Bathing : ప్రతిరోజు స్నానం చేయడం అనేది మనిషి జీవితంలో సర్వసాధారణం. ప్రతిరోజు స్నానం చేయడం వలన శరీరం శుభ్రం అవడంతో పాటు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం స్నానం చేసే నీటిలో కొన్నింటిని కలిపి స్నానం చేయడం వలన ఆరోగ్యవంతులు అవడంతో పాటు ఐశ్వర్యవంతులు కూడా అవుతారని తెలియజేయడం జరిగింది. మరి ప్రతిరోజు స్నానం చేసే నీటిలో ఏం కలిపితే మంచిది..?వాటి వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఆయుర్వేదంలో తులసి ఆకులకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అలాగే తులసి ఆకులలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి. మరి ఇలాంటి దివ్య ఔషధమైన తులసి ఆకులను ప్రతిరోజు స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేస్తే ఒత్తిడి ఆందోళన తొలగి మానసిక ప్రశాంతత లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాక తులసి ఆకులతో స్నానం చేయడం వలన చర్మ సమస్యలన్ని దూరమవుతాయి. శరీరంలో నెగిటివ్ ఎనర్జీ దూరమై పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. దీంతో జీవితాన్ని ఆహ్లాదకరంగా గడపవచ్చు.
పసుపులో మన శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే పసుపుని యాంటీబయోటిక్ గా పిలుస్తుంటారు. అయితే పసుపుని నీటిలో కలిపి స్నానం చేయడం వలన అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయట. ప్రతిరోజు స్నానం చేసే నీటిలో పసుపు కలుపుకొని చేయడం వలన చర్మ సమస్యలతో పాటు నెగిటివ్ ఎనర్జీ అనేది దూరమవుతుందట. అంతేకాక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ విధంగా చేస్తే ఆర్థికపరమైన ఇబ్బందులు అనేవి దూరమవుతాయి.
స్నానం చేస్తే నీటిలో లావెండర్ ఆయిల్ కలిపి చేయడం వలన మానసిక ప్రశాంతత పెరిగి నెగటివ్ ఆలోచనలు అనేవి తగ్గిపోతాయట. అలాగే స్నానం చేసే నీటిలో చిటికెడు ఉప్పు వేసుకోవడం వలన గ్రహ దోషాలు ఏమైనా ఉంటే తొలిగిపోతాయి.
గులాబీ రేకులు…
ప్రతిరోజు మనం స్నానం చేసే నీటిలో గులాబీ రేకులు కలిపి చేయడం వలన జీవితంలో శాంతి అనేది పెరుగుతుంది. అంతేకాక చర్మ సౌందర్యం పెరిగి ప్రకాశవంతంగా యవ్వనంగా కనిపిస్తారు. అలాగే దీనిలో కాస్త తేనె కలిపి స్నానం చేసినట్లయితే ఆర్థిక సంక్షోభాల నుంచి కూడా బయటపడతారని నిపుణులు చెబుతున్నారు.
New Liquor Policy : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమూలమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది. కొత్తగా మద్యం…
Chandrababu : గత కొన్ని రోజులుగా ఏపీలో మెడికల్ సీట్ల వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. తన హయాంలో…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజు రోజుకి రసవత్తరంగా మారుతుంది. కంటెస్టెంట్స్…
Electric Tractor : రైతులకు శుభవార్త... వ్యవసాయంలో రైతులకు వెన్నుదన్నుగా నిలిచే సరికొత్త ట్రాక్టర్ను మహారాష్ట్రకు చెందిన యువకుడు అభివృద్ధి…
Blood : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మన శరీరంలో అన్ని అవయవాలు కూడా సక్రమంగా పని చేయాలి. అయితే…
Job : యువతలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా APSSDC ఆధ్వర్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు…
Tongue : మన కళ్ళు పసుపు రంగులో మారిన లేక చర్మం పసుపు రంగులోకి మారిన కామెర్ల వ్యాధికి సంకేతం గా…
Pitru Paksha : సనాతన ధర్మం ప్రకారం పూర్వీకులకు అంకితం చేయబడిన నిర్దిష్ట కాలాన్ని పితృపక్షం అని పిలుస్తారు. ఇక…
This website uses cookies.