Navaratri 2024 : నవరాత్రుల్లో ఉపవాసం చేసేవారు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి... తప్పక తెలుసుకోవాల్సిన విషయం...!
Navaratri 2024 : దుర్గాదేవిని ప్రతిష్టించి పూజించే శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఇక ఈ నవరాత్రులలో దుర్గాదేవిని వివిధ రూపాలలో అలంకరించి పూజిస్తారు. అలాగే హిందూమతంలో ఈ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ఈ సమయంలో చాలామంది అమ్మవారి భక్తులు భక్తిశ్రద్ధలతో దుర్గాదేవిని పూజిస్తూ ఉపవాస దీక్ష చేస్తారు. అయితే హిందూ సాంప్రదాయాల ప్రకారం ఉపవాసం చేయడం అనేది మతపరమైనటువంటి ఒక విధి మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా చాలా ప్రయోజనాలు కలుగుతాయి. అయితే నవరాత్రులలో ఉపవాసం చేసే సమయంలో కచ్చితంగా ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అలాకాకుండా అజాగ్రత్తగా ప్రవర్తిస్తే కచ్చితంగా ఆరోగ్యం పాడవుతుందని తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నవరాత్రులలో ఉపవాసం పాటించే వారు కచ్చితంగా కొన్ని పద్ధతులను తెలుసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మరి అవేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
ఉపవాసం ఉండేవారు ఈ సమయంలో శరీరానికి తగినంత నీరు తీసుకోవడం చాలా ముఖ్యం. ఇక ఈ ఉపవాస దీక్షను చేసే సమయంలో కచ్చితంగా నీటిని ఎక్కువగా తీసుకోవాలి. తద్వారా శరీరం డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి రోజుకి కనీసం 2 నుంచి 3 లీటర్ల నీరు త్రాగాలి. శరీరం హైడ్రేట్ గా ఉంటే ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ సరిగా ఉంటుంది. తద్వారా మీరు యాక్టివ్ గా కనిపిస్తారు.
ఉపవాస దీక్షను చేస్తున్న సమయంలో పొరపాటున కూడా నూనెలో వేయించిన ఆహారాన్ని తెలుసుకోకూడదు. అయితే నూనె పదార్థాలు ఆరోగ్యానికి హానికరమని మనందరికీ తెలిసిందే. ఇవి గుండె సమస్యలను పెంచుతాయి. మరీ ముఖ్యంగా ఉపవాస సమయంలో వీటిని తీసుకున్నట్లయితే వీటి ప్రభావం నేరుగా గుండెపై పడుతుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ముఖ్యంగా మధుమేహం కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు వీటికి దూరంగా ఉండాలి. వీటికి బదులుగా పండ్లను తీసుకోవడం మంచిది.
చాలామంది ఉపవాస సమయంలో ఎక్కువసేపు ఏమీ తినకుండా తాగకుండా ఉంటారు. ఈ సమయంలో ఇలా చేయడం అనేది అస్సలు మంచిది కాదు. ఖాళీ కడుపుతో ఎక్కువసేపు ఉన్నట్లయితే ఆరోగ్యం పాడవుతుంది. కాబట్టి ప్రతి 2, 3 గంటలకు ఏదో ఒకటి తినడం లేదా తాగడం వంటివి చేయాలి. ఆకలితో ఉండటం వలన ఎసిడిటీ లేదా తలనొప్పి వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో త్వరగా అలసిపోతారు.
Navaratri 2024 : నవరాత్రుల్లో ఉపవాసం చేసేవారు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి… తప్పక తెలుసుకోవాల్సిన విషయం…!
ఉపవాసం చేసేవారు కచ్చితంగా ప్రోటీన్ ఫ్రూట్స్ తీసుకోవడం చాలా మంచిది. ఈ క్రమంలో తీసుకునే ఆహారంలో పెరుగు పాలు బాదం వంటి వాటిని చేర్చుకోవాలి. ఉపవాస సమయంలో వీటిని తినడం వలన చాలా శక్తి లభిస్తుంది. అంతేకాక ఇవి జీర్ణం అవ్వడానికి కూడా కాస్త సమయం పడుతుంది కాబట్టి త్వరగా ఆకలి అనిపించదు.
ఈ సమస్య ఉన్నవారు ఉపవాసం చేయకండి…
మధుమేహం రక్తపోటు క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధి ఉన్నవారు ఈ ఉపవాసం చేయడం అస్సలు మంచిది కాదు. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా ఉపవాసం చేయడం మంచిది కాదు. ఒకవేళ మీరు ఉపవాసం ఉండాలి అనుకుంటే ముందుగా మీ ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.