Money : ధనవంతులయ్యే ముందు మీకు కనిపించే సంకేతాలు ఇవే…!

 Authored By aruna | The Telugu News | Updated on :8 November 2023,11:00 am

ప్రధానాంశాలు:

  •  Money : ధనవంతులయ్యే ముందు మీకు కనిపించే సంకేతాలు ఇవే...!

Money  : తొందరలోనే ధనవంతులయ్యే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి.. ఎలాంటి సంకేతాలను మనం ధనవంతుల అవడానికి ముందు వచ్చేదిగా భావించాలి.. ఈ విషయాలు యొక్క వివరణ మనం పూర్తిగా తెలుసుకుందాం.. భవిష్యత్తులో ఎప్పటికైనా ధనవంతుల అవ్వాలి అనుకుంటే కనుక మనం కచ్చితంగా కొన్ని సంకేతాల ద్వారా ఆ విషయాన్ని తెలుసుకోవచ్చు. ప్రామాణిక గ్రంధాల్లో పేర్కొన్న ప్రకారం ఆ విషయాలు మనకు ఈజీగా అర్థమవుతాయి.. మరి వాటిల్లో మొదటిది చూసుకున్నట్లయితే ఎవరైతే నీటిని పొదుపుగా వాడతారో వారి భవిష్యత్తులో ధనవంతులు అవుతారని ప్రామాణిక గ్రంథాల్లో పేర్కొనబడింది. శ్రీమహావిష్ణువు నారములలో ఉంటాడు. అంటే జలుములు అని అర్థం. శ్రీమహావిష్ణువు జలంలో ఉంటాడు. కాబట్టి ఆయనను నారాయణుడు అనే పేరుతో పిలుస్తారు. అలాగే లక్ష్మీదేవి ఔత్తమ అని పేరు కలిగినటువంటి మనమందరంలో నీళ్ల నుంచి ఉద్భవించిందని పద్మ పురాణంలో చెప్పబడింది. లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి ఇద్దరికీ కూడా నీళ్లు అంటే చాలా ఇష్టం. జల ప్రియులు వాళ్ళు అందుకు ఏ ఇంట్లో అయితే నీళ్లు పొదుపుగా వాడతారో ఏ ఇంట్లో అయితే నీళ్లు వృధాగా ఖర్చు చేయరో ఆ ఇంట్లో లక్ష్మీనారాయణ అనుగ్రహం ఉంటుంది.

వారు భవిష్యత్తులో కచ్చితంగా ధనవంతులవుతారని ప్రామాణిక గ్రంథాల్లో పేర్కొన్నారు. ఇక ఏ వ్యక్తి అయితే చిటికెన వేలు బొటనవేలు సమానంగా ఉంటాయో.. వారు కచ్చితంగా భవిష్యత్తులో ధనవంతులుగా మారుతారని సాముద్రిక గ్రంథాల్లో తెలియజేయబడింది. ఇక అలాగే ముఖసాముద్రికం ప్రకారం కనుబొమ్మలు ఎవరికైతే దట్టంగా ఉంటాయో వారు భవిష్యత్తులో ధనవంతులవుతారు. నవగ్రహ ప్రదక్షిణలు చేసేవారు ఎప్పటికైనా ధనవంతులుగా మారి తీరుతారు. కాబట్టి భవిష్యత్తులో ధనవంతుల అవ్వాలంటే ఈ రోజు దేవాలయానికి వెళ్లి నవగ్రహ ప్రదక్షణ చేయాలి. దానగుణం అనేది జాతక దోషాలు గ్రహ దోషాలు పూర్వజన్మ కర్మ ఫలితాలు అన్నిటిని కూడా పటా పంచలు చేస్తాయి. కాబట్టి ఎక్కువగా దానాలు ఇచ్చేటటువంటి వారు ఎవరైనా సరే భవిష్యత్తులో ధనవంతులుగా మారుతారు. అలాగే సోమవారం పుట్టిన వారు శుక్రవారం రోజున పుట్టిన వారు వ్యాపారంలో బాగా సక్సెస్ సాధించి ధనవంతులుగా మారతారని సంఖ్యా శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది. అలాగే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఈ విధంగా చేయండి.

వెల్లుల్లి రెబ్బలను ఇంట్లో ఉన్నటువంటి హాల్లో అన్ని మూలల్లో ఉంచి ఉదయం నిద్ర లేచాక వాటిని బయట పారేయండి.. ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తి మొత్తాన్ని లాకుంటయి.. దానివల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అలాగే వ్యాపారం చేసేవారు ఎవరైనా మీరు ఎలాంటి వ్యాపారం చేస్తున్న ప్రతి నెలలో కూడా లాస్ట్ డేట్ అంటే ఆఖరి తేదీ రోజు వ్యాపారం బాగా సక్సెస్ అవటం కోసం ఎండిపోయిన ఉల్లిపాయ తొక్కలు తీసుకుని వాటిని ఎంట్రెన్స్ దగ్గర కాల్చి పారేయండి. ఆ బూడిద బయట పారేసేయండి. ఏ బిజినెస్ చేస్తున్నా సరే ప్రతి నెలలో లాస్ట్ డేట్ రోజు బిజినెస్ క్లోజ్ చేసే టైంలో ఎండిపోయిన ఉల్లిపాయ తొక్కలు తీసుకోవాలి.. ఇలా చేస్తే ఆ వ్యాపార స్థలానికి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుందని వ్యాపారం బాగా సబ్సిడీ అవుతుందని తాంత్రిక రహస్య పరిహార శాస్త్రంలో పేర్కొన్నారు…

Also read

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి