Navaratri 2024 : దుర్గాదేవిని ప్రతిష్టించి పూజించే శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఇక ఈ నవరాత్రులలో దుర్గాదేవిని వివిధ రూపాలలో అలంకరించి పూజిస్తారు. అలాగే హిందూమతంలో ఈ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ఈ సమయంలో చాలామంది అమ్మవారి భక్తులు భక్తిశ్రద్ధలతో దుర్గాదేవిని పూజిస్తూ ఉపవాస దీక్ష చేస్తారు. అయితే హిందూ సాంప్రదాయాల ప్రకారం ఉపవాసం చేయడం అనేది మతపరమైనటువంటి ఒక విధి మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా చాలా ప్రయోజనాలు కలుగుతాయి. అయితే నవరాత్రులలో ఉపవాసం చేసే సమయంలో కచ్చితంగా ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అలాకాకుండా అజాగ్రత్తగా ప్రవర్తిస్తే కచ్చితంగా ఆరోగ్యం పాడవుతుందని తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నవరాత్రులలో ఉపవాసం పాటించే వారు కచ్చితంగా కొన్ని పద్ధతులను తెలుసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మరి అవేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
ఉపవాసం ఉండేవారు ఈ సమయంలో శరీరానికి తగినంత నీరు తీసుకోవడం చాలా ముఖ్యం. ఇక ఈ ఉపవాస దీక్షను చేసే సమయంలో కచ్చితంగా నీటిని ఎక్కువగా తీసుకోవాలి. తద్వారా శరీరం డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి రోజుకి కనీసం 2 నుంచి 3 లీటర్ల నీరు త్రాగాలి. శరీరం హైడ్రేట్ గా ఉంటే ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ సరిగా ఉంటుంది. తద్వారా మీరు యాక్టివ్ గా కనిపిస్తారు.
ఉపవాస దీక్షను చేస్తున్న సమయంలో పొరపాటున కూడా నూనెలో వేయించిన ఆహారాన్ని తెలుసుకోకూడదు. అయితే నూనె పదార్థాలు ఆరోగ్యానికి హానికరమని మనందరికీ తెలిసిందే. ఇవి గుండె సమస్యలను పెంచుతాయి. మరీ ముఖ్యంగా ఉపవాస సమయంలో వీటిని తీసుకున్నట్లయితే వీటి ప్రభావం నేరుగా గుండెపై పడుతుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ముఖ్యంగా మధుమేహం కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు వీటికి దూరంగా ఉండాలి. వీటికి బదులుగా పండ్లను తీసుకోవడం మంచిది.
చాలామంది ఉపవాస సమయంలో ఎక్కువసేపు ఏమీ తినకుండా తాగకుండా ఉంటారు. ఈ సమయంలో ఇలా చేయడం అనేది అస్సలు మంచిది కాదు. ఖాళీ కడుపుతో ఎక్కువసేపు ఉన్నట్లయితే ఆరోగ్యం పాడవుతుంది. కాబట్టి ప్రతి 2, 3 గంటలకు ఏదో ఒకటి తినడం లేదా తాగడం వంటివి చేయాలి. ఆకలితో ఉండటం వలన ఎసిడిటీ లేదా తలనొప్పి వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో త్వరగా అలసిపోతారు.
ఉపవాసం చేసేవారు కచ్చితంగా ప్రోటీన్ ఫ్రూట్స్ తీసుకోవడం చాలా మంచిది. ఈ క్రమంలో తీసుకునే ఆహారంలో పెరుగు పాలు బాదం వంటి వాటిని చేర్చుకోవాలి. ఉపవాస సమయంలో వీటిని తినడం వలన చాలా శక్తి లభిస్తుంది. అంతేకాక ఇవి జీర్ణం అవ్వడానికి కూడా కాస్త సమయం పడుతుంది కాబట్టి త్వరగా ఆకలి అనిపించదు.
ఈ సమస్య ఉన్నవారు ఉపవాసం చేయకండి…
మధుమేహం రక్తపోటు క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధి ఉన్నవారు ఈ ఉపవాసం చేయడం అస్సలు మంచిది కాదు. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా ఉపవాసం చేయడం మంచిది కాదు. ఒకవేళ మీరు ఉపవాసం ఉండాలి అనుకుంటే ముందుగా మీ ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.
Prakash Raj : విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల మధ్య జరుగుతున్న…
Congress Govt : కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. గత ఏడాది డిసెంబర్లో అధికారంలోకి వచ్చినప్పటి…
NABARD : నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (NABARD) నాబార్డ్ ఆఫీస్ అటెండెంట్ నోటిఫికేషన్ క్రింద…
Viral Video : ఈ ప్రపంచంలో మనిషి తన జీవితాన్ని సాఫీగా నడిపించుకోవడం చాలా కష్టం అనిపిస్తుంది. ఎప్పుడు ఎలాంటి…
Chandrababu : ప్రజల వద్దకే పాలన.. ఎంతోమంది రాజకీయ పార్టీల నాయకుల నోటి నుంచి వినే మాట. కొందరు ఆ…
Konda Surekha : బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఒక ప్రముఖ హీరోయిన్ వ్యక్తిగత జీవితాన్ని బజారుకీడ్చిన కొండా సురేఖపై…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8.. రోజు రోజుకి ఆసక్తికరంగా సాగుతుంది. ఇప్పుడు…
Tragic Boat : ఇటీవలి కాలంలో బోటు ప్రమాదాలు మనం ఎక్కువగా చూస్తున్నాం. ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా కూడా పరిమితికి…
This website uses cookies.