Categories: DevotionalNews

Rakhi Purnima : రాఖీ పండుగ రోజు ఏ రాశి వారికి ఏ రంగు రాఖీ కడితే మంచిది…!

Advertisement
Published by
Advertisement

Rakhi Purnima : శ్రావణమాసపు పున్నమి వెన్నెల అన్నాచెల్లెల అనురాగానికి రక్షణ బంధానికిి ప్రతీకగా అయిన రాఖీ పండుగ మరోసారి మన ముంగిట నిలిచింది. ఈ ఏడాది ఆగస్టు 19 శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకునే ఈ పండుగ మన సంప్రదాయాలకు విలువలకు అద్దం పడుతుంది. ఈ పవిత్రమైన రోజున కేవలం రాఖీ కట్టుకోవడమే కాదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశుల వారీగా సరైన రంగు రాఖీలు ఎంచుకోవడం కూడా శుభప్రదం అని నమ్ముతారు. ఈ రంగులు జాతకంలోని గ్రహాలను బలపరిచి వ్యక్తి జీవితంలో సానుకూల ప్రభావాన్ని చూపుతాయని చెబుతారు. మరి ఏ రాశి వారికి ఏ రంగు రాఖి అనుకూలము ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…

Advertisement

Rakhi Purnima మేషరాశి…

మేష రాశి వారికి ఎరుపు రంగు రాఖి శక్తిని ఉత్సాహాన్ని ఇస్తుంది. వారిలోని నాయకత్వ లక్షణాలను ధైర్యాన్ని పెంపొందించి కుజుడుని బలపరుస్తుంది. ఇది మేష రాశి వారి సహజ లక్షణాలకు అనుగుణంగా ఉంటుంది. వారి జీవితంలో ఉత్సాహం ధైర్యం నిండి ఉండాలని కోరుకుంటూ సోదరీమణులు ఎరుపు రంగు రాఖీని కట్టడం శుభప్రదం.

Advertisement

వృషభ రాశి…

వృషభ రాశి వారికి తెలుపు రంగు రాఖీ ప్రశాంతతను సౌభాగ్యాన్ని తెస్తుంది. ఇది శుక్ర గ్రహ శక్తిని పెంచుతుంది. తెలుపు రంగు స్వచ్ఛతను సూచిస్తుంది. ఇది వృషభ రాశి వారి ప్రశాంత స్వభావానికి అనుకూలంగా ఉంటుంది. వారి జీవితంలో శాంతి సౌభాగ్యం నెలకొనాలని వారి కోరికలు తీరాలని కోరుకుంటూ తెలుపు రంగు రాఖీని కట్టడం మంచిది.

మిథున రాశి…

మిధున రాశి వారికి ఆకుపచ్చ రంగు రాఖి మేదస్సును సృజనాత్మకతను పెంపొందిస్తుంది. ఇది వారిలోని సంభాషణ నైపుణ్యాలను ఉచ్చుకతను పెంచి ఉపగ్రహాన్ని బలపరుస్తుంది. పచ్చ రంగు పెరుగుదలను సామరస్యాన్ని సూచిస్తుంది. ఇది మిధున రాశి వారి బహుముఖ ప్రజ్ఞకు అనుగుణంగా ఉంటుంది. వారి జీవితంలో మేధస్సు వికసించాలని కొత్త ఆలోచనలు కోరుతూ ఆకుపచ్చ రాఖీని కట్టడం శుభప్రదం.

కర్కాటక రాశి…

కర్కాటక రాశి వారికి తెలుపు రంగు రాఖి మనశ్శాంతిని ఆధ్యాత్మికతను పెంచుతుంది. ఇది వారిలోని సునితత్వాన్ని సంరక్షణ బాధ్యతను పెంచి చంద్రుడిని బలపరుస్తుంది. తెలుపు రంగు ప్రేమను చూచిస్తుంది. ఇది కర్కాటక రాశి వారికి మాతృత్వ స్వభావాన్నికి అనుగుణంగా ఉంటుంది. వారి జీవితంలో ప్రేమ ఆప్యాయత ఉండాలని కోరుకుంటూ తెలుపు రంగు రాఖీని కట్టడం మంచిది.

సింహా రాశి…

సింహ రాశి వారికి పసుపు ఎరుపు రంగు రాఖీలు నాయకత్వ లక్షణాలను పెంచుతుంది. ఇది వారిలోని సృజనాత్మకతను సూర్యుడు శక్తిని పెంచుతుంది. పసుపు ఎరుపు రంగులు శక్తిని ఉత్సాహాన్ని సూచిస్తాయి. ఇది సింహ రాశి వారికి విశ్వాసానికి నాయకత్వ లక్షణాలకు అనుగుణంగా ఉంటాయి. వారిలోని నాయకత్వ లక్షణాలు మరింతగా విభజించాలని వారు ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఆత్మవిశ్వాసంతో ఉండాలని కోరుకుంటూ ఈ రంగు రాఖీలను కట్టవచ్చు.

కన్యా రాశి…

కన్యారాశి వారికి పచ్చ రంగు రాఖీ విశ్లేషణాత్మక శక్తిని క్రమశిక్షణను పెంపొందిస్తుంది. వారిలోని క్రమబద్ధతను సేవా భావాన్ని పెంచి మధుగ్రహాన్ని బలపరుస్తుంది. పచ్చ రంగు వృద్ధిని స్వస్థతను సూచిస్తుంది. ఆరోగ్యం బాగుండాలని వారు తమ లక్ష్యాలను సాధించాలని కోరుకుంటూ పచ్చ రంగు రాఖీలను కట్టడం శుభప్రదం.

తులా రాశి…

తులారాశి వారికి తెలుపు రంగు రాఖీ సామరస్యాన్ని సమతుల్యతను తెస్తుంది. ఇది సహకార భావాన్ని పెంచి చంద్రగ్రహాలను బలపరుస్తుంది. తెలుపు రంగులు సామరస్యాన్ని శాంతిని సూచిస్తుంది. ఇది తులా రాశి వారి సమతుల్య స్వభావానికి అనుగుణంగా ఉంటుంది. వారి జీవితంలో సమతుల్యతను నెలకొనాలని వారి సంబంధాలు బల్పడాలని కోరుకుంటూ ఈ రాఖీని కడతారు.

వృశ్చిక రాశి…

వృశ్చిక రాశి వారికి ఎరుపు రంగు రాఖీ ధైర్యాన్ని పట్టుదలను ఇస్తుంది. ఇది కుజుడిని బలపరుస్తుంది. ఎరుపు రంగు శక్తిని చూచిస్తుంది ఇది వృశ్చిక రాశి వారి తీవ్ర స్వభావానికి అనుగుణంగా ఉంటుంది. వారిలోని ధైర్యం పట్టుదల పెరగాలని వారు ఎల్లప్పుడూ లక్ష్యాలను సాధించాలని సోదరిమణులు కోరుతూ ఈ రాఖీని కడతారు.

ధనస్సు రాశి…

ధనస్సు రాశి వారికి పసుపు రంగు రాఖీ శుభప్రదం. పసుపు సూర్యుని రంగు కాంతి వెచ్చదనం ఆశావాదానికి ప్రతీకరణ. జ్ఞానం ఆధ్యాత్మికత సానుకూల శక్తిని సూచిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పసుపు రంగు కుజ బలాన్ని పెంచుతుంది. కుజుడు ధైర్యం శక్తి ఉత్సాహన్నికి కారకుడు.

Rakhi Purnima : రాఖీ పండుగ రోజు ఏ రాశి వారికి ఏ రంగు రాఖీ కడితే మంచిది…!

మకర రాశి…

మకర రాశి వారికి నీలం రంగు రాఖీ అనుకూలం. ప్రశాంతత స్థిరత్వం వివేకాన్ని సూచిస్తుంది. జ్యోతిష్యం ప్రకారం నీలం రంగు శని గ్రహ ప్రభావాన్ని పెంచి శుభ ఫలితాలను ఇస్తుంది. శని గ్రహం క్రమశిక్షణ కృషి సహనం బాధ్యతాయుత సుభావాన్ని ఇస్తుంది. మకర రాశి వారు కష్టపడి పనిచేసే తత్వం లక్ష్యం వైపు మొండి పట్టుదల కలిగి ఉంటారు. నీలం రంగు రాఖీ ధరించడం వలన వారిలోని లక్షణాలు మరింత బలోపేతమే వారు తమ లక్ష్యాలను సాధించడంలో మరింత ఏకగ్రతత సంకల్పం సహనం కలిగి ఉంటారు.

కుంభ రాశి…

కుంభ రాశి వారు ఆకాశ రంగు నీలం రంగు రాఖీని ధరించడం మంచిది. ఇది స్వేచ్ఛ వ్యక్తిత్వం ఆవిష్కరణ మానవతా దృక్పథాన్ని సూచిస్తుంది. ఇది కూడా శని గ్రహంతో సంబంధం కలిగి ఉంది. కుంభరాశి వారి స్వతంత్రర భావాలు విన్నృత ఆలోచనలు సమాజం పట్ల సేవా దృక్పథం కలిగి ఉంటారు. నీలం రంగు రాఖీని ధరించడం వలన వారిలోని లక్షణాలు మరింత ప్రోత్సహించబడి వారు ప్రత్యేకతను ప్రదర్శించడంలో కొత్త ఆలోచనలను అన్వేషించడంలో మరింతగా కృషి చేస్తారు.

మీన రాశి…

మీన రాశి వారికి పసుపు రంగు రాఖి శుభప్రదం. మీన రాశి వారు సృజనాత్మకత కరుణ దృష్టి అన్వేషణ కలిగి ఉంటారు. పసుపు రంగు కళాత్మక స్వభావాన్ని రూపొందించడమే కాకుండా ఆధ్యాత్మిక అన్వేషణను సూచిస్తుంది. పసుపు కుజ గ్రహని కలిగి ఉండడమే కాకుండా వారిలోని ధైర్యం చొరవ పెంచుతుంది. వారి కలను సహకారం చేసుకోవడానికి శక్తినిస్తుంది.

రాఖీ శుభ సమయం…

ఈ ఏడాది రాఖీ రోజున భద్ర వచ్చింది. భద్ర అనేది పురాణాలలో ఒక చెడు శక్తి. ఈ సమయంలో శుభకార్యాలు చేయకూడదు. ఈసారి భద్ర ఆగస్టు 18 నుంచి 19 మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది. కాబట్టి 12: 30 నిమిషాల తర్వాత రాఖీ కట్టడం మంచిది.1:26 నిమిషాల నుండి 6:25 నిమిషాల వరకు అత్యంత మంచి సమయం. ఈరోజు మొదటి రాఖి దేవుడి దగ్గర పెట్టి తర్వాత కడితే మంచి జరుగుతుంది.

Advertisement
Tandu Ramalingaiah

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Recent Posts

Indian Rupee : చరిత్రలోనే కనిష్టానికి రూపాయి.. డాలర్‌తో పోలిస్తే ₹97కి చేరిన రూపాయి..!

Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…

3 days ago

Ration Card : ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. రేషన్ కార్డు ఉన్నవారికి నేరుగా అకౌంట్లోకి డబ్బులు..!

Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…

3 days ago

SRH vs RCB మ్యాచ్ టికెట్లపై బ్లాక్ మార్కెట్ దందా.. ఇదంతా కోహ్లీ కోసమేనా..?

SRH vs RCB : ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యంత ఆసక్తికర మ్యాచ్‌లలో ఒకటైన Sunrisers Hyderabad (SRH) vs…

3 days ago

Tilak : నుదిటిపై బొట్టు పెట్టుకోవడం వల్ల ఇన్ని లాభాలా..? సైన్స్ & ఆధ్యాత్మిక రహస్యాలు

Tilak : భారతీయ సంస్కృతిలో నుదిటిపై బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం అనేది వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా…

3 days ago

Gods : రాత్రిపూట ఈ దేవతల పేర్లు ప‌లికారో అంతే సంగ‌తి…!

Gods  : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…

3 days ago

Lemon Ginger Tea : రోజూ లెమన్ జింజర్ టీ తాగితే అద్భుత ప్రయోజనాలు..?

Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…

3 days ago

EMI : ఈఎంఐ కట్టకపోతే ఫోన్ లాక్..? ఆర్బీఐ కొత్త రూల్‌పై క్లారిటీ..!

EMI  : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…

4 days ago

Peddi Movie : పెద్ది’ క్లైమాక్స్‌లో భారీ ట్విస్ట్.. చివరి 40 నిమిషాలు మైండ్ బ్లోయింగ్..? బుచ్చిబాబు

Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…

4 days ago

TDP NDA : టీడీపీకి మరో గవర్నర్ పదవి..? చంద్రబాబు నిర్ణయంపై ఆసక్తికర చర్చ..!

TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…

4 days ago

Bhuma Mounika : రాజకీయాల్లోకి మౌనిక రెడ్డి ఎంట్రీ.. అసలు ప్లాన్ ఏంటో బయటపెట్టిన మంచు మనోజ్!

Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…

4 days ago

New Pension : కొత్త పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్.. ఎవరు అర్హులు? పూర్తి మార్గదర్శకాలు ఇవే..!

తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…

4 days ago

Heatwave : భానుడి భగభగ.. 47 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు.. ప్రజలకు IMD హెచ్చరిక

Heatwave  : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…

4 days ago