్ కు ఉన్నన్ని ప్రత్యేకతలు మరే గణేశుడికి లేవు అనే చెప్పుకోవాలి. అందుకే ఖైరతాబాద్ గణేష్ అంత ప్రసిద్ధి చెందింది.
#image_title
అసలు ఖైరతాబాద్ గణేష్ ఎందుకు అంత ఫేమస్ అయింది అనే విషయం చాలామందికి తెలియదు. ఖైరతాబాద్ గణేష్ ను ఎప్పటి నుంచి పెడుతున్నారో తెలుసా? 1954 సంవత్సరం నుంచి ఖైరతాబాద్ గణేష్ ను పెడుతున్నారు. 1954 నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఆ ప్లేస్ లో గణేష్ ను నిలబెట్టాల్సిందే. గత 70 ఏళ్ల నుంచి కూడా ఈ పద్ధతి కొనసాగుతోంది. వినాయకచవితి వస్తోంది అంటే చాలు ఖైరతాబాద్ లో సందడి నెలకుంటుంది. ఎక్కడి నుంచో వచ్చి ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకుంటారు.
ఖైరతాబాద్ లో 1954 నుంచి వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి నవరాత్రులు పూజలు చేసే పద్ధతికి శ్రీకారం చుట్టారు. 1954 లో సాధారణ విగ్రహాన్నే ఏర్పాటు చేశారు. 1981 నుంచి ఒక్కో సంవత్సరం వినాయకుడి ఎత్తును పెంచుతూ వచ్చారు. అలా 2019 లో 61 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నుంచి వినాయకుడి విగ్రహం ఎత్తును తగ్గిస్తూ వస్తున్నారు.
భారీ గణపతిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడంతో పాటు ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఇక్కడ ఉత్సవాలు 1954 లో ఒక అడుగు ఎత్తు గణేశుడి విగ్రహంతో ప్రారంభం అయ్యాయి. అప్పట్లో ఖైరతాబాద్ కౌన్సిలర్ సింగరి శంకరయ్య.. స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా తిలక్ పిలుపు మేరకు ఖైరతాబాద్ లో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఉత్సవాలకు శ్రీకారం చుట్టాడు. తొలి ఏడాది వినాయక విగ్రహాన్ని పెట్టి నగరం మొత్తం తిరుగుతూ వినాయక నవరాత్రులను అందరూ ఘనంగా నిర్వహించాలని శంకరయ్య కరపత్రాలు పంచాడు.
అప్పటి నుంచి ఏటా వినాయకుడి ఎత్తును పెంచుతూ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. 1979 లో 20 అడుగుల వినాయకుడిని తయారు చేశారు. 1981 లో 25 అడుగుల నాట్య వినాయకుడు, 1982 లో ముషిక వాహన వినాయకుడితో ఖైరతాబాద్ గణేష్ కు రాష్ట్రవ్యాప్త గుర్తింపు లభించింది.
1987 నుంచి వినాయకుడి ఎత్తును క్రమంగా పెంచుతూ వెళ్లారు. 2015 లో 60 అడుగుల భారీ గణపతికి ఘనంగా వేడుకలు నిర్వహించారు. సింగరి శంకరయ్య మరణం తర్వాత కూడా ఆయన సోదరుడు సింగరి సుదర్శన్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. అప్పట్లో హైదరాబాద్ లో కేవలం పాతబస్తీ, రాంకోటీ, దూల్ పేట్, ఖైరతాబాద్ లలో మాత్రమే ఉత్సవాలు జరిగేవి. 1985 వరకు నెల రోజుల పాటు ఖైరతాబాద్ లో ఉత్సవాలు నిర్వహించేవారు. దసరా రోజున నిమజ్జనం చేసేవారు. అప్పట్లో నెల రోజుల పాటు పలు వేడుకలను నిర్వహించేవారు. ఆ వేడుకలకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చేవారు.
భక్తుల ఆదరణ పెరుగుతూ ఉండటంతో ప్రజల డిమాండ్ మేరకు ఎత్తును కూడా పెంచుతూ ఉండటంతో అక్కడ ఉన్న భవనం ముందే దేవుడిని ప్రతిష్ఠించడం ఆనవాయితీగా వస్తోంది. వినాయకుడి ప్రతిమ ఏర్పాటు మొదలుకొని శోభాయాత్ర కూడా నేత్రపర్వంగా సాగుతుంది. చరిత్రలోనే మొదటిసారిగా మట్టి గణపతిగా దర్శనం కూడా ఇచ్చారు ఖైరతాబాద్ గణేష్. కరోనా సమయంలో మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి అక్కడే నిమజ్జనం చేశారు.
Vijay wife Sangeetha : తమిళ రాజకీయాల్లోనే కాకుండా దక్షిణాది సినీ పరిశ్రమలో ఇప్పుడు ఒక వార్త పెను సంచలనం…
Central Government : దేశవ్యాప్తంగా రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ…
Vijay-Rashmika : టాలీవుడ్లో అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త ఎట్టకేలకు నిజమైంది. అభిమాన జంటగా పేరుగాంచిన విజయ్ దేవరకొండ –…
Farmer Rights Law : భారతదేశంలో India వ్యవసాయం farming కోట్ల మందికి జీవనాధారం. అయితే, చాలా చోట్ల ఒకరి…
Gold and Silver Rate Today 28 Feb 2026 : పసిడి ప్రియులకు మరోసారి షాక్ తగిలింది. కిందటి…
Brahmamudi 2026 February 28th Episode : స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న సూపర్ హిట్ సీరియల్ 'బ్రహ్మముడి'…
Karthika Deepam 2 February 28th 2026 Today Episode : స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న బ్లాక్…
Mint : వేసవి రుతువులో పుదీనా చట్నీ, పుదీనా నీరు ప్రతి ఇంట్లో విరివిగా ఉపయోగించబడుతుంది. అందులోని చల్లనిచ్చే లక్షణం…
Pomegranate Juice : “ఒక దానిమ్మ పండు వంద వ్యాధులను నయం చేస్తుంది” అనే సామెత మనకు తెలిసిందే. అయితే…
Chanakya Niti : వేల సంవత్సరాల క్రితం జీవించిన ఆచార్య చాణక్యుడు ప్రతిపాదించిన జీవన విధానాలు, వ్యూహాలు నేటి ఆధునిక…
Donald Trump : ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన చేసే వ్యాఖ్యలు ప్రపంచ…
Jayaprakash Narayana : ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల పనితీరు మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.…
This website uses cookies.