Home » Devotional » Lord Krishna Says Facts About Food In Telugu
Devotional

Lord Krishna : శ్రీకృష్ణుడు చెప్పిన ప్రకారం ఈ మూడు రకాల ఆహారాన్ని తినడం వల్ల మనిషి ఆయుషు తగ్గిపోతుంది…!

Authored By
aruna
The Telugu News | Published on: February 1, 2024, 10:00 am
Advertisement

Lord Krishna : మనం భోజనం చేసే విధానం ఏదైతే ఉంటుందో అది ఎంత కరెక్ట్ గా పద్ధతిగా ఉంటుందో మన జీవితం మీద కూడా దాని ప్రభావం అంతే ఉంటుంది. మనం ఏ విధంగా అయితే భోజనం చేస్తున్నామో.. ఏ దిశలో కూర్చుంటున్నాము. అలాగే మనం భోజనంలో ఎటువంటి ఆహారం అనేది మనం తీసుకుంటున్నామో.. దానిపైన మొత్తం జీవితమనేది ఆధారపడి ఉంటుంది. మనకి జరిగే మంచి, చెడులు ప్రతి భోజనం చేసేటప్పుడు ఎంతో శుద్ధిగా అలాగే మంచి ఆలోచనతో ఉండాలి. మనం ఇక్కడ భోంచేసే ఆహార విధానాలు బట్టి మనం అవతలి వాళ్ళతో భోజనం చేసేటప్పుడు ప్రవర్తించే ప్రవర్తన బట్టి పై లోకంలో మనం చనిపోయిన తర్వాత మనతో ట్రీట్మెంట్ అనేది ఉంటుందట. వినటానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా..కానీ ఇది నిజమే.. అయితే ఏ విధంగా ఎలా చేస్తే కరెక్ట్ గా ఉంటుంది.

Advertisement

ఎలా చేస్తే తప్పు.. అనేది ప్రతి ఒక్కటి చాలా వివరంగా దీని గురించి మనం తెలుసుకుందాం. భోజనం చేయడానికి వెళ్ళినప్పుడు కానీ లేదంటే మిమ్మల్ని ఎంతో అవమానించి భోజనం పెట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి చోటన భోజనం చేయకూడదు. మిమ్మల్ని అవమానించి దాని తర్వాత భోజనం పెడితే మాత్రం అది అసలు తీసుకోకూడదు. ఇక భోజనం చేసేటప్పుడు మొట్టమొదటిగా మనం భోజనానికి అంటే అన్నపూర్ణ కి దండం అనేది పెట్టుకోవాలి. ఇక చాలామంది భోజనం చేసేటప్పుడు మాట్లాడేస్తూ ఉంటారు.అలా అసలు చేయకూడదు. భోజనం చేసేటప్పుడు ముందు స్వీట్ అనేది తీసుకోవాలి. మొదటి మూడు ముద్దలు కానీ మీరు మౌనవహించి తీసుకుంటే మీకు మనశ్శాంతి దొరుకుతుంది. అలాగే అన్నానికి సంబంధించిన ఎప్పుడు కూడా కరువు అనేది మీకు ఉండదు. ఇక భోజనం చేసేటప్పుడు పూర్వ దిశలో కానీ మనం కూర్చొని భోజనం అనేది చేస్తే మనకి రోగాలు అనేవి రావు. ఎందుకంటే పూర్వకశించి మనకి సూర్యుడు దిశ కాబట్టి మనకి మంచి ఆయువు ఆరోగ్యం పొందుతాం.

ఇక ఉత్తర దిక్కున కూర్చుని మనం భోజనం చేస్తే మనకి మంచి విద్య అభివృద్ధి అవుతుంది. ఎందుకంటే అది సరస్వతి దేవి దిక్కు కాబట్టి.. పోరపాటును కూడా దక్షిణ దిశలో కూర్చుని భోజనం అనేది చేయరాదు. అది మృతికి దారి అనేది చూస్తుంది. మీ ఆయుక్షణం జరిగిపోతుంది. ఇక ఏకాదశి నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నాన్ వెజ్ తినరాదు. అలా కాని తింటే మీ మీద లక్ష్మి కటాక్షం లేకుండా ఇంట్లో ఉన్న లక్ష్మీ కూడా అలిగి వెళ్లిపోతుంది. భోజనం ఎప్పుడు కూడా వేస్ట్ చేయకూడదు. తినే అంతవరకే పెట్టించుకోవాలి.ఇక మన పక్కన మనతో పాటు కూర్చుని ఎవరైనా భోజనం చేస్తున్నారంటే వాళ్ళు భోజనం కూడా అయిపోయిన తర్వాతే మనం అక్కడి నుంచి లేవాలి. అలా కాకుండా వాళ్ల నీ అలాగే మధ్యలో వదిలేసి మీ పాటికి మీరు లెగిసి వచ్చేస్తే మాత్రం మీకు పితృ దోషం కలుగుతుంది. ఇక పళ్లెంలో ఏనాడు కూడా చేయ అనేది కడగకూడదు. మనం తిన్న పళ్లెంలోనే చేయి కడిగితే మాత్రం అది దరిద్రానికి సంకేతాన్ని చూపిస్తుంది..

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి