Chiranjeevi : గణతంత్ర దినోత్సవ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ విభూషణ్, పద్మ భూషణ్ అను ప్రతిష్టాత్మక అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. వివిధ రంగాలలో అందించిన సేవలకు గాను ఈ గౌరవం లభిస్తుంది. అయితే తాజాగా ప్రకటించిన అవార్డులలో దేశంలోని అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ తెలుగు రాష్ట్రాలలో ఇద్దరిని వరించింది. మెగాస్టార్ చిరంజీవి తో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు అవార్డును ప్రకటించింది కేంద్రం. దీంతో వీరిద్దరికి సోషల్ మీడియా వేదికగా సినీ రాజకీయ ప్రముఖుల నుంచి అభినందనలు వెలువెత్తుతున్నాయి.
అయితే ఇప్పటివరకు తెలుగు సినీ పరిశ్రమలో పద్మ విభూషణ్ కేవలం ఒక్క హీరోకు మాత్రమే వచ్చింది. ఆ తర్వాత ఈ అవార్డు అందుకునే హీరో మెగాస్టార్ చిరంజీవి. అయితే చిరంజీవికి ముందు పద్మ విభూషణ్ అందుకున్నది నట దిగ్గజం, దివంగత అక్కినేని నాగేశ్వరరావు. 2011లో అక్కినేని నాగేశ్వరరావుకు పద్మ విభూషణ్ ప్రకటించింది కేంద్రం. ఆ తర్వాత ఇన్నాళ్లకు ఆ అవార్డు వరించింది. దశాబ్దాల సినీ తెలుగు చరిత్రలో పద్మ విభూషణ్ అవార్డు ఇద్దరికి మాత్రమే దక్కింది. భాషతో సంబంధం లేకుండా సినీ పరిశ్రమలో చాలామంది ప్రముఖులకు అవార్డులు అందుకున్నారు.
వారిలో సినీ రంగంలో ప్రస్తుతం వీరిద్దరి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక వెంకయ్య నాయుడు చిరంజీవిని కలిసి శాలువా కప్పి గౌరవించారు. పద్మ విభూషణ్ అందుకోబోతున్న నేపథ్యంలో శుభాకాంక్షలు తెలిపారు. వెంకయ్య నాయుడు కూడా చిరంజీవికి పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. ఆయనకు మెడలో ఉత్తరీయం వేసి సన్మానించారు. చిరంజీవికి కూడా కేంద్రం పద్మ విభూషణ్ ప్రకటించడం పట్ల వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను చిరంజీవి ఎక్స్ లో పంచుకున్నారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.