
పిల్లలకు ఈ 3 విషయాలు తప్పక నేర్పించండి...చాణక్యుడి నీతి వాక్యం...
Chanakyaniti : ప్రతి వ్యక్తి తన వ్యక్తిత్వం ప్రకారం జీవితాన్ని గడుపుతారు. తన జీవితంలో చిన్న పెద్ద నిర్ణయాలను కూడా తానే స్వయంగా తీసుకుంటాడు. అయితే కొంతమంది ఏం తినాలి ,ఏ దుస్తులను ధరించాలి,ఎలా జీవించాలి అనే విషయాల పై పెద్దల సలహాలను తీసుకుంటారు. మానవ జన్మ ఎత్తడం ఒక గొప్ప వరం.. దానిని పరిపూర్ణంగా జీవించాలని అంటారు. ఒక వ్యక్తి తన జీవితంలో ఎట్టి పరిస్థితులోను వెనకడుగు వేయకూడదు. కానీ కొంతమంది సిగ్గు కారణంగా ముఖ్యమైన పనులను పూర్తి చేయలేరు. సిగ్గు కారణంగా కొంతమంది కొన్ని ముఖ్యమైన పనులను చేయకపోవడం వలన జీవితంలో ఆ లోటు అనేది ఎప్పటికీ ఉండిపోతుంది. అయితే చాణిక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి కొన్ని ప్రదేశాలలో వెనకడుగు వెయ్యకూడదని చెప్పాడు. ఒకవేళ ఈ 4 ప్రదేశాలలో సిగ్గు పడితే జీవితంలో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి అవెంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
ఒక వ్యక్తి జీవితంలో విద్య అనేది చాలా ముఖ్యం. ఏ ప్రదేశంలో ఎక్కడ చదువుకుంటున్న అందులో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అయితే ప్రతి వ్యక్తి ఏదో ఒక నైపుణ్యాన్ని కలిగి ఉంటాడు. ఎదుటి వ్యక్తిని పోల్చుకుంటూ నీకంటే తక్కువ అని అనుకుంటే చదువుకి అర్థమే ఉండదు. చాణిక్యుడు ఇది మంచి విషయంగా పరిగణించలేదు. విద్యను ఎక్కడ నుండి అభ్యసించిన దానిని అందుకోగలగాలి. ఒకవేళ అది జంతువైన లేదా మరి ఏదైనా కూడా విద్యను అందుకోవాలి. ఒకవేళ అర్థం కాని విషయాలు ఉంటే అది ఇతరులను అడిగి తెలుసుకోవాలి. దానిని విమర్శిస్తే అది మూర్ఖత్వమే అవుతుంది. కాబట్టి అన్ని వైపులా విజ్ఞానాన్ని అందుకోవడం చాలా ముఖ్యం.
జీవితంలో ఆహారం అనేది అత్యంత ముఖ్యమైన విషయం. అలాంటి ఆహారాన్ని తినకుండా ఉంటే మీరే సమస్యలను తెచ్చుకున్నట్లు అవుతుంది. ఆకలితో ఉన్న వ్యక్తి తనపై తను నియంత్రణ కలిగి ఉంటారు. ఇలాంటివారు జీవితంలో వెనకడుగులు వేస్తారు. ఎందుకంటే ఆకలితో ఉన్నవారు ఆలోచించే విధానం, అర్థం చేసుకునే సామర్థ్యం తక్కువ ఉంటుంది. కనుక ఆహార విషయంలో సిగ్గు పడకూడదు. ముఖ్యంగా ఆకలిని ఎప్పుడూ చంపుకోకూడదు. ఎప్పుడు సంపూర్ణ భోజనం చెయ్యాలి.
Chanakyaniti : జీవితంలో ఈ 4 విషయాలలో అస్సలు సిగ్గు పడకండి… చాణక్యుడి నీతి ఏం చెబుతుందంటే…!
కొంతమంది జీవితంలో కొన్ని విషయాలను చెప్పడానికి సిగ్గుపడతారు. ఇలా తన మనసులో ఉన్న విషయాలను మరొకరికి చెప్పలేక ఇబ్బంది పడతారు. కాబట్టి ఎదుటి వ్యక్తికి తన మనసులోని విషయాలను చెప్పడం అనేది చాలా ముఖ్యం. ఇది మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. అయితే తన మనసులో ఉన్న విషయాలను చెప్పకపోవడం వలన మనిషి పశ్చాత్తాపానికి గురి కావాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఇలాంటి చర్యల వలన సంబంధాలు బలహీనపడతాయి. ఇలాంటి పరిస్థితి రాకుండా ముందుగానే తన మనసులోని మాటను సిగ్గుపడకుండా ధైర్యంగా చెప్పాలి.
ముఖ్యంగా డబ్బు విషయంలో ఎవరైనా సరే సిగ్గు పడకూడదు. డబ్బు అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. అయితే ఎవరైనా మీ దగ్గర డబ్బుని అప్పుగా తీసుకుని దానిని తిరిగి ఇవ్వకపోతే మీరు నష్టపోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే ఎలాంటి సంకోచం లేకుండా తిరిగి మీ అప్పుని అడగాలని చాణిక్యుడు తెలియజేశాడు.
Maha Shivratri : ఫిబ్రవరి 15, 2026న రానున్న మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా, శివాలయ సందర్శనలో భక్తులు పాటించాల్సిన…
Today Horoscope 15th February 2026 : వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ రోజు (ఆదివారం, 15 ఫిబ్రవరి 2026)…
T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ICC T20 World Cup 2026లో సౌతాఫ్రికా తన…
Telangana : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేపుతున్నాయి. సుమారు 30కి పైగా మున్సిపాలిటీల్లో…
Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ కలిగిన యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. జబర్దస్త్ షో ద్వారా…
Shivajyothi : ప్రముఖ యాంకర్ శివజ్యోతి తల్లి అయ్యారు. తీన్మార్ వార్తలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శివజ్యోతి,…
Womens : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Andhra Pradesh Government 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి…
Nara Lokesh : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకటే చర్చ నడుస్తోంది, అదేంటంటే నారా లోకేష్ పట్టాభిషేకం ఎప్పుడు అని.…
This website uses cookies.