Revanth Reddy : కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మరోసారి టీఆర్ఎస్ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు. కరోనా సెకండ్ వేవ్ ను ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటూ ఆయన విమర్శించారు. ఆయన తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం కావాలని.. కరోనా కేసులను తగ్గించి చూపిస్తోంది. అందుకే రాష్ట్రానికి రావాల్సిన వ్యాక్సిన్లు, మెడిసిన్లను కేంద్రం ఎక్కువ మొత్తంలో కాకుండా.. తక్కువగా పంపుతోంది. అసలు.. కరోనా వ్యాక్సిన్ తయారయ్యేదే తెలంగాణలో. కానీ.. తెలంగాణలోనే కరోనా వ్యాక్సిన్ షార్టేజ్ ఉంది. తెలంగాణలో తయారవుతున్నప్పుడు.. తెలంగాణ అవసరం తీరకుండా… బయటికి ఎలా పంపిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్లపై సీఎం కేసీఆర్ ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించడం లేదు. కరోనా వ్యాక్సిన్ ను తయారు చేసేదే రెండు కంపెనీలు. మరే ఇతర కంపెనీలకు అనుమతి ఇవ్వలేదు. మరి.. రెండు కంపెనీలే వ్యాక్సిన్లను తయారు చేస్తుంటే.. ఎందుకు గ్లోబల్ టెండర్లను పిలుస్తున్నారు.. అంటూ రేవంత్ రెడ్డి Revanth Reddy ప్రశ్నించారు.
తెలంగాణలో ఉన్న కార్పొరేట్ ఆసుపత్రులన్నీ కేసీఆర్ బంధువులవే. అటువంటప్పుడు కరోనాను ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చుతారు. అందుకే చేర్చడం లేదు. అలాగే… వ్యాక్సిన్ కొనుగోలుపై, కరోనా మందులపై తెలంగాణ ప్రభుత్వం కమిటీ వేసింది. ఈ కమిటీలో ఉన్న సభ్యులు మరెవరో కాదు.. మంత్రి కేటీఆర్, ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్, సీఎంవో అధికారి రాజశేఖర్ రెడ్డి. వీళ్లంతా దాంట్లో సభ్యులుగా ఉన్నారు. ఇక.. మంత్రి కేటీఆర్, ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్ అయితే.. ఎక్కడ చూసినా ఉండారు కానీ.. కరోనాను నియంత్రించడంలో మాత్రం శూన్యం. కొనుగోళ్లు అంటే చాలు.. కేటీఆర్ వచ్చేస్తారు. అంతే… కేటాయింపులు, కొనుగోళ్లు అంటే ముందుండేది ఇద్దరే ఇద్దరు.. ఒకరు కేటీఆర్, మరొకరు హరీశ్ రావు. అసలు.. దోపిడీ కోసం, దోచుకోవడం కోసం వెసులుబాటు ఉన్న ఏ మంత్రిత్వ శాఖ అయినా కేసీఆర్ కుటుంబం దగ్గరే ఉంటుంది. అందుకే కదా.. ఈటలను తొలగించింది.. ఈటలను తొలగించడానికి కారణం కూడా అదే.. అంటూ రేవంత్ రెడ్డి Revanth Reddy ఎద్దేవా చేశారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.