
Navaratri 2024 : నవరాత్రుల్లో ఉపవాసం చేసేవారు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి... తప్పక తెలుసుకోవాల్సిన విషయం...!
Navaratri 2024 : దుర్గాదేవిని ప్రతిష్టించి పూజించే శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఇక ఈ నవరాత్రులలో దుర్గాదేవిని వివిధ రూపాలలో అలంకరించి పూజిస్తారు. అలాగే హిందూమతంలో ఈ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ఈ సమయంలో చాలామంది అమ్మవారి భక్తులు భక్తిశ్రద్ధలతో దుర్గాదేవిని పూజిస్తూ ఉపవాస దీక్ష చేస్తారు. అయితే హిందూ సాంప్రదాయాల ప్రకారం ఉపవాసం చేయడం అనేది మతపరమైనటువంటి ఒక విధి మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా చాలా ప్రయోజనాలు కలుగుతాయి. అయితే నవరాత్రులలో ఉపవాసం చేసే సమయంలో కచ్చితంగా ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అలాకాకుండా అజాగ్రత్తగా ప్రవర్తిస్తే కచ్చితంగా ఆరోగ్యం పాడవుతుందని తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నవరాత్రులలో ఉపవాసం పాటించే వారు కచ్చితంగా కొన్ని పద్ధతులను తెలుసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మరి అవేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
ఉపవాసం ఉండేవారు ఈ సమయంలో శరీరానికి తగినంత నీరు తీసుకోవడం చాలా ముఖ్యం. ఇక ఈ ఉపవాస దీక్షను చేసే సమయంలో కచ్చితంగా నీటిని ఎక్కువగా తీసుకోవాలి. తద్వారా శరీరం డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి రోజుకి కనీసం 2 నుంచి 3 లీటర్ల నీరు త్రాగాలి. శరీరం హైడ్రేట్ గా ఉంటే ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ సరిగా ఉంటుంది. తద్వారా మీరు యాక్టివ్ గా కనిపిస్తారు.
ఉపవాస దీక్షను చేస్తున్న సమయంలో పొరపాటున కూడా నూనెలో వేయించిన ఆహారాన్ని తెలుసుకోకూడదు. అయితే నూనె పదార్థాలు ఆరోగ్యానికి హానికరమని మనందరికీ తెలిసిందే. ఇవి గుండె సమస్యలను పెంచుతాయి. మరీ ముఖ్యంగా ఉపవాస సమయంలో వీటిని తీసుకున్నట్లయితే వీటి ప్రభావం నేరుగా గుండెపై పడుతుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ముఖ్యంగా మధుమేహం కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు వీటికి దూరంగా ఉండాలి. వీటికి బదులుగా పండ్లను తీసుకోవడం మంచిది.
చాలామంది ఉపవాస సమయంలో ఎక్కువసేపు ఏమీ తినకుండా తాగకుండా ఉంటారు. ఈ సమయంలో ఇలా చేయడం అనేది అస్సలు మంచిది కాదు. ఖాళీ కడుపుతో ఎక్కువసేపు ఉన్నట్లయితే ఆరోగ్యం పాడవుతుంది. కాబట్టి ప్రతి 2, 3 గంటలకు ఏదో ఒకటి తినడం లేదా తాగడం వంటివి చేయాలి. ఆకలితో ఉండటం వలన ఎసిడిటీ లేదా తలనొప్పి వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో త్వరగా అలసిపోతారు.
Navaratri 2024 : నవరాత్రుల్లో ఉపవాసం చేసేవారు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి… తప్పక తెలుసుకోవాల్సిన విషయం…!
ఉపవాసం చేసేవారు కచ్చితంగా ప్రోటీన్ ఫ్రూట్స్ తీసుకోవడం చాలా మంచిది. ఈ క్రమంలో తీసుకునే ఆహారంలో పెరుగు పాలు బాదం వంటి వాటిని చేర్చుకోవాలి. ఉపవాస సమయంలో వీటిని తినడం వలన చాలా శక్తి లభిస్తుంది. అంతేకాక ఇవి జీర్ణం అవ్వడానికి కూడా కాస్త సమయం పడుతుంది కాబట్టి త్వరగా ఆకలి అనిపించదు.
ఈ సమస్య ఉన్నవారు ఉపవాసం చేయకండి…
మధుమేహం రక్తపోటు క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధి ఉన్నవారు ఈ ఉపవాసం చేయడం అస్సలు మంచిది కాదు. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా ఉపవాసం చేయడం మంచిది కాదు. ఒకవేళ మీరు ఉపవాసం ఉండాలి అనుకుంటే ముందుగా మీ ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.
kondigari Ramulu : ఈ రోజుల్లో రాజకీయాల్లో ఒక్కసారి ప్రజాప్రతినిధిగా గెలిచినా చాలామంది నాయకులు ఆస్తులు, ఐశ్వర్యాలు కూడబెట్టుకునే ప్రయత్నం…
Nakirekal : నకిరేకల్ పట్టణంలో దివ్యాంగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మంజూరు చేసిన ప్రత్యేక స్కూటీలను గౌరవ ఎమ్మెల్యే…
Vijay Jason vs Vijay : తమిళ సూపర్ స్టార్ విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు ఒక పెద్ద మలుపు…
Hyderabad : భాగ్యనగరం అంటేనే రకరకాల రుచులకు మరియు విందు వినోదాలకు పెట్టింది పేరు. దేశ విదేశాల నుండి పర్యాటకులు…
YS Jagan good news : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గెలుపోటముల సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గత ఎన్నికల్లో ఆశించిన…
Iran New Supreme : ఇరాన్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఆయన…
Velidanda : గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామంలో గ్రామాభివృద్ధికి మరొక కీలకమైన అడుగు పడింది. గ్రామంలో నూతనంగా నిర్మించబోయే సీసీ…
Alekhya Reddy : నందమూరి తారకరత్న మరణం తర్వాత ఆయన భార్య అలేఖ్య రెడ్డి మొదటిసారి తన మనసులో మాటను…
Sanju Samson : భారత క్రికెట్ జట్టు మరోసారి ప్రపంచ వేదికపై తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. ICC Men's T20…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పూర్తి ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు.…
students : ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి విద్యార్థులు పరీక్షల కోసం తుది సన్నాహాల్లో నిమగ్నమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థులు చివరి…
Kerosene : ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు దేశీయ ఇంధన సరఫరాపై ప్రభావం చూపే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.…
This website uses cookies.