Lakshmis Kataksha : సౌర మాసం ప్రకారం హిందూ క్యాలెండర్ ను అనుసరించి శ్రావణం 5వ నెలలో వస్తుంది. ఈ మాసం ఎంతో పవిత్రమైనది. ఆధ్యాత్మికంగా విశిష్టం కలిగిన శ్రావణం శివారాధనకు కూడా శ్రేష్టమైనది. ఈ నెలలో సూర్యుడు సింహరాశి లోకి ప్రవేశిస్తాడు. హిందువులు ఎంతో పవిత్రంగా ఈ నెలలో వ్రతాలు నోములు పూజలు చేస్తారు. అయితే శ్రావణమాసంలో ఎటువంటి పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుంది…? ఏ పూజలు చేస్తే మన కోరికలు నెరవేరుతాయి..? అనేది ఇప్పుడు మన వివరంగాా తెలుసుకుందాం. శ్రావణ సోమవారం వ్రతం సందర్భంగా ఉపవాస దీక్షలు చేపడతారు. మంగళవారం మంగళ గౌరీ కి కూడా విశిష్టత ఉంది. శ్రావణం శివుని ఆరాధనకు అనుకూలమైనది. శివుడుని పూజించడం వలన వివాహంలో ఏర్పడిన ఆటంకాలు అన్ని తొలగి చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారని వేదాలు పురాణాలు చెబుతున్నాయి. శివపార్వతుల అనుగ్రహం శ్రావణంలో భక్తులకు లభిస్తుంది.
భక్తులు తమ తప్పులను మన్నించమంటూ మనస్ఫూర్తిగా వేడుకుంటే జీవితంలో ఎదురయ్యే కష్టాల నుంచి బయటపడతారు. ప్రతికూల వాతావరణం కూడా అనుకూలంగా మారుతుంది. అదృష్టం కలిసి వస్తుంది. సూర్యోదయాని కంటే ముందే నిద్రలేచి స్నానం అనంతరం శివాలయాలను దర్శించాలి. పాలు జలంతో శివుడికి అభిషేకం చేసి,ఓం నమశ్శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించాలి. శ్రావణమాసంలో సిద్ధ శివలింగాన్ని ఇంట్లో ఉంచుకొని అభిషేకం చేయాలి. చల్లటి నీళ్లతో శుద్ధి చేసి పాలతో అభిషేకం చెయ్యాలి. బిల్వపత్రాలను విభూతిని సమర్పించాలి. దగ్గర లో ఉన్న చెరువులకు నదులకు వెళ్లి చేపలకు ఆహారాన్ని వెయ్యాలి. గోధుమ పిండితో చేసిన ఆహారాన్ని వాటికి తినిపిస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. చేపలకు ఆహారాన్ని ఇవ్వడం అంటే శివుడికి అందించినట్లే మహా మృత్యుంజయ మంత్రం వలన అనారోగ్యం సమస్యలు తొలగిపోతాయి. దీన్ని రోజుకి 108 సార్లు జపించాలి. మహా మృత్యుంజయ హోమం కూడా శ్రావణ సోమవారం నాడు నిర్వహిస్తే మంచి ఫలితం ఉంటుంది. వైవాహిక జీవితంలో ఆటంకాలు పెళ్ళి సమస్యలు ఎదురుకుంటూ ఉంటే కనుక కుంకుమపువ్వుతో కలిపిన పాలను శివుడికి అభిషేకం చేయాలి.
శివపార్వతుల అనుగ్రహం పొంది వ్యక్తిగత జీవితాలలో ఏర్పడిన అడ్డంకులు కూడా తొలగిపోతాయి. ఆవులు గేదెలకు పచ్చ కట్టి తినిపిస్తే శ్రేయస్సు కలుగుతుంది. విజయాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఇంట్లో మానసిక ప్రశాంతత ఐశ్వర్యం లభించాలంటే రోజు పేదలకు అన్నదానం చేయాలి. దీనివల్లపూర్వికులు ఆత్మకు శాంతి కలుగుతుంది. 21 బిల్వపత్రాలపై చందనంతో ఓం నమశ్శివాయ అని రాసి శివలింగానికి అభిషేకం చేస్తే మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి. శ్రావణంలో గోమూత్రంతో రోజు ఇంటిని శుద్ధి చేస్తే అనుగ్రహంతో పాటు విజయము దక్కుతుంది. శ్రావణ సోమవారం రోజున శివుడికి రుద్రాభిషేకం చేయడం ద్వారా కుజదోష ప్రభావం తగ్గుతుంది. కొన్ని పనులు చేయడం వలన ప్రతికూలతలు ఎదురవుతాయి. ఇంట్లో అశాంతి నెలకొంటుంది. అలాగే మాంసాహారానికి మద్యానికి దూరంగా ఉండాలి. ఈ నెల రోజులు కూడా శాఖాహారమే తీసుకోవాలి. శ్రావణంలో పాములను చంపితే దోషం పట్టుకుంటుంది. పాములు శివుడికి ప్రియమైనవిగా భావిస్తారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.