prabhas : కేరళలోని వయనాడ్ వరదల కారణంగా ఎంతో మంది నిరాశ్రయులు అయిన విషయం తెలిసిందే. ఆ భీభత్సం దేశాన్ని మొత్తాన్ని కలచివేసింది. కొండ చరియలు విరిగిపడిన ఘటనలో వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవటం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరి హృదయాలను ద్రవించేలా చేసింది. జులై 26వ తేదీన వయనాడ్ లో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటనలో ఇప్పటివరకు 335 మందికిపైగా ప్రాణాలను కోల్పోయినట్టు తెలుస్తుండగా, వందలాది మంది ప్రజలు గాయపడ్డారు. ప్రస్తుతం అక్కడ ఇంకా సహాయకచర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
కేరళలో జరిగిన ప్రకృతి ప్రకోపం సృష్టించిన విషాదం ఎన్నో జీవితాలను చిద్రం చేసింది. బురద తొలగిస్తున్నకొద్దీ మృతదేహాలు బయటపడుతున్న హృదయ విదారక పరిస్థితి ఉంది. అయితే కేరళ వయనాడ్ బాధితుల కోసం దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి తమవంతుగా సహాయాన్ని సెలబ్రిటీలు అందిస్తున్నారు. బాధిత కుటుంబాలకు సహాయాన్ని అందించడానికి సినీ ప్రముఖులు ముందు వరుసలో నిలిచారు. ఇప్పటికే కేరళ వయనాడ్ బాధితులకు రష్మిక మందన్న, సూర్య, జ్యోతిక, సహా పలువురు ప్రముఖులు కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి తమ విరాళాన్ని అందించారు. సూర్య, జ్యోతిక, కార్తీ లు కలిసి వయనాడ్ బాధిత కుటుంబాలకి 50 లక్షల రూపాయిల ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు.
చిరంజీవి, రాం చరణ్, అల్లు అర్జున్ కూడా తమ వంతుగా సహాయం అందించారు. అల్లు అర్జున్ వయనాడ్ బాధిత కుటుంబాలకు 25 లక్షలు విరాళం ఇవ్వగా, చిరంజీవి, రాం చరణ్ ఇద్దరూ కలిపి కోటి రూపాయలు విరాళం అందించారు.ఇక వీరందరికంటే ప్రభాస్ దాతృత్వం లో తన గొప్ప మనసు చాటుకున్నారు. ప్రభాస్ వయనాడ్ బాధితుల కోసం ఏకంగా 2 కోట్ల రూపాయల భారీ విరాళం అందించారు. ఈ డబ్బును సీఎం సహాయ నిధికి పంపించారు డార్లింగ్ ప్రభాస్. ప్రభాస్ గొప్ప మనసును ప్రభాస్ ఫ్యాన్స్ తెగ మెచ్చుకుంటున్నారు. ప్రభాస్ మంచి మనసుకి ఇంత కన్నా గొప్ప ఉదాహరణ ఏం కావాలని ఫ్యాన్స్ అంటున్నారు.
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
Eating Snails : నత్తల గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలిసే ఉంటుంది. అయితే కొన్నిచోట్ల నత్తల కూరను తినడానికి చాలా…
This website uses cookies.