
prabhas : దటీజ్ ప్రభాస్.. వయానాడ్ బాధితుల కోసం ఏకంగా రూ.2 కోట్ల విరాళం
prabhas : కేరళలోని వయనాడ్ వరదల కారణంగా ఎంతో మంది నిరాశ్రయులు అయిన విషయం తెలిసిందే. ఆ భీభత్సం దేశాన్ని మొత్తాన్ని కలచివేసింది. కొండ చరియలు విరిగిపడిన ఘటనలో వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవటం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరి హృదయాలను ద్రవించేలా చేసింది. జులై 26వ తేదీన వయనాడ్ లో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటనలో ఇప్పటివరకు 335 మందికిపైగా ప్రాణాలను కోల్పోయినట్టు తెలుస్తుండగా, వందలాది మంది ప్రజలు గాయపడ్డారు. ప్రస్తుతం అక్కడ ఇంకా సహాయకచర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
కేరళలో జరిగిన ప్రకృతి ప్రకోపం సృష్టించిన విషాదం ఎన్నో జీవితాలను చిద్రం చేసింది. బురద తొలగిస్తున్నకొద్దీ మృతదేహాలు బయటపడుతున్న హృదయ విదారక పరిస్థితి ఉంది. అయితే కేరళ వయనాడ్ బాధితుల కోసం దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి తమవంతుగా సహాయాన్ని సెలబ్రిటీలు అందిస్తున్నారు. బాధిత కుటుంబాలకు సహాయాన్ని అందించడానికి సినీ ప్రముఖులు ముందు వరుసలో నిలిచారు. ఇప్పటికే కేరళ వయనాడ్ బాధితులకు రష్మిక మందన్న, సూర్య, జ్యోతిక, సహా పలువురు ప్రముఖులు కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి తమ విరాళాన్ని అందించారు. సూర్య, జ్యోతిక, కార్తీ లు కలిసి వయనాడ్ బాధిత కుటుంబాలకి 50 లక్షల రూపాయిల ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు.
prabhas : దటీజ్ ప్రభాస్.. వయానాడ్ బాధితుల కోసం ఏకంగా రూ.2 కోట్ల విరాళం
చిరంజీవి, రాం చరణ్, అల్లు అర్జున్ కూడా తమ వంతుగా సహాయం అందించారు. అల్లు అర్జున్ వయనాడ్ బాధిత కుటుంబాలకు 25 లక్షలు విరాళం ఇవ్వగా, చిరంజీవి, రాం చరణ్ ఇద్దరూ కలిపి కోటి రూపాయలు విరాళం అందించారు.ఇక వీరందరికంటే ప్రభాస్ దాతృత్వం లో తన గొప్ప మనసు చాటుకున్నారు. ప్రభాస్ వయనాడ్ బాధితుల కోసం ఏకంగా 2 కోట్ల రూపాయల భారీ విరాళం అందించారు. ఈ డబ్బును సీఎం సహాయ నిధికి పంపించారు డార్లింగ్ ప్రభాస్. ప్రభాస్ గొప్ప మనసును ప్రభాస్ ఫ్యాన్స్ తెగ మెచ్చుకుంటున్నారు. ప్రభాస్ మంచి మనసుకి ఇంత కన్నా గొప్ప ఉదాహరణ ఏం కావాలని ఫ్యాన్స్ అంటున్నారు.
pakistan : టీ20 వరల్డ్ కప్ india vs pakistan t20 world cup 2026 ప్రారంభానికి ఇంకా రెండు…
Municipal Elections : తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…
Union Budget 2026 : దేశ ఆర్థిక దిశను నిర్దేశించే కేంద్ర బడ్జెట్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 1న…
Key Survey : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం తన రెండున్నర ఏళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న తరుణంలో,…
Bank Holidays : జనవరి 27న దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో లావాదేవీలకు అంతరాయం ఏర్పడింది. ఈరోజు కూడా బ్యాంకులు…
Vizianagaram: మానవత్వ విలువలు రోజురోజుకు క్షీణిస్తున్నాయనే వాదనకు విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన సాక్ష్యంగా నిలుస్తోంది. కేవలం…
Samantha : సినిమా రంగంలో నటీమణులు పెళ్లి తర్వాత తమ ఇంటి పేరును మార్చుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. గతంలో…
Roja : చిత్తూరు జిల్లా నగరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన పర్యటనపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే…
This website uses cookies.