Khairathabad Ganesh : 1954 నుంచి 2023 వరకు ఖైరతాబాద్ గణేష్ ఎలా మారుతూ వచ్చాడో తెలుసా?

Khairathabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక హైదరాబాద్ లో కాదు.. తెలంగాణలో కాదు.. యావత్ దేశం మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వినాయకుడు మన ఖైరతాబాద్ గణేష్. ఎత్తులో కావచ్చు.. అక్కడ జరిగే పూజలు కావచ్చు.. అక్కడికి వచ్చే భక్తులు కావచ్చు.. ఎలా చూసుకున్నా ఖైరతాబాద్ గణేష్ స్పెషల్ అనే చెప్పుకోవాలి. అసలు.. ఖైరతాబాద్ గణేష్ ను దర్శించుకుంటే చాలు.. ఏడు జన్మల పుణ్యం అంటారు. ఇక.. ఖైరతాబాద్ గణేష్ ను నిమజ్జనానికి తీసుకెళ్తుంటే చూడటం కూడా భాగ్యం అనే చెప్పుకోవాలి. ఏది ఏమైనా ఖైరతాబాద్ గణేష్ కు ఉన్నన్ని ప్రత్యేకతలు మరే గణేశుడికి లేవు అనే చెప్పుకోవాలి. అందుకే ఖైరతాబాద్ గణేష్ అంత ప్రసిద్ధి చెందింది.

#image_title

అసలు ఖైరతాబాద్ గణేష్ ఎందుకు అంత ఫేమస్ అయింది అనే విషయం చాలామందికి తెలియదు. ఖైరతాబాద్ గణేష్ ను ఎప్పటి నుంచి పెడుతున్నారో తెలుసా? 1954 సంవత్సరం నుంచి ఖైరతాబాద్ గణేష్ ను పెడుతున్నారు. 1954 నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఆ ప్లేస్ లో గణేష్ ను నిలబెట్టాల్సిందే. గత 70 ఏళ్ల నుంచి కూడా ఈ పద్ధతి కొనసాగుతోంది. వినాయకచవితి వస్తోంది అంటే చాలు ఖైరతాబాద్ లో సందడి నెలకుంటుంది. ఎక్కడి నుంచో వచ్చి ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకుంటారు.

Khairathabad Ganesh : 1954 లో తొలిసారిగా ఖైరతాబాద్ లో విగ్రహం

ఖైరతాబాద్ లో 1954 నుంచి వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి నవరాత్రులు పూజలు చేసే పద్ధతికి శ్రీకారం చుట్టారు. 1954 లో సాధారణ విగ్రహాన్నే ఏర్పాటు చేశారు. 1981 నుంచి ఒక్కో సంవత్సరం వినాయకుడి ఎత్తును పెంచుతూ వచ్చారు. అలా 2019 లో 61 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నుంచి వినాయకుడి విగ్రహం ఎత్తును తగ్గిస్తూ వస్తున్నారు.

భారీ గణపతిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడంతో పాటు ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఇక్కడ ఉత్సవాలు 1954 లో ఒక అడుగు ఎత్తు గణేశుడి విగ్రహంతో ప్రారంభం అయ్యాయి. అప్పట్లో ఖైరతాబాద్ కౌన్సిలర్ సింగరి శంకరయ్య.. స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా తిలక్ పిలుపు మేరకు ఖైరతాబాద్ లో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఉత్సవాలకు శ్రీకారం చుట్టాడు. తొలి ఏడాది వినాయక విగ్రహాన్ని పెట్టి నగరం మొత్తం తిరుగుతూ వినాయక నవరాత్రులను అందరూ ఘనంగా నిర్వహించాలని శంకరయ్య కరపత్రాలు పంచాడు.

అప్పటి నుంచి ఏటా వినాయకుడి ఎత్తును పెంచుతూ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. 1979 లో 20 అడుగుల వినాయకుడిని తయారు చేశారు. 1981 లో 25 అడుగుల నాట్య వినాయకుడు, 1982 లో ముషిక వాహన వినాయకుడితో ఖైరతాబాద్ గణేష్ కు రాష్ట్రవ్యాప్త గుర్తింపు లభించింది.

1987 నుంచి వినాయకుడి ఎత్తును క్రమంగా పెంచుతూ వెళ్లారు. 2015 లో 60 అడుగుల భారీ గణపతికి ఘనంగా వేడుకలు నిర్వహించారు. సింగరి శంకరయ్య మరణం తర్వాత కూడా ఆయన సోదరుడు సింగరి సుదర్శన్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. అప్పట్లో హైదరాబాద్ లో కేవలం పాతబస్తీ, రాంకోటీ, దూల్ పేట్, ఖైరతాబాద్ లలో మాత్రమే ఉత్సవాలు జరిగేవి. 1985 వరకు నెల రోజుల పాటు ఖైరతాబాద్ లో ఉత్సవాలు నిర్వహించేవారు. దసరా రోజున నిమజ్జనం చేసేవారు. అప్పట్లో నెల రోజుల పాటు పలు వేడుకలను నిర్వహించేవారు. ఆ వేడుకలకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చేవారు.

భక్తుల ఆదరణ పెరుగుతూ ఉండటంతో ప్రజల డిమాండ్ మేరకు ఎత్తును కూడా పెంచుతూ ఉండటంతో అక్కడ ఉన్న భవనం ముందే దేవుడిని ప్రతిష్ఠించడం ఆనవాయితీగా వస్తోంది. వినాయకుడి ప్రతిమ ఏర్పాటు మొదలుకొని శోభాయాత్ర కూడా నేత్రపర్వంగా సాగుతుంది. చరిత్రలోనే మొదటిసారిగా మట్టి గణపతిగా దర్శనం కూడా ఇచ్చారు ఖైరతాబాద్ గణేష్. కరోనా సమయంలో మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి అక్కడే నిమజ్జనం చేశారు.

Recent Posts

Spicy Food : కారం తిన్న వెంటనే నోరు మండుతుంది ఎందుకు? దీని వెనుక‌ శాస్త్రీయ కారణం ఇదే!

Spicy Food : చాలామందికి మసాలా తిండి అంటే ముచ్చటే. ముఖ్యంగా కారం పుల్లలుగా ఉండే భోజనాన్ని ఎంతో మంది…

19 minutes ago

Vastu Tips : ఇంట్లో పావురాల గూడు శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏమంటుంది తెలుసా?

Vastu Tips : హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రం ప్రాచీన నిర్మాణ శాస్త్రంగా నిలిచింది. ఇల్లు నిర్మించేటప్పుడు, శుభశాంతులు, ఆరోగ్యం,…

2 hours ago

Sleeping : నిద్ర భంగిమ‌ల‌తో మీరు ఎలాంటి వారో ఇట్టే చెప్పేయోచ్చు.. అది ఎలాగంటే..!

Sleeping : మన ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఆహారం కూడా, నిద్ర కూడా అత్యంత కీలకమైన అంశాలు. సరైన సమయంలో తినడం,…

3 hours ago

Raksha Bandhan : 2025 రాఖీ పండుగ ప్రత్యేకత ఏంటి.. 95 ఏళ్ల తర్వాత అరుదైన యోగాల కలయిక !

Raksha Bandhan : ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకునే రాఖీ పండుగ (రక్షాబంధన్) భారతీయ సాంప్రదాయంలో సోదరుడు…

4 hours ago

Varalakshmi Vratam : వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం ఎప్పుడు.. పూజా స‌మ‌యం, ఇత‌ర విశేషాలు ఇవే..!

Varalakshmi vratam : 2025లో వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం రెండో శుక్రవారం, అంటే ఆగస్టు 8వ తేదీన ఘనంగా…

5 hours ago

Astrology : ఏ రాశి వారికి ఏ రంగు .. ఏ రాశి వారు ఏ రంగు వ‌స్తువులు కొన‌డం బెట‌ర్..!

Astrology : ప్రస్తుతం వాహనాలను సొంతం చేసుకోవడం మనం అవసరంగా భావిస్తున్నాం. అయితే కేవలం లుక్‌కే పరిమితమవకుండా, మన వ్యక్తిత్వానికి,…

6 hours ago

Mark Zuckerberg : 24 ఏళ్ల కుర్రాడికి 2,196 కోట్ల జీతం ఇస్తున్న మార్క్ జుకర్‌బర్గ్.. ఎందుకో తెలుసా…?

Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…

15 hours ago

Rs. 500 Notes : రూ.500 నోట్ల రద్దుపై కేంద్రం క్లారిటీ…!

Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…

16 hours ago