ప్రస్తుతం ఉన్న ఆన్లైన్ వ్యవస్థ కారణంగా దేశాల మధ్య అడ్డుగోడలను చెరిపేశారు. ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ ల ద్వారా ప్రేమించుకుంటూ దేశ, భాష, ప్రాంతం అవేమీ తేడా లేకుండా చివరికి పెళ్లిళ్లు కూడా చేసుకుంటున్నారు. తాజాగా ఓ జంట ఫేస్ బుక్ ద్వారా పరిచయమై చివరికి పెళ్లి చేసుకున్నారు. అయితే వాళ్ళ జంట అందరికీ విభిన్నంగా ఉంది. ఆమె వయసు 75. అతడికి 35. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఎన్ని విమర్శలు, ఆరోపణలు వచ్చిన వారిద్దరూ మాత్రం సంసార జీవితాన్ని సాఫీగా కొనసాగిస్తున్నారు. పాకిస్థాన్కు చెందిన నయీమ్ షాజాద్ అనే 35 ఏళ్ల యువకుడికి కెనడాకు చెందిన 70 ఏళ్ల మేరీ వృద్ధురాలితో 2012 లో ఫేస్బుక్లో పరిచయం అయింది.
అయితే మొదట మామూలు ఫ్రెండ్ షిప్గానే ఉన్నా ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. 2017లో ప్రేమిస్తున్నట్టు తనలోని ప్రేమను బయటకు చెప్పింది మేరి. దీంతో నయిమ్ అందుకు అంగీకరించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు 2017 లో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి వారు ఎంతో అన్యోన్యంగా కలిసి ఉంటూ సంసార జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అయితే పెళ్లి తర్వాత వారికి వీసా సమస్యలు తలెత్తడంతో వారిద్దరూ కలిసి కెనడాలో జీవించలేకపోయారు. ఈ క్రమంలోనే ఇటీవల పాకిస్తాన్ కు వచ్చిన మేరీ నయిమ్ వద్ద ఆరు నెలల పాటు ఉంటున్నట్లు తెలిపింది. అయితే వీరి పెళ్లిపై నెటిజెన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
డబ్బు, కెనడా పౌరసత్వం కోసమే 70 ఏళ్ల మేరీని 35 ఏళ్ల నయిమ్ పెళ్లి చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు. తన అవసరాల కోసం ఆమెను పెళ్లి చేసుకున్నాడని మండిపడుతున్నారు. అయితే ఇలా వస్తున్న ఆరోపణలను నయీమ్, మేరీ జంట ఖండిస్తున్నారు. తాము ప్రేమించి పెళ్లి చేసుకున్నామని మా మధ్య ఎప్పుడు వయస్సు సమస్య రాలేదని చెబుతున్నారు. నయీమ్ ని మేరీ ఆదుకుందని, క్లిష్ట పరిస్థితుల్లో తనకు మానసికంగా ధైర్యం చెప్పిందని అదే వారి ప్రేమ పెళ్లికి దారి తీసింది అని పేర్కొన్నారు. అయితే ఇక్కడ మేరీ పెద్దగా ధనవంతురాలు ఏమి కాదు ఆమెకు వచ్చే పెన్షన్తో బతుకుతుందని నయిమ్ వెల్లడించాడు. ఎవరు ఎన్ని విమర్శలు చేసిన తాను పట్టించుకోనని చెప్పాడు.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.