Navaratri 2024 : నవరాత్రుల్లో ఉపవాసం చేసేవారు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి... తప్పక తెలుసుకోవాల్సిన విషయం...!
Navaratri 2024 : దుర్గాదేవిని ప్రతిష్టించి పూజించే శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఇక ఈ నవరాత్రులలో దుర్గాదేవిని వివిధ రూపాలలో అలంకరించి పూజిస్తారు. అలాగే హిందూమతంలో ఈ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ఈ సమయంలో చాలామంది అమ్మవారి భక్తులు భక్తిశ్రద్ధలతో దుర్గాదేవిని పూజిస్తూ ఉపవాస దీక్ష చేస్తారు. అయితే హిందూ సాంప్రదాయాల ప్రకారం ఉపవాసం చేయడం అనేది మతపరమైనటువంటి ఒక విధి మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా చాలా ప్రయోజనాలు కలుగుతాయి. అయితే నవరాత్రులలో ఉపవాసం చేసే సమయంలో కచ్చితంగా ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అలాకాకుండా అజాగ్రత్తగా ప్రవర్తిస్తే కచ్చితంగా ఆరోగ్యం పాడవుతుందని తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నవరాత్రులలో ఉపవాసం పాటించే వారు కచ్చితంగా కొన్ని పద్ధతులను తెలుసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మరి అవేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
ఉపవాసం ఉండేవారు ఈ సమయంలో శరీరానికి తగినంత నీరు తీసుకోవడం చాలా ముఖ్యం. ఇక ఈ ఉపవాస దీక్షను చేసే సమయంలో కచ్చితంగా నీటిని ఎక్కువగా తీసుకోవాలి. తద్వారా శరీరం డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి రోజుకి కనీసం 2 నుంచి 3 లీటర్ల నీరు త్రాగాలి. శరీరం హైడ్రేట్ గా ఉంటే ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ సరిగా ఉంటుంది. తద్వారా మీరు యాక్టివ్ గా కనిపిస్తారు.
ఉపవాస దీక్షను చేస్తున్న సమయంలో పొరపాటున కూడా నూనెలో వేయించిన ఆహారాన్ని తెలుసుకోకూడదు. అయితే నూనె పదార్థాలు ఆరోగ్యానికి హానికరమని మనందరికీ తెలిసిందే. ఇవి గుండె సమస్యలను పెంచుతాయి. మరీ ముఖ్యంగా ఉపవాస సమయంలో వీటిని తీసుకున్నట్లయితే వీటి ప్రభావం నేరుగా గుండెపై పడుతుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ముఖ్యంగా మధుమేహం కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు వీటికి దూరంగా ఉండాలి. వీటికి బదులుగా పండ్లను తీసుకోవడం మంచిది.
చాలామంది ఉపవాస సమయంలో ఎక్కువసేపు ఏమీ తినకుండా తాగకుండా ఉంటారు. ఈ సమయంలో ఇలా చేయడం అనేది అస్సలు మంచిది కాదు. ఖాళీ కడుపుతో ఎక్కువసేపు ఉన్నట్లయితే ఆరోగ్యం పాడవుతుంది. కాబట్టి ప్రతి 2, 3 గంటలకు ఏదో ఒకటి తినడం లేదా తాగడం వంటివి చేయాలి. ఆకలితో ఉండటం వలన ఎసిడిటీ లేదా తలనొప్పి వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో త్వరగా అలసిపోతారు.
Navaratri 2024 : నవరాత్రుల్లో ఉపవాసం చేసేవారు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి… తప్పక తెలుసుకోవాల్సిన విషయం…!
ఉపవాసం చేసేవారు కచ్చితంగా ప్రోటీన్ ఫ్రూట్స్ తీసుకోవడం చాలా మంచిది. ఈ క్రమంలో తీసుకునే ఆహారంలో పెరుగు పాలు బాదం వంటి వాటిని చేర్చుకోవాలి. ఉపవాస సమయంలో వీటిని తినడం వలన చాలా శక్తి లభిస్తుంది. అంతేకాక ఇవి జీర్ణం అవ్వడానికి కూడా కాస్త సమయం పడుతుంది కాబట్టి త్వరగా ఆకలి అనిపించదు.
ఈ సమస్య ఉన్నవారు ఉపవాసం చేయకండి…
మధుమేహం రక్తపోటు క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధి ఉన్నవారు ఈ ఉపవాసం చేయడం అస్సలు మంచిది కాదు. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా ఉపవాసం చేయడం మంచిది కాదు. ఒకవేళ మీరు ఉపవాసం ఉండాలి అనుకుంటే ముందుగా మీ ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.
7th pay commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్ (DA) పెంపు జరగబోతుంది. తాజా సమాచారం…
Coffee : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే, అనేక ఒత్తిడిలకు…
Mars Ketu Conjunction : శాస్త్రం ప్రకారం 55 సంవత్సరాల తరువాత కుజుడు, కేతువు సింహరాశిలోకి సంయోగం చెందబోతున్నాడు.తద్వారా, కన్యారాశిలోకి…
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్లో హీరోయిన్గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
KTR : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…
This website uses cookies.