
Srikalahasti Temple : శ్రీకాళహస్తి ఆలయంలో రాహుకేతుల పూజ సరికొత్త రికార్డు... ఒక్కరోజులో కోట్ల ఆదాయం...!
Srikalahasti Temple : హిందూ పురాణాలలో శ్రీకాళహస్తి ఆలయానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే పంచభూత క్షేత్రాల్లో వాయు క్షేత్రం శ్రీకాళ హస్తీశ్వర క్షేత్రం. లింగానికెదురుగా ఉండే దీపం లింగము నుంచి వచ్చే గాలికి రెపరెపలాడడం ఇక్కడ ప్రత్యేకత. అదేవిధంగా శ్రీకాళహస్తిలో శివుడు రాహుకేతువులు , జ్ఞాన ప్రసూనాంబికలు వెలిసినట్లు భక్తులు భావిస్తారు. అలాగే ఇక్కడ రాహు కేతు దోష నివారణ పూజకు ప్రసిద్ది చెందినది. దీంతో చాలామంది జాతకాలలో రాహు కేతు దోషా నివారణ పూజ కోసం భక్తులు భారీ సంఖ్యలో ఇక్కడికి వస్తారు. తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆషాడం మాసం ఆదివారం అమావాస్య కావడంతో భక్తులు రాహుకేతు పూజలు నిర్వహించేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు భారీ సంఖ్యలో రావడంతో శ్రీకాళహస్తి రికార్డులను బద్దలు కొట్టింది. ఆదివారం అమావాస్య కావడంతో అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయానికి భారీగా తరలివచ్చారని ఆలయ అధికారి ఈ సందర్భంగా తెలియజేశారు.
అయితే ఆదివారం రోజు ఆలయంలో రాహుకేతు పూజల్లో 9,168 మంది భక్తులు పాల్గొన్నారు. అలాగే గత ఏడాది జూన్ 18న 7,597 మంది రాహుకేతు పూజల్లో పాల్గొని రికార్డును సృష్టించారు. అయితే ఇప్పుడు ఆ రికార్డు ని బీట్ చేసి కొత్త రికార్డు సృష్టించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవాలయం ఐకానోగ్రఫీ ద్వారా వచ్చింది. ఇక్కడ 5 తలల పాము ప్రసిద్ధి. దీనిని కేతువు అంటారు. కేతువు శివుని తలపై అలంకరించబడి ఉంటుంది. ఒక తల పాము రాహువు అంటారు. అమ్మవారు నడుమును చుట్టి ఉంటుంది. అలాగే రాహు కేతు పూజలో శివపార్వతులకు పూజ చేసే అత్యంత ఫలితం ఉంటుంది.
జాతకంలో దోషం లేదా ప్రతికూల ప్రభావాలను రాహుకేతుల పూజ ద్వారా తగ్గించగలమని భక్తులు నమ్మకం. రాహుకాలం పవిత్రమైనదిగా భావిస్తారు. దీంతో ఆ సమయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది.
Srikalahasti Temple : శ్రీకాళహస్తి ఆలయంలో రాహుకేతుల పూజ సరికొత్త రికార్డు… ఒక్కరోజులో కోట్ల ఆదాయం…!
రాహుకేతు పూజల కోసం దాదాపు 5,183 మంది భక్తులు రూ. 500 టిక్కెట్లు కొనుగోలు చేశారు. అలాగే 2,288 మంది భక్తులు రూ. 750 టిక్కెట్ల కొనుగోలు చేశారని దేవస్థాన అధికారులు తెలపడం జరిగింది. అదేవిధంగా రూ 1,500ల టికెట్ ను 933 మంది రూ. 2,500 టికెట్ ధర 610 మంది కొనుగోలు చేశారు. అలాగే 154 మంది భక్తులు రూ. 5,000 టిక్కెట్ల ను కొనుగోలు చేసి రాహు కేతు పూజ చేసినట్లు వెల్లడించారు. రాహుకేతు పూజలతో పాటు శీఘ్ర దర్శనం ప్రత్యేక ప్రవేశం కోసం 8,162 టిక్కెట్ల అమ్మకం జరిగిందని వెల్లడించింది. మరో వైపు ఆదివారం ఒక్క రోజే 29,505 వివిధ ప్రసాదాల ప్యాకెట్ల విక్రయం జరిగింది. దీంతో కాళహస్తి ఆలయానికి ఒక్కరోజులో కోటి రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. ఇక్కడ స్వయం భూలింగముగా వెలసిన శివలింగాన్ని సాలెపురుగు, పాము, ఏనుగు అర్చించడమే కాదు. తమ భక్తీ నిరుపించుకోవడంలో పోటాపోటీగా నిలిచి చివరకు మోక్షాన్ని పొందినట్లు . అప్పటి నుంచి ఇక్కడ ఉన్న స్వామిని కాళహస్తీశ్వరుడు అని పిలుస్తారని పురాణం లో చెప్పబడింది. శ్రీ అనగా సాలెపురుగు, కాళము అనగా పాము, హస్తి అనగా ఏనుగు. అంతేకాదు భక్తిలోని గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిన కన్నప్ప కూడా ఇక్కడ ఉన్న శివయ్యనే పుజించాడని నమ్మకం.
Foods High in Gelatin : ఈ రోజుల్లో చాలామంది చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు, చర్మంపై ముడతలు వంటి…
Maha Shivratri : ఫిబ్రవరి 15, 2026న రానున్న మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా, శివాలయ సందర్శనలో భక్తులు పాటించాల్సిన…
Today Horoscope 15th February 2026 : వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ రోజు (ఆదివారం, 15 ఫిబ్రవరి 2026)…
T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ICC T20 World Cup 2026లో సౌతాఫ్రికా తన…
Telangana : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేపుతున్నాయి. సుమారు 30కి పైగా మున్సిపాలిటీల్లో…
Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ కలిగిన యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. జబర్దస్త్ షో ద్వారా…
Shivajyothi : ప్రముఖ యాంకర్ శివజ్యోతి తల్లి అయ్యారు. తీన్మార్ వార్తలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శివజ్యోతి,…
Womens : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Andhra Pradesh Government 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి…
This website uses cookies.