
Results for Naivadyam to god
దేవుడు.. పూజలు.. ఒక్కొక్కరు ఒక్కోరకంగా దేవుడిని ఆరాధిస్తారు. తమ శక్తికొలది భక్తితో దేవుడిని ఆరాధించడం చేస్తారు. పూర్వకాలం నుంచి మనం దీనికి సంబంధించి అనేక కథనాలు వింటూనే ఉన్నాయి. పురాణాలలో, ఇతిహాసాలలో కూడా వీటికి సంబంధించిన గాథలు అనేక ఉన్నాయి. ఉదాహరణకు కన్నప్ప తను తినే మాంసాహారాన్ని దేవుడికి సమర్పించాడు. శబరి తను తినే పండ్లను రామచంద్రడికి సమర్పించంది. ఇలా ఒక్కో భక్తుడు ఒక్కొ రకం. అయితే ఆయా నైవేద్యాల సమర్పణ వల్ల కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి. వీటిలో సందేహం అక్కర్లేదు. ఉండాల్సింది భక్తి, శ్రద్ధ. అయితే ఏ నైవేద్యాల వల్ల ఏం ఫలితమో తెలుసుకుందాం….
మొదటగా అందరికీ ఎక్కువగా తక్కువ ఖర్చులో దొరికే జామపండు నైవేద్యం ఫలితం తెలుసుకుందాం…
జామపండును వినాయకుడికి నైవేద్యంగా సమర్పిస్తే పొట్టకు సంబంధించిన సమస్యలు అంటే.. గ్యాస్ట్రిక్, ఉదర సంబంధిత వ్యాధులు నయమవుతాయి. దేవీ అంటే అమ్మవారికి నైవేద్యంగా పెడితే చక్కెర వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతారు. అదేవిధంగా సంతాన ప్రాప్తి, దాంపత్యంలో వచ్చే కలహాలు తొలగుతాయి. సంఘంలో మంచి పలుకుబడి. గణపతికి పంచామృత అభిషేకం చేసి జామపండ్లను నైవేద్యంగా పెడితే వ్యాపారాలు చాలా లాభసాటిగా సాగిపోతాయి.
Results for Naivadyam to god
కొబ్బరికాయ నైవేద్యం పెట్టడం వల్ల పనులు సులభంగా కావడానికి. అనుకున్న రీతిలో సాఫీగా పనులు సాగిపోవడానికి, కార్యాలయాలలో పై అధికారుల నుంచి ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు రాకుండా ఉండటానికి కొబ్బరిక నైవేద్యం పెట్టాలి. వేసవిలో ఎక్కువగా దొరికే ఫల రాజు అయిన మామిడి పండు నైవేద్యంగా సమర్పిస్తే బకాయిలు వసూలు అవుతాయి. వినాయకుడికి మామిడి పండు సమర్పిస్తే ఇండ్లు కట్టుకునే వారికి గృహ నిర్మాణ సమస్యలు తీరుతాయి. బకాయిలు చెల్లించడానికి కావాల్సిన సొమ్ము సకాలంలో వస్తుంది. లక్ష్మీగణపతిహోమం చేయించి మామిడి పండును పూర్ణాహుతిలో సమర్పిస్తే చిట్టీల వ్యవహారాలు చక్కబడతాయి. పాత బకాయిలు వసూలు అవుతాయి. ఇష్ట దైవానికి తేనే, మామిడి రసాలతో నైవేద్యం సమర్పించి దాన్ని అందరికీ పంచి మీరు కూడా స్వీకరిస్తే విశేష ఫలితాలు వస్తాయి.
తక్కువ ఖర్చులో దొరికే మరో పండు కమలా పండ్లు దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తే చాలాకాలంగా పెండింగ్లో ఉన్న పనులు నెరవేరుతాయి. నమ్మకమైన వ్యక్తులు ముందుకొచ్చి సహాయపడుతారు. అన్నింటా విజయం సాధిస్తారు.
Results for Naivadyam to god
సపోటా పండు వివాహాది శుభకార్యాల విషయంలో ఎదురయ్యే ఆటంకాలు పూర్తిగా తొలగిపోతాయి. వివాహ సంబంధాలు ఖాయమవుతాయి. వివాహం కానివారికి తొందరడా వివాహం నిశ్చయం అవుతుంది. నేరేడు పండును నైవేద్యంగా సమర్పించే దాన్ని స్వీకరిస్తే నీరసం, నిరుత్సాహం దూరం అవుతాయి. శనీశ్వరుడికి ప్రసాదంగా పెడితే వెన్ను, నడుం, మోకాళ్ల నొలు మాయమవుతాయి. విష్ణువు, శివుడికి ఈ పండ్ల నైవేద్యం మంచి ఫలితాలను ఇస్తుంది. ద్రాక్షపండ్లు దేవుడికి ప్రసాదంగా పెడితే. ఆనందం, సంతోషం లభిస్తాయి. ఈ విధంగా ఆయా రకాల పండ్లను భక్తితో శ్రద్ధతో ఆయా దేవతలకు సమర్పిస్తే సకల శుభాలు కలుగుతాయి. పెట్టిన పండును లేదా పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించిన తర్వాత తప్పక ప్రసాదంగా స్వీకరించాలి. అంతేకాదండోయో దాన్ని పదిమందికి వితరణ చేయాలి. వారిలో భగవంతుడిని చూడాలి అప్పుడే సంపూర్ణ ఫలితం వస్తుంది.
Hydroponics Farming : వ్యవసాయం అనగానే ఎకరాల కొద్దీ భూమి, దానికి తగ్గట్లు మట్టి, ట్రాక్టర్లు, ఎరువులు.. ఇవే మనకు…
Director Raghavendra Rao : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో శతాధిక చిత్రాల దర్శకుడిగా వెలుగొందుతున్న కె. రాఘవేంద్రరావు, తాజాగా ఒక…
New Changes : భారతదేశంలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏప్రిల్ 1, 2026 నుంచి పలు…
Gold Silver Rate 30 March 2026 : భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
Karthika Deepam 2 March 30th 2026 Episode : స్టార్ మా ఛానెల్లో ప్రసారం అవుతూ, తెలుగు బుల్లితెర…
Cold Water : వేసవి కాలంలో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి మనం చేసే మొదటి పని ఫ్రిజ్లోని…
Peanuts : పేదవాడి బాదంగా పిలువబడే వేరుశెనగ పప్పులు కేవలం రుచికరమైన చిరుతిండి మాత్రమే కాదు, ఇవి గుండె ఆరోగ్యానికి…
Vastu Plants : మన నివాస స్థలంలో ఉండే శక్తి మన జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వాస్తు శాస్త్రం…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఓటు షేర్ అంశం హాట్ టాపిక్గా మారింది. గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని…
Tomahawk : అమెరికా రక్షణ రంగంలో తోమహాక్ క్షిపణులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దశాబ్దాలుగా శత్రువుల గుండెల్లో నిద్రపోతున్న…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.…
Raghava Mining : తెలంగాణ శాసనసభ వేదికగా రాఘవ మైనింగ్స్ వ్యవహారం ఒక పెద్ద రాజకీయ దుమారాన్నే రేపింది. సభలో…
This website uses cookies.