
Results for Naivadyam to god
దేవుడు.. పూజలు.. ఒక్కొక్కరు ఒక్కోరకంగా దేవుడిని ఆరాధిస్తారు. తమ శక్తికొలది భక్తితో దేవుడిని ఆరాధించడం చేస్తారు. పూర్వకాలం నుంచి మనం దీనికి సంబంధించి అనేక కథనాలు వింటూనే ఉన్నాయి. పురాణాలలో, ఇతిహాసాలలో కూడా వీటికి సంబంధించిన గాథలు అనేక ఉన్నాయి. ఉదాహరణకు కన్నప్ప తను తినే మాంసాహారాన్ని దేవుడికి సమర్పించాడు. శబరి తను తినే పండ్లను రామచంద్రడికి సమర్పించంది. ఇలా ఒక్కో భక్తుడు ఒక్కొ రకం. అయితే ఆయా నైవేద్యాల సమర్పణ వల్ల కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి. వీటిలో సందేహం అక్కర్లేదు. ఉండాల్సింది భక్తి, శ్రద్ధ. అయితే ఏ నైవేద్యాల వల్ల ఏం ఫలితమో తెలుసుకుందాం….
మొదటగా అందరికీ ఎక్కువగా తక్కువ ఖర్చులో దొరికే జామపండు నైవేద్యం ఫలితం తెలుసుకుందాం…
జామపండును వినాయకుడికి నైవేద్యంగా సమర్పిస్తే పొట్టకు సంబంధించిన సమస్యలు అంటే.. గ్యాస్ట్రిక్, ఉదర సంబంధిత వ్యాధులు నయమవుతాయి. దేవీ అంటే అమ్మవారికి నైవేద్యంగా పెడితే చక్కెర వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతారు. అదేవిధంగా సంతాన ప్రాప్తి, దాంపత్యంలో వచ్చే కలహాలు తొలగుతాయి. సంఘంలో మంచి పలుకుబడి. గణపతికి పంచామృత అభిషేకం చేసి జామపండ్లను నైవేద్యంగా పెడితే వ్యాపారాలు చాలా లాభసాటిగా సాగిపోతాయి.
Results for Naivadyam to god
కొబ్బరికాయ నైవేద్యం పెట్టడం వల్ల పనులు సులభంగా కావడానికి. అనుకున్న రీతిలో సాఫీగా పనులు సాగిపోవడానికి, కార్యాలయాలలో పై అధికారుల నుంచి ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు రాకుండా ఉండటానికి కొబ్బరిక నైవేద్యం పెట్టాలి. వేసవిలో ఎక్కువగా దొరికే ఫల రాజు అయిన మామిడి పండు నైవేద్యంగా సమర్పిస్తే బకాయిలు వసూలు అవుతాయి. వినాయకుడికి మామిడి పండు సమర్పిస్తే ఇండ్లు కట్టుకునే వారికి గృహ నిర్మాణ సమస్యలు తీరుతాయి. బకాయిలు చెల్లించడానికి కావాల్సిన సొమ్ము సకాలంలో వస్తుంది. లక్ష్మీగణపతిహోమం చేయించి మామిడి పండును పూర్ణాహుతిలో సమర్పిస్తే చిట్టీల వ్యవహారాలు చక్కబడతాయి. పాత బకాయిలు వసూలు అవుతాయి. ఇష్ట దైవానికి తేనే, మామిడి రసాలతో నైవేద్యం సమర్పించి దాన్ని అందరికీ పంచి మీరు కూడా స్వీకరిస్తే విశేష ఫలితాలు వస్తాయి.
తక్కువ ఖర్చులో దొరికే మరో పండు కమలా పండ్లు దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తే చాలాకాలంగా పెండింగ్లో ఉన్న పనులు నెరవేరుతాయి. నమ్మకమైన వ్యక్తులు ముందుకొచ్చి సహాయపడుతారు. అన్నింటా విజయం సాధిస్తారు.
Results for Naivadyam to god
సపోటా పండు వివాహాది శుభకార్యాల విషయంలో ఎదురయ్యే ఆటంకాలు పూర్తిగా తొలగిపోతాయి. వివాహ సంబంధాలు ఖాయమవుతాయి. వివాహం కానివారికి తొందరడా వివాహం నిశ్చయం అవుతుంది. నేరేడు పండును నైవేద్యంగా సమర్పించే దాన్ని స్వీకరిస్తే నీరసం, నిరుత్సాహం దూరం అవుతాయి. శనీశ్వరుడికి ప్రసాదంగా పెడితే వెన్ను, నడుం, మోకాళ్ల నొలు మాయమవుతాయి. విష్ణువు, శివుడికి ఈ పండ్ల నైవేద్యం మంచి ఫలితాలను ఇస్తుంది. ద్రాక్షపండ్లు దేవుడికి ప్రసాదంగా పెడితే. ఆనందం, సంతోషం లభిస్తాయి. ఈ విధంగా ఆయా రకాల పండ్లను భక్తితో శ్రద్ధతో ఆయా దేవతలకు సమర్పిస్తే సకల శుభాలు కలుగుతాయి. పెట్టిన పండును లేదా పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించిన తర్వాత తప్పక ప్రసాదంగా స్వీకరించాలి. అంతేకాదండోయో దాన్ని పదిమందికి వితరణ చేయాలి. వారిలో భగవంతుడిని చూడాలి అప్పుడే సంపూర్ణ ఫలితం వస్తుంది.
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
This website uses cookies.