Pitru Paksha : పితృపక్ష సమయంలో మగవారు ఈ తప్పులు చేస్తే ఇక అంతే… చాలా నష్టపోతారు…!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 21 September 2024, 8:00 am
  •  Pitru Paksha : పితృపక్ష సమయంలో మగవారు ఈ తప్పులు చేస్తే ఇక అంతే... చాలా నష్టపోతారు...!

Pitru Paksha : హిందూ సనాతన ధర్మంలో ఏడాదిలోని ఒక నిర్దిష్ట కాలాన్ని పూర్వికులకు అంకితం చేయబడింది. ఈ కాలాన్ని పితృ పక్షం అని పిలుస్తారు. అయితే పక్షం అంటే 15 రోజులు. ఇక ఈ 15 రోజులు తమ పూర్వీకులు భూమి మీద ఉంటారనేది హిందువుల విశ్వాసం. కాబట్టి ఈ సమయంలో పూర్వీకుల శ్రద్ధ కర్మలను నిర్వహించి వారి ఆశీర్వాదాలను పొందుతారు. హిందూ క్యాలెండర్ ప్రకారం పితృ పక్షం భాద్రపద పౌర్ణమి తిదిన మొదలై భాద్రపద మాసం అమావాస్య తిథిన ముగుస్తుంది. అయితే ఈ ఏడాది పితృ పక్షం సెప్టెంబర్ 17వ తేదీ నుండి ప్రారంభమై అక్టోబర్ 02వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే పూర్వికులు తమ వారసులను కలవడం కోసం వస్తారని అలాగే పితృపక్షంలో చేసే నది స్నానం ,తర్పణం, దానం, శ్రద్ధ మరియు కర్మలకు, విశేష ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా పూర్వీకుల ఆత్మకు శాంతి కలిగి తమ వారసులను ఆశీర్వదిస్తారని నమ్మకం. అయితే ఈ సమయంలో మగవారు కొన్ని పనులను అస్సలు చేయకూడదు. ఒకవేళ ఆ పనులను పొరపాటున చేసిన పూర్వీకుల ఆగ్రహానికి గురవుతారని పండితులు చెబుతున్నారు. మరి పితృపక్ష సమయంలో మగవారు ఏ పనులు చేయకూడదో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…

Pitru Paksha వీటిని కొనుగోలు చేయకూడదు

పితృపక్ష సమయంలో ఇంట్లో ఎటువంటి శుభకార్యాలను చేయకూడదు. అలాగే ఈ సమయం ఇంట్లోని మగవారు కొత్త బట్టలను,కొత్త వస్తువులను కొనుగోలు చేయకూడదు. అంతేకాకుండా కొన్నిటికి దూరంగా ఉండాలి. అందులో తామసిక ఆహారానికి దూరంగా ఉంటూ సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ముఖ్యంగా మాంసం మద్యం వాటికి చాలా దూరంగా ఉండాలి.

Pitru Paksha ఇలా చేయడం తప్పు ఆర్థిక నష్టాలు

పితృపక్ష సమయంలో మగవారు జుట్టును కత్తిరించుకోవడం అలాగే గడ్డం తీసివేయడం వంటి పనులు చేయకూడదు. ఒకవేళ చేసినట్లయితే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పూర్వీకుల కోసం నిర్వహించే ఆహారం మరియు ఆహార పాత్రల విషయాలను ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం మంచిది. రాగి , కుండ , ఇత్తడి పాత్రలలో ఆహారాన్ని సిద్ధం చేసుకోవాలి. అలాగే ఇనుప పాత్రల్లో వంట చేయకూడదు.

Pitru Paksha : పితృపక్ష సమయంలో మగవారు ఈ తప్పులు చేస్తే ఇక అంతే... చాలా నష్టపోతారు...!

Pitru Paksha : పితృపక్ష సమయంలో మగవారు ఈ తప్పులు చేస్తే ఇక అంతే… చాలా నష్టపోతారు…!

Pitru Paksha ఏ పనులు చేయవద్దంటే

పితృపక్ష సమయంలో కొత్త వ్యాపారాలను ప్రారంభించడం మరియు గృహప్రవేశాలు వంటివి చేయకూడదు. అంతేకాదు ఆహారంలో ఉల్లి వెల్లుల్లిని ఉయోగించకూడదు. ముఖ్యంగా ఈ సమయంలో నామకరణం పెళ్లిళ్లు , మహోత్సవాలు వంటి శుభకార్యాలను చేయకూడదు. ఒకవేళ ఈ సమయంలో ఈ పనులు చేస్తే పితృపక్షంలోని పితృదేవతలకు ఆగ్రహం వస్తుంది. దీంతో కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు డబ్బు నష్టం వంటివి ఉంటాయని పండితులు చెబుతున్నారు.

Advertisement

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Tags :
Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి